ఓం శ్రీ సాయి రామ్
శ్రీ
సత్యసాయి సేవా సంస్థలు, శివం, హైదరాబాద్
జిల్లా.
హైదరాబాద్ నగరంలో వైభవంగా శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రధోత్సవ నిర్వహణకు ప్రణాళిక
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు, ప్రబోధించిన
విధముగా, ఈ ప్రేమ ప్రవాహిని రధం, గుఱ్ఱముల
వంటి ఇంద్రియములను, మనస్సు అనే తాడుతో కట్టి, రధము వంటి శరీరమును,
రధ సారధి అయిన ఆత్మద్వారా, అదుపు చేయాలి అనే,
తత్వ జ్ఞానాన్ని, ప్రభోదిస్తుంది.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా
వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి బాబా వారి శత వర్ష
జయంతి వేడుకలలో, భాగంగా, శ్రీ సత్యసాయి ప్రేమ వాహిని ఐదు రథములు, స్వామి వారి ఆరాధనా
దినోత్సవం నాడు అంటే 24-4-2025 న భారత దేశం నలు మూలల స్వామి
వారి సందేశ వ్యాప్తి కోసం, “అందరిని ప్రేమించు - అందరిని
సేవించు,” మరియు స్వామి దర్శనం కోసము పంపిన విషయము విదితమే. ఈ ప్రేమ ప్రవాహిని
రధ యాత్ర 2026 నవంబర్ నాటికి ప్రశాంతి నిలయం లో
ముగియనున్నది.
ఈ క్రమములో, తెలంగాణ
రాష్ట్రంలోకి ఈ ప్రేమ ప్రవాహిని, రధము, జోగులాంబ గద్వాల్ జిల్లా లోని అలంపూర్
లో గల, 5 వ శక్తి పీఠము, జోగులాంబ ఆలయం వద్ద , శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, తెలంగాణ రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షులు వారి బృందం, వేద మంత్రాలతో, సన్నాయి,
వాయిద్యాలు, కోలాటములతో, చెక్క భజనలతో, తెలంగాణ రాష్ట్రానికి, ఎంతో వైభవముగా, స్వామి వారిని ఆహ్వానించడమైనది.
వనపర్తి, నాగర్ కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లా మీదుగా, శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రధం హైదరాబాద్ జిల్లాలోకి డిసెంబర్, 16 వ తేదీన
రానున్నది. రధాన్ని, ఆహ్వానించుటకు, హైదరాబాద్
జిల్లా అధ్యక్షుల పర్యవేక్షణలో, భారీ భద్రత, నడుమ పటిష్ట మైన ఏర్పాట్లతో
ప్రణాళిక సిద్ధం చేయబడినది.
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,హైదరాబాద్
జిల్లా అధ్యక్షులు మరియు బృందం, దిల్ సుఖ్ నగర్లో గల,
శ్రీ సత్య సాయి సేవా ధామం మందిరంలో,
ట్రస్ట్ సభ్యులు, సమితిలో గల పెద్దలు, యాజమాన్యం, ఆర్ టి సి,
అధికారులు పాల్గొన
నున్నారు.
ఇదే తరహా లో హైదరాబాద్ లో గల 16 సమితి లలో, రోజుకు 3 సమితిల చొప్పున రధము, సంచరించే ప్రాంతముల వివరములు.
17-12-2025: దిల్
సుఖ్ నగర్, అంబర్పేట్, కాచిగూడ.
18-12-2025: తార్నాక,
మారేడ్ పల్లి, సీతాఫల్ మండి
19-12-2025: విద్యానగర్,
గాంధీనగర్, హిమాయత్నగర్,
20-12-2025: అమీర్పేట్,
ఎస్ ఆర్ నగర్, వెంగళరావు నగర్,
21-12-2025: మెహదీపట్నం,
ఖైరతాబాద్, MNJ Cancer Hospital వద్ద నున్న శ్రీ
సత్యసాయి ఆశ్రిత కల్ప తదుపరి భక్తుల దర్శనార్ధం శివం మందిర ప్రాంగణంలో.
22-12-2025: ప్రశాంతి నగర్, కోటి,
బాగ్ అంబర్పేటలోని, శ్రీ సత్యసాయి విద్యా
విహార్ హై స్కూల్, తదుపరి ఈ పవిత్ర రధం భక్తుల దర్శనార్ధం
శివం మందిర ప్రాంగణం చేరుకుంటుంది.
భక్తుల సందర్శనాంతరము,, మేడ్చెల్,
మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుల బృందమునకు శ్రీ సత్యసాయి ప్రేమ
ప్రవాహిని రధం అంద జేయ బడును.
అధ్యక్షులు,
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,
శివం , హైదరాబాద్ జిల్లా.
ఆత్మీయ జిల్లా అధ్యక్షులకు,జిల్లా సమన్వయకర్తలకు సమితి కన్వీనర్లకు సమితి సమన్వయకర్తలకు సాయిరాం.
1. రథమును మన జిల్లాలో ఏ ప్రాంతం నుండి తీసుకొని ప్రారంభించుకోవడం, పట్టణాల్లో రథయాత్ర చేసుకుంటూ ఏ ప్రాంతంలో ముగించుకోవడం మొదలైన విషయాలపై సరైన రూట్ మ్యాప్ ను సంసిద్ధపరచుకోవడం.
2. రూట్ మ్యాప్ ను తేదీలతో సహా పోలీసువారికి ముందుగా తెలియపరచడం
3. రూట్ మ్యాప్ తేదీ సమయం మన జిల్లాలోని భక్తులందరికీ ముందుగానే తెలియపరచడం మరియు వారిని సంసిద్ధ పరచడం
4. కొత్తవారికి రథయాత్ర యొక్క విశిష్టతను తెలియపరచడం వారిని ఎక్కువ సంఖ్యలో ఇందులో పాల్గొనేలా చేయడం.రథం వచ్చినప్పుడు గ్రామస్తులు కానీ భక్తులు కానీ మంగళ హారతులు ఇవ్వడం, స్వామివారికి పూలను సమర్పించడం, కొబ్బరికాయలను సమర్పించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు అనే విషయాలను ముందుగానే తెలియపరచడ
5. రథమును డెకరేట్ చేయుటకు తగిన పూలు, మామిడి ఆకులు అరిటి స్తంబములు సిద్ధపరచుకోవడం మరియు స్వామివారి చిత్రపటానికి తగిన పూల మాలలను తయారు చేసుకోవడం
6. దారి వెంబడి స్వామివారిని దర్శనం చేసుకునే భక్తులకు ఏదైనా ప్రసాదం కానీ విభూతి ప్రసాదం, స్వామివారి ఫోటో పాత సనాతన సారధి పుస్తకాలను కొత్త వారికి అందించడం కోసం సంసిద్ధపడడం.
7. మన ప్రాంతంలోని కోలాటం/చిరుతల భజన/ డప్పులు/ నాట్య రీతులు లాంటి వారిని రథయాత్రలో భాగస్వామ్యం చేయడం.
8. మహిళా భక్తులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ చీరలచే స్కార్ఫ్ వేసుకొని రథ యాత్రలో పాల్గొనడం.
9. బాల వికాస్ పిల్లలు వివిధ వేషధారణలతో రథయాత్రలో పాల్గొనేలా చూడడం.
10. జెంట్స్ యూత్ సభ్యులు బైక్ పైలెట్ గా స్వామి వారి రథం ముందు జెండాలతో స్కార్ఫ్ వేసుకొని పాల్గొనడం.
11. స్థానిక ఉన్నత అధికారులను ప్రజా ప్రతినిధులను ఇట్టి కార్యక్రమాలలో పాల్గొనేలా ఆహ్వానించడం.
12. కార్యక్రమ సరళిని తగిన ఫోటోలు వీడియోలు తీయుటకు ఒకరికి బాధ్యత అప్పగించవలెను
13. కార్యక్రమ వివరములను స్థానిక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కవర్ చేయునట్లుగా చూడడం
14. ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొన్న సమయంలో స్వామివారి గురించి సంస్థ గురించి చక్కని ఉపన్యాసాన్ని అందించడం.
15. రాత్రి సమయంలో రథానికి రక్షణగా ఉంటూ జాగ్రత్తగా చూసుకొనుటకు ఒక టీం ఏర్పరచుకోవలెను.
16. ప్రతిరోజు ఉదయం ఓంకార సుప్రభాత అష్టోత్తర పూజ మరియు వేద పఠనం భజన తప్పనిసరిగా నిర్వహించవలెను.
17. రథంతోపాటు వచ్చు భక్తులకు/మన సేవాదళ్ సభ్యులకు అల్పాహారము /నీటి వసతి/భోజనవసతి ఏర్పాటు చేసుకోవలెను.
18. అంగరంగ వైభవంగా అత్యంత భక్తిశ్రద్ధలతో మనకిచ్చిన తేదీలలో మన జిల్లా లో స్వామివారి రథమును ఊరేగించుకొని అత్యంత జాగ్రత్తగా ప్రేమ పూర్వక భక్తితో హారతి ఇచ్చి స్వామివారి రథాన్ని తర్వాతి జిల్లాకు అందించవలెను.
జై సాయిరాం...
రాష్ట్ర అధ్యక్షులు,
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,తెలంగాణ.
.jpeg)




.jpg)








.jpg)