Thursday, February 25, 2021

BHAGAWATHA VAAHINI PARAYANAM FROM 25-2-2021 ONWARDS.

 

భాగవత వాహిని 

స్వామి దివ్య ఆశీస్సులతో  నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 

11 మంది గ్రూప్ లీడర్స్ 



VIDEO LINK:

25-1-2021 : PAGE 1 TO 13 PAGES: అవతార తత్వం 




59 comments:

  1. (25.2.2021)🙏. ఎవనిఆనతినిదియో *అతడేఇతడు ఇతడేఅతనని సర్వులకుఅధిపతిఅనికాంచరయ్యా*. (బాబా). Thankyou Swami,,(saraswatiprasad).

    ReplyDelete
  2. 2nd chapter, Bhagavatavahini, కారణము నిమిత్తము కర్మ జరుగక తీరదు, 🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. 26.2.2021,2ndchapter, Bhagavatavahini, ధర్మరాజు:: ఆనందమున చేతులు జోడించి పెద్దల అనుగ్రహముచేతనూ,భగవత్కృపా కటాక్షము చేతను, మీబోటి పండితోత్తములఆశీర్వచనములతోనూ మావంశమునతిరిగి ఇట్టి పుత్రరత్నం పొందగలిగితిమని తెలిపెను🙏(సరస్వతిప్రసాద్).

    ReplyDelete
  5. (27.2.2021),3వఅధ్యాయం,కృష్ణుని ఒడిలో కూర్చుని ఉన్న పిల్లవాడు సామాన్య పిల్లలవలె అటుఇటు తిరగక కనురెప్పలు వేయక, ఆడక, కృష్ణపరమాత్ముని ముఖకమలమును తదేకదృష్టితో చూచుచుండుట, చూపరుల అందరికీఆశ్చర్యమును కలిగించినది కృష్ణ పరమాత్మకు సహితము ఆశ్చర్యం కలిగించినది.🙏 (సరస్వతీప్రసాద్)

    ReplyDelete
  6. (28.2.2021) 4వఅధ్యాయములో::స్వార్ధ రహితమైన దేశక్షేమమునకు కంకణము కట్టి కత్తిపట్టి పోరాడుట క్షత్రియుని సహజ ధర్మము. నీవునీ ధర్మమునెరవేర్చితివి. ధర్మకర్మలయందు పాపమెట్లు ప్రవేశించును? నీకు ఎట్టి పాపములను పట్టవు,చుట్టవూ,బాధపెట్టవు,అని కృష్ణపరమాత్మ, ధర్మజుని ఓదార్చను ఓదార్చెను.🙏(సరస్వతిప్రసాద్).

    ReplyDelete
  7. (1.3.2021),5వ అధ్యాయములో:: యజ్ఞ పురుషుడు,శ్రీకృష్ణపరమాత్మ యజ్ఞస్వరూపుడు, యజ్ఞాధిపత్యమువహించగా,ఆయజ్ఞం ఎంత శోభించునో,వేరు చెప్పనక్కరలేదు. ధర్మజుడు తలపెట్టిన యజ్ఞం పూర్ణాహుతితో సమాప్తి గావించిరి 🙏(సరస్వతిప్రసాద్).

    ReplyDelete
  8. 2.3.2021,6వఅధ్యాయములో::చిన్నప్పటి నుండియు పెంచి పెద్ద చేసిన పిల్లలగు పాండవులు యుద్ధంలో విజయం సాధించి రాజ్యమును పాలించుచున్న వార్త విని విదురుడు తిరిగి,హస్తినాపురం చేరెను. వైరాగ్యం రాక రాజభవనము నన్నే సర్వ సుఖములను అనుభవించుచూఉన్న దృతరాష్ట్రునిచేరి, పరమాత్మ చింతన తో కారడవులప్రాణములు విడుచుట పరమపవిత్రం అని తెలిపెను 🙏.(సరస్వతిప్రసాద్).

    ReplyDelete
  9. ధృతరాష్ట్రుడు,విదురునితో::7వ అధ్యాయం,vidura ఇంత పవిత్రమైన హితమును బోధించిన నిన్ను ఏమని పలుకుదునూ అని, కాయమునకు చిన్నవాడవైననూ,జ్ఞానమందు, మాకందరికీ గురువు వంటివాడవు అని తెలిపి, వైరాగ్యము నలుపూనెను🙏.(సరస్వతీప్రసాద్).

    ReplyDelete
  10. (4.3.2021):8వఅధ్యాయము,గాంధారీధృతరాష్ట్రులు తపోవనమున సుఖాసనంఆసీనులై, తపమునుఆచరించుచూ,నిరంతరము పరమాత్మ చింతనతో హృదయమునుకు ఆనందమునముంచి తన్మయులైఉండ,కాననమునపుట్టినదావాగ్ని దానికదేవచ్చి వారికాయములను భస్మముచేశెను. విదురుడు ప్రభాస క్షేత్రము చేరి తన భౌతిక దేహము వదలెను🙏.సరస్వతీప్రసాద్.

    ReplyDelete
  11. (5.3.2021),9వఅధ్యాయం, ధర్మరాజు సోదరులతో:: వాసుదేవుడు, లోకమునువీడకున్న ఈ అశుభములు ఇంత స్వేచ్ఛగా సంచరించవు. ఇది నిస్సందేహంగా నా హృదయమే ఇందుకు సాక్షి, అనితెలుపగా, అందరి మోములు కొంత వాడెను, ధైర్యము కూలెను. 🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete
  12. (6.3.2021)10వఅధ్యాయం::జనన మరణములనబడు రెండు పర్వతములకు మధ్య జీవితమను ప్రవాహము కలదు.దానినిదాటుటకు ఒక ఆత్మశక్తి అను వంతెన ఒకటినిర్మించెను.మదానిని ఆధారం చేసుకుని ప్రయాణము సలుపువారలకు ఇట్టి జీవనప్రవాహంతో ఎట్టిబాధ ఉండదు. ఆత్మశక్తిని ఆధారం చేసుకుని ప్రవాహములో కొట్టుకొని,తట్టుకొని,గట్టు చేరుదురు.🙏(సరస్వతిప్రసాద్).

    ReplyDelete
  13. (7.3.2021),11వఅధ్యాయము:: కృష్ణహస్తఅక్షరములలేఖ::, బావా అర్జునా! ఇదినాఆజ్ఞ, మారుమాటాడక శిరసావహించివలెను. నేను వచ్చిన కార్యము నెరవేర్చితిని. నేనుఇక ఈలోకమున కాయరూపమునఉండను.స్వధామమునకు పోవుచున్నాను,యాదవ వంశములోని స్త్రీలయొక్క పిల్లలయొక్క భారం నీ పై నుంచి వెళ్లుచున్నాను ప్రాణ సమానంగాకాపాడి ఇంద్రప్రస్థమునతగిన వసతులు, కల్పించి కాపాడుము, అని అర్జునునికి లేఖ పంపెను.🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete
  14. *శ్రీ కృష్ణ భగవాన్ ఉవాచ::హృదయమును బట్టి అంగములు వాటి వాటి పనిచేయు నే కానీ హృదయము లేకున్న అంగములు నిర్జీవములు. ఈ దేహమునకు ప్రధానమైనశిరస్సు వంటివాడు ధర్మజుడు, భుజం వంటి వాడు అర్జునుడు,ఉదరం వంటివాడు భీముడు, రెండు పాదముల వంటివారు నకులసహదేవులు. ఇట్టి దేహములోని హృదయమే ఈ కృష్ణుడు*.🙏saraswatiprasad

    ReplyDelete
  15. 9.3.2021*ధర్మరాజు బ్రాహ్మణులను పిలిపించి పరీక్షిన్మహారాజునకు రాజ్యాభిషేక ప్రయత్నము సాధారణవిధులచేతనే చేయించ పూనుకొనెను*
    *బ్రాహ్మణులను,పురోహితులను పిలిపించి, మంత్రులను వెంటబెట్టుకుని బాలుని సర్వాభరణాలంకారునిగావించి అతనిని సింహాసనముపై కూర్చుండబెట్టి ధర్మజుడు తన చేతితో సువర్ణరత్నమండితమగు,తన దివ్య మకుటమును పిల్లవాని శిరస్సునపెట్టి ఆశీర్వదించెను*.🙏

    ReplyDelete
  16. 10.3.2021,*ధర్మరాజు పరీక్షిత్తునితో::తల్లి అయినను, తండ్రులయినను తాతలయినూ,అన్నియు నీకీ బ్రాహ్మణులే.వారల సలహాలను అనుసరించి రాజ్యము పాలించుము.* *సార్ధక నామము సాధించుము, అని ఓదార్చజొచ్చెను.*
    *అర్జునుడు తన మనుమడైన పరీక్షిత్తునితో::మమ్ము ఏ రక్షకుడు పెంచి పెద్దచేసి ఇంతకాలం మా జీవితములను నడిపించెనో, ఆ రక్షకుడే నిన్ను కూడాను కాపాడును అని ఓదార్చెను*
    *ధర్మరాజు కృపాచార్యునితో:: ధర్మాచరణములయందు కానీ వంశ పారంపర్యమర్యాదలను కానీ,మార్చక నిలుపునట్లు కుల కళంకము కాకుండునట్లు చూచు కొనుడు, అని పరీక్షిత్తుని కృపాచార్యుని చేతికి అందించెను*.
    *ధర్మజుడు పరీక్షిత్తుని చేయిపట్టుకుని, వజ్రుని చేయి తీసుకొని, ఇతను యదు వంశధారుడగువజ్రుడు, ఇతనినిమధురాసూరసేన దేశములకు రాజుగా చేసితిని*అని అతని శిరస్సున సువర్ణ వజ్ర ఖచితమగు కిరీటమును పెట్టెను** *ఇరువురును ధర్మమును వీడక ప్రజా క్షేమమే తమ ప్రాణములుగా భావించి పరిపాలన జరుపవలెనుఅని, తెలుపుతూ పాండవులందరూ అక్షతలు వేసిరి*
    *ఏమియుతాగక,తినక ,విశ్రాంతిగొనక ఉత్తర దిక్కునకు వెడలుటను, దీనినే మహాప్రస్థానం అని అందురు, పాండవులు మహాప్రస్థానమును నియమించిరి.*🙏

    ReplyDelete
  17. 11.3.2021,*ఇప్పుడు భరతవంశ సింహాసనమున పరీక్షిన్మహారాజు న్యాయ పరాయణులై, ధర్మాత్ము ప్రజావత్సలుడై,ప్రజలకు ప్రాణ సమానుడై,పరిపాలన కొనసాగించు చుండెను తదుపరి,జనమేజయుని జననం అందరికీ శుభవార్త*.🙏 saraswatiprasad

    ReplyDelete
  18. *12.3.2021,అశ్వమేధయాగము జరిపించిన ఋత్విక్కునితో పరీక్షిన్మహారాజు:: స్వామి! ధన్యుడను.కృష్ణ పరమాత్మను చూడలేకపోయిననూ అతనిచే పూజింపబడిన పాదములు నాకు ప్రాప్తించెను, అని బ్రాహ్మణుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసెను.*🙏 saraswatiprasad

    ReplyDelete
  19. *13.3.2021,పరీక్షిత్ శ్రద్ధాళుడై, చేతులు జోడించుకొని వ్యాసులవారితో:: స్వామీ! మొదలు మా తాతలకు కృష్ణ పరమాత్మ కు ఎట్లు స్నేహంకుదిరెనో, ఆ విషయమును గురించి తెలుపమని కోరెను** *వ్యాసులవారు పరీక్షిత్తునితో:: మొదలు కృష్ణుడు మీ తాతను చూచుట ద్రౌపది స్వయంవరం,మంటపమందే. చూచితివా? వారి చేరిక కళ్యాణమంటపమున కనుకనే,* *అర్జునుడు జీవితమంతయూ, నిత్య భగవత్ సన్నిధియను కల్యాణమున పారమార్ధప్రాప్తిని అనుభవించెను.*
    *ఆ విధముగా బలరామకృష్ణులు మీ తాతల తల్లికుంతినీ, పాండవులను* *కలిసెను.అనితెలిపెను*.🙏 saraswatiprasad

    ReplyDelete
  20. 14.3.2021,బ్రాహ్మణ వేషంలో వచ్చిన అగ్నిహోత్రుడు కృష్ణ అర్జునుల సహాయముతో ఖాండవవనదహనం🙏(saraswatiprasad)

    ReplyDelete
  21. *15.3.2021,ధర్మజుడు,మయుడు నిర్మించిన సభలో రాజసూయయాగమును అతి వైభవముగా జరిపించుట చూసిన కౌరవులు దురాలోచనతో మాయాజూదం అను పేరుతో ఒక పన్నాగమును పన్నిరి*.ద్రౌపదితో సహితముపాండవులు,ఓడిపోయిరి* *ఒకదాసిగ*
    *నిండుసభలో కులస్త్రీ ద్రౌపదిని పరాభవము చేస్తున్న సమయములో *ద్రౌపది సంపూర్ణ శరణాగతురాలై,కృష్ణుని ప్రార్ధించెను,కృష్ణుడు అనుగ్రహించెను*
    *పాండవుల భక్తి భగవద్ విశ్వాసమును ప్రకృతికి చాట తలంచి, రాబోవు కలియుగమునకు ఆదర్శప్రాయంగా చేయతలంచి, పరమాత్ముడాడిన లీలా నాటకమే కానీ, ఇది, వేరు కాదు.*
    *అని వ్యాసులవారు పరీక్షిత్తునకు తెలియజేశెను*.🙏 saraswatiprasad.

    ReplyDelete
  22. 16.3.2021*దుర్యోధనుని వద్ద ఆతిథ్యం స్వీకరించిన దుర్వాసమహర్షి దుర్యోధనుని అభీష్ట ప్రకారము పదివేల మంది శిష్యులతో ధర్మ జుని, ఆతిథ్యం స్వీకరించుట కొరకు అరణ్యమునకు బయలుదేరెను*.
    *అంత దుష్టబుద్ధితో దుర్యోధనుడు మహామునితో::*
    *స్వామి మీ నా కోరిక మన్నించి ద్రౌపది భోజనము చేసిన తరువాత మీరు అచ్చటికి చేరిన వారి మహత్తరమైన భక్తి శక్తి మీరు తిలకించగలరు,* *మీరు వెళ్లి వారందరూ భోజనాలు ముగించుకుని విశ్రాంతిగా నుండు సమయమున*, *తమకూ తమ భక్తబృందమునకూ, భోజనమిడు మని కోరిన నాకు మహదానంద మును అందించిన వారగుదురు* *అని తెలిపి, నమస్కరించెను*.🙏saraswatiprasad

    ReplyDelete
  23. *17.3.2021,ఒకపరి ద్రౌపది భుజించక,పూర్వము, ఎన్ని లక్షలు కోట్లకు దినమంతయు పెట్టినను తరగని సూర్యదత్త పాత్ర, పాండవులు, ద్రౌపది భోజనానంతరం శుభ్రపరచబడినది*. *ఇంతలో దుర్వాసుడు తన శిష్యబృందంతో ప్రవేశించెను. కృష్ణా! ఏమిటి పరీక్ష రక్షింపుము అని ప్రార్ధించగనే,నదిలో స్నానము చేయుచున్న* *దుర్వాసునకు అతని పదివేల మంది శిష్యులకు పొట్టలు నిండి,కదలలేని పరిస్థితి ఏర్పడింది నిర్జల ఉపాసనతో ఏకాదశి వ్రతమును* *ఆచరించిన,పరమభక్తుడైనఅంబరీషునివద్ద,ద్వాదశినాడు,ఆతిథ్యముస్వీకరించడానికి వెళ్ళిన* *దుర్వాసునికి జరిగిన వృత్తాంతము జ్ఞప్తికి వచ్చి దుర్వాస మహాముని శిష్యులు వెనుతిరిగిరి*🙏 saraswatiprasad

    ReplyDelete
  24. 18.3.2021,*ధర్మజుని అనుజ్ఞతో, భగవంతుని అనుగ్రహఅస్తృములను సంపాదించుటకు, అర్జునుడు అరణ్యమునకేగి,దీక్షబూనెను.శివుడు కిరాతునిరూపంలో ప్రత్యక్షమై అర్జునునితో,యుద్ధమొనర్చెను*. *అర్జునుడు పరాభవముపొందెను *కృష్ణుని ప్రార్ధించెను*
    *క్రుపాళుడైన, గౌరీ శంకరులు అర్జునుని తల నిమురుతూ నాయనా! పురుషార్థములు సార్థకం* *చేసుకొంటివి. ఇదిగో తీసుకొమ్ము.నా అనుగ్రహ ప్రసాదమని*, *పాశుపతాస్త్రమును ప్రసాదించెను*.🙏 saraswatiprasad.

    ReplyDelete
  25. (19.3.2021)*విజయ సారథి,భక్త వత్సలుడు,శ్రీకృష్ణపరమాత్మ సేవలు::*
    *సారధి కృష్ణుని యొక్క రెండు కణతలకు అర్జునుని కాలి బొటనవేళ్ళు రెండునూ తాకినట్లు ఉంచుకొన వలసివచ్చెను* *ఎటు దిక్కు వెళ్ళవలెనన్న, అటువైపున, కాలి వేలు ఆ కణతను నొక్కవలెను. సూటిగా పోవలసి వచ్చిన రెండు నూ సమానముగా,కణతలు బొటన వేళ్ళతో నొక్కి వలసి వచ్చేది*.
    *కృష్ణుడు మీ తాతలకు ఒక పనివాని వలె మెలగెనుగాని, పరమాత్మునివలె, తిరుగులేదు. అది యే భక్తవత్సలత. అని వ్యాసులవారు తెలిపిరి*.🙏 saraswatiprasad.

    ReplyDelete
  26. 20.3.2021,24chapter*శమీక మహర్షి తన కుమారుడు శృంగితో::*
    *సర్వలోక రక్షకుడైన సర్వేశ్వరుని సాన్నిధ్యమును పొందగోరి సర్వసంగ పరిత్యాగులై*, *కానన మునబడి*, *కందమూలాదులను* *భక్షించి,కాయ సుఖముల విసర్జించి కాలమును గడుపుతున్న* *మునులకు ఇట్టి కఠిన భావములు కలుగుట కలికాల ప్రవేశము కాబోలు*. *అయ్యో! ఎంతటి పాపమునకు ఒడిగట్టుకొంటివి!అని విచారంతో కుమారుని మందలించెను*🙏. saraswatiprasad

    ReplyDelete
  27. ఓం శ్రీ సాయిరాం
    *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమితి హైదరాబాద్*

    *మహిళా దినోత్సవ వేడుకలు 19-3-2021*
    శ్రీమతి సీతాదేవి మాతృదేవోభవ అనే అంశంపై ఐదు నిమిషాల పాటు వారి ప్రసంగం ఉంటుంది
    శ్రీమతి నిర్మల ఢిల్లీ-
    శ్రీమతి అన్నపూర్ణ - భగవత్ ప్రేమ- పరమాత్మ తత్వం అనే అంశం
    శ్రీమతి కె నాగమణి
    శ్రీమతి సరస్వతి
    శ్రీమతి సరస్వతి ప్రసాద్ భక్త మీరా
    శ్రీమతి సూర్య -
    శ్రీమతి పి సీతామహాలక్ష్మి
    శ్రీమతి JAYA లక్ష్మి, శివరాత్రి విశేషాలు
    శ్రీమతి స్వరాజ్యలక్ష్మి
    శ్రీమతి భువనేశ్వరి*,, జీవితాన్నిసార్థకంచేసుకోవడంకోసం తెలిసి కొనవలసిన ముఖ్యమైన విషయముల గురించి దాదాపు 11 మంది మహిళలు ప్రసంగించారు. 🙏స్వామివారు తెలిపిన విధంగా,ప్రతి ప్రసంగము లోనూ గుర్తుంచుకొని, వర్తించవలసిన విషయములు ఉన్నవి. మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, thank you for, such nice enlightening selections of the topics. Very useful in daily life, to get elevated. Thanking Swami for giving such wonderful opportunity to listen to, without missing any word.🙏(saraswatiprasad)

    ReplyDelete
  28. *(21.3.2021) (ఆదివారము జ్యోతి ధ్యానం.)శమీక మహాముని తన కుమారుడు శృంగి తో::*
    ఎవరూ పలుకక అతను ఆశించిన గౌరవము అందుకు లేకపోవుట నిరాశ తాపములు మరొకవైపున ఆవరించి భరించలేక ఈ విధమైన అనుచిత కార్యమును చేయుటలో కొంత పొరపడియుండును. అంత మాత్రముననే నీవు కుపితుడవై ఋషి కుమారులకు విరోధమైన ఇట్టి కార్యమునకు పూనుకొని తాపస లోకమునకు తీరని పాపమును చేకూరి "ఛీ,ఛీ,మీ ఎట్టిద్రోహము నొనర్చితివి" అని మందలించెను
    *శమీక మహాముని పంపిన శిష్య రత్నము తో పరీక్షిన్మహారాజు::*
    "ధన్యుడను,మహాఋషులు, రాజ్య ప్రజలు సుభముగా ఉండిన నాకెన్ని అశుభములు సంభవించిన పరవాలేదు.వారల సుఖశాంతులే నా ఉచ్ఛ్వాస నిశ్వాసములు అని కొంత శాంతుడై తన గురువు గారు ఏమి సెలవిచ్చిరో, తెలుపమని ప్రార్ధించెను*.🙏(సరస్వతీప్రసాద్)

    ReplyDelete
  29. (22.3.2021)*శిష్య రత్నము పరీక్షిన్మహారాజుతో:: ముని కుమారుడు శృంగికౌశికీ జలమును స్పర్శించి, నేటికి ఏడవ దినమున నీవు తక్షక సర్పదష్టుడవు కాగలవు అని భయంకర శాపమునొసంగెను.*
    *అంత, పరీక్షిన్మహారాజు:: శ్రీహరి చింతన చేయమని భగవద్ ఉద్దేశమయిఉండును, కాబోలు! ధన్యుడను!ఇప్పటి నుండే ఆ శ్రీహరి చింతనలో కాలమును, కాయమును,అతనిచరణాంబుజముల నాశ్రయించి అర్పిత మొనర్తును*అని, సర్వసంగ పరిత్యాగియై,కిరీటమును తన కుమారుడు జనమేజయుని శిరస్సుననుంచి,ఆ బాలుని వృద్ధ బ్రాహ్మణులకు,అప్పచెప్పి కట్టు గుడ్డలతో, కాలినడకతో గంగా నది వైపు వెళ్ళెను*🙏 saraswatiprasad.

    ReplyDelete
  30. (23.3.2021)పరీక్షిన్మహారాజు మునిశ్రేష్ఠులతో::
    మృత్యువాసన్నమైనవాడు ఏ కర్మ చేయవలెనో తెలుపుడుఅని ప్రార్ధించెను.
    యజ్ఞ,యాగ,తప, ధ్యాన, వ్రత, తీర్ధ దాన పూజార్చాదులు, మంచిదని కొందరు, జ్ఞానా దేవతు కైవల్యం అని కొందరు, భక్తివశఃపురుషః అని కొందరు తెలిపిరి.
    *ఇంతలో, పుట్టుకతోనే సర్వ సంగ పరిత్యాగి మహాజ్ఞాని, ఒక దిగంబర యువక,ముని కుమారుడు మహా తేజోమయ స్వరూపుడు దివ్యకాంతులతో, వ్యాసభగవానుని పుత్రరత్నం అయిన* *శ్రీ శుకుడువచ్చి ఉన్నతాసనమున కూర్చుండెను*.
    *నేను భాగవతతత్వమును చెప్పెదను. హృదయపూర్వకముగా శ్రవణము చేయుము. ఇంతకంటే పవిత్ర కర్మ, పవిత్ర చింతన, గొప్పతపశక్తి ,వేరొండులేదు* . *నర తనువే దృఢమైననావ.శ్రీహరి కథనే చక్కని చుక్కాని. సంసారమే భవసాగరము. నారాయణుడే సరియైన నావికుడు. నీకు కలిగిన సంశయము లోకకళ్యాణ కార్యమే కానీ, నీ నిమిత్తము మాత్రమే కాదు,వినుము, అని ప్రారంభించెను*.🙏.
    కోటిసమితిసత్సంగములోNov12న2008,నప్రశాంతి నిలయంలో జరిగిన వద్దిపర్తిపద్మాకర్గారి భక్త ప్రహ్లాదచరిత్రప్రసంగం,వినగలిగాము.(saraswatiprasad).

    ReplyDelete
  31. (24.3.2021)శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో*::
    *మహారాజా భాగవతము మహా వృక్షము .అది భవ్యమైనది.* *సమస్త శుభములు, సుఖములు* *దానిలో ఇమిడి ఉన్నవి. ఈ పవిత్ర వృక్షమునకు శ్రీమన్నారాయణుడే బీజము బ్రహ్మ అంకురము*. *వ్యాసుడు శాఖ, అందులోని మధుర ఫలమే కృష్ణ కథామృతము. భగవత్ సంకల్పమేఈధరణి నిర్మాణము శతరూప మనువులే,*సృష్టికి ఆది కర్తలు. అని తెలిపెను* 🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete
  32. (25.3.2021)*సర్వపాప నిర్మూలనం,సర్వ శుభప్రదము చేకూర్చు ఆ దివ్య కృష్ణ నామామృతము నాకు త్రాపి,నా తాపమును చల్లార్చుడు,అని వినయముతో ప్రార్ధించు మహారాజు నిచూచి, శుకుడు, చిరునవ్వుతో::* *నీకునూ, నీ మూలమున ఈ మహనీయులకునూ,వినిపింతును. చేసి దానిని శ్రవణము చేయు సామర్ధ్యము నీకున్నది.*
    *మహారాజా! నీ బోటి ఉత్తమ అధికారికి తగిన పవిత్ర అనుభవాకారుడే లభించెను, నీ భాగ్యమే భాగ్యము అని శిరస్సున హస్తముంచి కురులు నిమురుతూ ఆశీర్వదించెను*. *సందేహములను నిర్మూలనం చేయు ఖట్వాంగుడు కథను వినిపించెను*.🙏 In satsangam,Kenopanishad by profAnilkumargaru,dec31prgm,byAlumniPrashantinilayam(saraswatiprasad).

    ReplyDelete
  33. 25.3.2021,,భగవానువాచ:వ్యధ,క్లేశము నన్ను స్పృశించవు."ఏకమేవాద్వితీయంబ్రహ్మ","dual to non dual"(satsangam,3.30pmto 5pm), saraswatiprasad 🙏

    ReplyDelete
  34. (26.3.2021),
    *పరీక్షిన్మహారాజా! ఉఛ్ఛ శ్రేణికి చెందిన శ్రోత అగుటవలననే నారదునకు బ్రహ్మ ఉత్తమ జ్ఞాన సారమును త్రాగించెను*. *నీవునూ ఇట్టి ఉచ్ఛశ్రేణికి చెందిన శ్రోతవగుట చేతనే ఎవరికీ లభ్యముకాని, నేను నీ చెంతకే వచ్చి* *పవిత్ర భాగవతమును శ్రవణము చేయించడం మొదలిడితిని. నేను సామాన్య వ్యక్తిని కాను*.
    *అట్టి కోవకు చెందిన వారు సగరుడు,ఇక్ష్వాకు, ప్రాచీనబర్హి ,ఋభువు, ధ్రువుడు,రఘుమహారాజు, మాంధాత, భీష్ముడు, విభీషణుడు, హనుమంతుడు, శతరూప* *మొదలగు వారందరూ భాగవతులే.అటులనే ఒకపరి ఆ సుందరుని పాద పద్మముల యందు మనస్సు చేరెనా,! మకరందపు రుచి చూచెనా! తిరిగి తాను అన్యమునుఆశించదు* *అని శుకుడు పరీక్షిత్తునకు సమాధానం చెప్పెను* 🙏saraswatiprasad

    ReplyDelete
  35. 27.3.2021*పరీక్షిత్తు శుకునితో:: నన్ను దుర్గతి నుండి రక్షింపుము మిమ్ములను శరణుజొచ్చితిని,అని ప్రార్ధించెను*.
    *శుకుడు పరీక్షిత్తునితో:: తపమేఅన్నింటికి సారమయినది, కావున తపము చేయుము* *ఇంద్రియములను పవిత్ర పరమాత్మ విషయములందు అంకితము చేసి జపము,ధ్యానము లేక ఇంకే విధమైన పవిత్ర కార్యములందో- ఒకే మాట*, *ఒకే భావం,ఒకే చేతతో మనోబుద్ధి ఇంద్రియములను తపింపచేయుటనే తపస్సని అందురు*పరీక్షిత్ పురాణములు ఎన్ని అవి ఏవి? తెలుపుమని కోరెను.*పురాణములు అసంఖ్యాక ములు. కానీ ఈ సమయమున పదునెనిమిది పురాణములు*, *పదునెనిమిది ఉప పురాణములు*, *పదునెనిమిదిఉపోపపురాణములుమాత్రమే ప్రసిద్ధములగుచున్నవి. వీటన్నింటిని, నా తండ్రియగు, వ్యాసులవారే సంగ్రహించిరి,అని శుకమహర్షి తెలిపెను*🙏, కోటి సత్సంగంలో ఈరోజు 'చిన్మయి'శీర్షికన, ప్రొఫెసర్ అనిల్కుమార్గారి ప్రసంగములో, సనాతనధర్మము వ్యవస్థీకరణ,ఆదిశంకరులు వారు స్థాపించిన పీఠములగురించి, భగవాన్ సత్యసాయిబాబావారి సర్వమత సమ్మతము, సర్వాంతర్యామితత్వముగురించిన, ఆధ్యాత్మికవిశేషములను విన్నాము.🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete
  36. (*శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో*::
    *మహారాజా వినుము* *నేను నీకు శ్రీ మద్ భాగవత పురాణం చెప్ప తలంచితి* **అందులో నీవు అడిగిన సమస్త ప్రశ్నలకు సమాధానములు ఉన్నవి దీనికి మించిన పురాణము వేరొకటి లేదు*
    *మరియు,దశ అవతారములలో 2 అవతారములు, రామ,కృష్ణ అవతారములు నేడు లోకమున ఆరాధన రూపమున స్థానమును పొందగలిగినవి*మిగిలినవి ఆయా కార్యనిమిత్తము వచ్చి అప్పటికప్పుడు విరమించుకొన్నవి*.🙏(28.3.2021) సత్సంగము:: సమాజశ్రేయస్సుకై ఆది శంకరులు స్థాపించిన మఠములు,పీఠాధిపతులు.
    మరియు భగవాన్బాబావారు నెలకొల్పిన సేవాసంస్థలు భజనమండలు, విద్యాలయాలు, మంచినీటి పథకములు,,, గురించి, ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారి ప్రసంగంలోవిన్నాము.(సరస్వతీప్రసాద్).

    ReplyDelete
  37. (29.3.2021).*శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో::*
    *శ్రీరామచంద్రునికి ఎవరైనా ఏమైనను సమర్పించిన వాటిని పూర్తిగా అందుకొనక, కొంత భాగము మాత్రమే త్రుంచుకొని లేదా తన* *కరములతో తాకి తిరిగి వెనుకకు అందించువాడు*అత్తమామల దగ్గర సహితము అల్లునివలె మెలగక*, *పుత్రుని వలే ప్రవర్తించెడివాడుఎట్టి*
    *వారినైనను శరణుజొచ్చిన *వారిని రక్షించుటే శ్రీరామచంద్రుని దీక్ష. అట్టి అవతార పురుషుని లీలలు శ్రవణము చేయుచుండిన చాలును* *సర్వపాపములు సమసిపోవును అని ఆనంద బాష్పములు* *తుడుచుకొనుచుండెను.*
    *స్వామీ!గోపాలునిలీలాగుణములనుకూడా వినిపించి నా ఈ శేష కాలమును ఆ శ్యామలాంగునిలో* *లయముగావింపుము.జన్మతరింప* *చేయుము అని పరీక్షిన్మహారాజు ప్రార్ధించెను.🙏*ఈరోజు సత్సంగంలో చిన్మయిశీర్షికలోని ఆరవభాగంలో, శిష్యుల పై ఆదిశంకరుల గురుకృప మరియు భగవాన్ బాబా వారు భక్తులపై చూపించిన అపారకృపావిశేషములనువిన్నాము.🙏 (సరస్వతీప్రసాద్).

    ReplyDelete
  38. 30.3.2021*శ్రీ కృష్ణావతారం" "హరివిచిత్ర లీలహరికే తెలియున్"*
    *రాజా వినుము::*కపిల, దత్తాత్రేయ సనక ,సనందన, సనత్కుమార సనాత్సుజాత మునుల రూపమును నరనారాయణులు,విష్ణు*, *ధ్రువ,హయగ్రీవ, వ్యాస మొదలగు రూప నామములతో ధర్మకర్మల స్థాపించెను. ఇంకనూ అనేక* *అంశావతారములుకలవు*,
    అతనికి అతనే సాటి అతనికి అతనే సాక్షి*
    *ఇక మధురమూర్తి అయిన కృష్ణావతారతత్వము చిత్తాకర్షక ము ఆహా! ఆ మధుర మూర్తీ! అనుచు కృష్ణ రూపమున ఉన్మత్త చిత్తుడై లీనమయ్యెను.* 🙏,, ఈరోజు కోటి సత్సంగమునందు చిన్మయిశీర్షికన ప్రొఫెసర్అనిల్ కుమార్ గారి ప్రసంగంలో, ఆదిశంకరులవారు సురేశ్వరులవారిని బ్రహ్మసూత్రం పైభాష్యంరాయమని అడగడం,పద్మపాదుడు, తన అఇష్టాన్ని ఆది శంకరులకు తెలియజేయటం విన్నాము🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete
  39. (31.3.2021*శుక మహర్షి పరీక్షిన్మహారాజుతో::
    హంతకుడి హస్తమందు గల కత్తి అందరికీ ప్రమాదమే కానీ వైద్యుని హస్తమందు గల కత్తి దుఃఖం నివృత్తి చేయును. *.కాన దేహాత్మ భావముగల ప్రవృత్తి చర్యలు.*దైవ ఆత్మ భావము గల చర్యలు నివృత్తి చర్యలు*
    *చిత్తశుద్ధి గల వారికే కృష్ణలీలలు అర్థమగును. ఉద్ధవుడు అంతటివాడు బృందావన గోపికలను చూచి అయ్యో! ఇంత కాలం నా జీవితం*వృధాగడిపితిని కదా అని తపించెను.చైతన్యము లేని పదార్థము సృష్టిలో లేదని బృందావన శిలలు, వృక్షములు, ఉధ్ధవునికి బోధించెను**.(సర్వంసజీవం)
    *వేళ్లు కాలిపోతున్నాయి అని కూడా తెలియకుండా ఒక గోపిక దీపము నందు కృష్ణునిచూచుచుండుట అను అనుభూతి మరింత విచిత్రంగా తోచెను.అనితెల్పెను*.🙏, సత్సంగము నందు,ఈరోజు ఆదిశంకరుల సాహిత్యము,బాబా వారి సాహిత్యం ఏవిధంగా, భ్రమను తొలగించి బ్రహ్మ మార్గంవైపు నడిపిస్తున్నాయో వివరించారు.🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete
  40. Sairam.. swamy swayamga tana krishna avataranni athi madhuram ga, kanulaku kanipinchunatluga, vivaristunnaru..Madhuram Madhuram Sai krishna leelalu Madhuram.. Aa Bala Gopalude mana satya sai krishunudu..😍ee avakasanni kalpinchina Kothi samithi vaariki krutagnatalu..🙏🙏

    ReplyDelete
  41. (1.4.2021Sairam 🙏swamy anugraham tho 36 va roju Bhagavathavahini paarayanam poorthicheyadamainadi 🙏 (Vijayagowri)

    ReplyDelete
  42. (1.4.2021)*తల్లిదండ్రులు, యశోదా నందులు, కంసుడు పంపు దూతల బారినుండి తప్పించుటకు,గోపాలునిఎన్ని విధముల దాచినను దాగువాడు కాడు. గోవత్సములతో గోపాలురతో పగలు రాత్రి అనక విహరించు చుండెను.* *దొంగ తనను పట్టుటకై వచ్చిన, ఉడుత నడిచినావూగునట్టి బలహీనమైన చిట్టచివరికొమ్మలోపోయి* *ఉండెడివాడు. ఇంద్రుడు కురిపించె న రాళ్ళ వర్షము నుండి రక్షించుటకు కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినట్లు నాటకమాడెను.నిజముగాఇంద్రునకు కోపము లేదు.*
    *పరీక్షిన్మహారాజు ,స్వామి! ఇంకనూ కొన్ని బాల లీలలను వినిపించి తరింప చేయుము అని ప్రార్ధించెను*.🙏 సరస్వతీప్రసాద్

    ReplyDelete
  43. (2.4.2021)*గోపాలుడు శక్తియుక్తులతో ముక్తిని హస్తము నందుంచుకొని బంధ విముక్తిని చేసే భద్రమూర్తి అతనే నారాయణమూర్తి, అనిశుకులు మహారాజుకు తెలిపిరి*...
    *మా తాతలు ఆ గోపాలుని తో కూడి ఆడి ఆనందించిన భాగ్యములు అణుమాత్రమైనా విని ఆనందించునట్టి భాగ్యము నాకు కలుగుట ఇదియూ,నా భాగ్యమేఅని**
    *స్వామీ! గోపాలుడు కాళియ మర్దనము గావించెనని వింటిని.దాని అంతరార్థము తెలుపుము,అని, శుకుని ప్రార్థించెను* 🙏((సరస్వతీప్రసాద్)

    ReplyDelete
  44. (3.4.2021*భార్యలైన నాగకాంతలగోడు విని,,విషము గ్రక్కుచున్న, కాళీయుని, విడచి ఇకపై నీవు సాత్వకుడవై ,ఎట్టి వారికినీ నిష్కారణముగా హింస చేయక*ఇతరులచే నీకు హింస జరుగక* *ఉందువు గాక! నీ శిరస్సుపై నా పాదముద్రలు ఉండుటచేగరుడుడు కూడా నిన్నేమీ చేయకుండుగాక! అని శ్రీకృష్ణుడు ఆశీర్వదించెను*🙏సరస్వతీప్రసాద్

    ReplyDelete
  45. (4.4.2021)*బలరామకృష్ణులు సాందీపుని వద్ద విద్యనభ్యసించి,తర్వాత, సముద్ర గర్భమున ప్రవేశించి రాక్షసుడైన పంచజనుని తో పోరాడి అతని పొట్ట నుంచి తెచ్చిన శంఖమును ఊదగా, యముడువిని*, *బలరామకృష్ణులను చేరి గురువుగారు పోగొట్టుకున్న కుమారుని, తెచ్చి ఒప్ప జెప్పెను*
    *చేపకు ఈత నేర్పు వారు లోకమున ఉందురా?*అటులనే దైవమునకు విద్యనేర్పు వారుందురా*? *కానీ గురు రుణము తీర్చువలసిన విధానమును బోధించుటకు కృష్ణపరమాత్మ విద్యార్థుల ప్రతినిధిగా నటించి ఆదర్శం అందించెను*🙏, (సరస్వతీప్రసాద్)

    ReplyDelete
  46. (5.4.2021.గోపాలుని,దైవత్వమును దివ్య పురుషుల వలన వినియు నివురుగప్పిన నిప్పు మాయ,, తిరిగి గోపాలుడు మన యశోద కుమారుడు మన గొల్లపిల్లవాడు, మన మిత్రుడు అను భ్రాంతికి లోనై మసలు చుండిరి అని,, దేహమునే లక్ష్యమందు ఉంచుకొన్న వారికి దేహి కనిపించడు కదా!అనిశుకుల వారు సెలవిచ్చిరి.
    స్వామి!ఈనాడు నిజముగా నా పొరలు వీడినవి. నివురు, తమ బోధామృతంఅను, గాలికి ఎగిరిపోయినది. ఈ పాంచభౌతికమైన దేహం, భ్రాంతి పటాపంచలమైనది. ధన్యుడ, ధన్యుడ,అని, పరీక్షిన్మహారాజు శుకుని పాదములపై పడి నమస్కరించెను.🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete
  47. (6.4.2021.*పరీక్షిన్మహారాజు కంసుని జన్మవృత్తాంతము,గోపాలుని జన్మవృత్తాంతము నా అంత్య సమయమున వినిపించి నా ప్రాణమును, గోపాలునిలో అంత మొనరించుము* *అని ప్రార్ధించెను.*
    *దేవకీవసుదేవుల వివాహము,*
    *కంసుని ఆకాశవాణి హెచ్చరించుట,*
    *కంసుడు దేవకీదేవి పసిబిడ్డలను చంపుట*
    *బిడ్డల శోకముతో కుములుచున్న దేవకీవసుదేవులకు కారాగారము కూడనూ ఒక బాధగా మారుట.*
    *పై విషయములను శుకమహర్షి పరీక్షిన్మహారాజుకి తెలియజేశెను*.🙏(సరస్వతీప్రసాద్)

    ReplyDelete
  48. 7.4.2021..వేదమనువృక్షమునుండి భాగవతమను, ఫలమును ద్రుంచి ప్రజలకుఅందించిన చిలుకయే *శుక మహర్షి*
    అందించిన ఆ ఫలమును ఆరగించి పండితులవేదములతో, భక్తుల భజనలతో,ఋషులజపములతో పారవశ్యముపొంది, కృష్ణా! కృష్ణా! కృష్ణా!అనుచు, శ్రీ కృష్ణపరమాత్మ(ఆగోపాలుని) నుచేరిన *పరీక్షిన్మహారాజు* ధన్యులు.🙏(saraswatiprasad).

    ReplyDelete
  49. 7.4.2021.భగవాన్ సత్యసాయిబాబావారు, తమ దివ్యహస్తములతో, దివ్యమైన ఆశీస్సులతో, అనంతమైన ప్రేమ కరుణలతో, మనకందించిన భాగవతవాహిని పారాయణము పూర్తి చేయగలగటం *జన్మసుకృతం.*
    స్వామి వారికి అనంత కోటి🙏 ప్రణామములు అర్పించుకుంటూ,(7.4.2021).42వ అధ్యాయమును పూర్తి చేయగలిగాను.

    ReplyDelete
  50. 7.4.2021.On behalf of all the devotees present here, I am thanking Koti Samiti Convenor Garu for taking this divine service, sending parayanam in advance,n making all of us touch with the divine 🙏🙏🙏

    ReplyDelete
  51. 7.4.2021ఎంతో దివ్యమైన ,ఆధ్యాత్మికమైన భాగవతవాహిని పారాయణం మన అందరి చేత చేయించినందుకు కోటి సమితి కన్వీనర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు, కృతజ్ఞతలు నమస్కారములు, తెలియజేసుకుంటున్నాను.సాయిరాం🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete
  52. 8.4.2021,న, సత్సంగంలో(23.7.1996)నాటి, స్వామివారి ప్రసంగం లో.ఎన్నిగ్రంథపఠనములుచేసినా,హ్రుదయమును పవిత్రమునుగావించుకొనవలెననీ,ఆచరణలోపెట్టవలెననీ,బోధించారు.🙏(saraswatiprasad).

    ReplyDelete
  53. భగవంతుని పైగలనిర్మలప్రేమయే,భక్తియని, భగవంతునిపై, విశ్వాసము, ప్రేమ లేని జీవితం,నిరుపయోగమనీ.ప్రేమలేక ఆనందమే లేదని,,,,, స్వామివారి,ప్రసంగం,వినగలిగాము.🙏(saraswatiprasad).

    ReplyDelete
  54. 9.4.2021.అన్నికర్మలయందు,భగవంతుడే, అధ్యక్షుడు, అని బోధించారు.

    ReplyDelete
  55. Saraswati Prasad: On behalf of all the devotees present here, I am thanking Koti Samiti Convenor Garu for taking this divine service, sending parayanam in advance,n making all of us touch with the divine 🙏🙏🙏
    Saraswati Prasad: ఎంతో దివ్యమైన ,ఆధ్యాత్మికమైన భాగవతవాహిని పారాయణం మన అందరి చేత చేయించినందుకు కోటి సమితి కన్వీనర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు, కృతజ్ఞతలు నమస్కారములు, తెలియజేసుకుంటున్నాను.సాయిరాం🙏

    ReplyDelete
  56. Sithamahalakshmi
    Saraswati Prasad garu, what you wrote is absolutely true. Utmost dedication, shradha and saboori, selfless service motive are the best qualities which I feel that we all should learn from him as we are in close association with him. I am sure each and everyone will agree with me.

    ReplyDelete
  57. Konduri Nagamani. All the 80 members in group no 10 could complete Bhagavathavahini parayanam with great enthusiasm n devotion with the divine grace if saikrishna🙏🙏i am extremely happy that many devotees from Gujarat and America showed great interest and they joined voluntarily🙏may swami bless all the devotees and give us all more n more opportunities like this🙏🙏thank you swami🙏🙏thank you sastrigaru

    ReplyDelete
  58. (10.3.2021),భగవానువాచ::భగవంతునికి,క్రృతజ్నతలుగా ఉండడమే,TAX,దానినే *బలి*అంటారు.

    ReplyDelete
  59. 10.4.2021సత్సంగము::1.7.1996నస్వామివారుయిచ్చిన,దివ్య ఉపన్యాసం.వినగలిగాము.🙏(saraswatiprasad).

    ReplyDelete

DASARA CELEBRATIONS AT SIVAM. FROM 3-10-2024 TO 12-10-2024 - KOTI SAMITHI SAMITHI DATES. 6TH, 7TH, 12TH,

  ఓం శ్రీ సాయిరాం  ఆదివారము 6-10-2024 న రోజున మహాలక్ష్మి అలంకరణ.  ఉదయం 7 గంటల నుండి, 1 గంట వరకు శివమ్ మందిరంలో సేవ మన కోటి సమితికి కేటాయించబ...