Thursday, August 15, 2019

NAGARA SANKEERTHANA EVERY 3RD SUNDAY I.E. THIS MONTH 18-8-2019


స్వామి వారి దివ్య ఆశీస్సులతో, ఈ నాటి నగర సంకీర్తన కార్యక్రమము దిగ్విజయముగా జరిగినది. వర్షము కూడా పడుతున్నప్పటికీ, శ్రీ నాగేశ్వర రావు గారు, శ్రీ నాయుడు గారు, శ్రీ నరసింహ రావు, శ్రీ సాయి కుమార్, శ్రీ రాంచందర్, రాజు కుమారుడు, సుధాకర్ పాటిల్ మరియు నేను పాల్గొనే అవకాశము కల్పించిన స్వామికి, హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జెసికుంటూ సాయిరాం . పాల్గొన్న ప్రతి ఒక్కరికి రెండు భజనలు పాడే అవకాశము లభించినది. 

94 BHAJANS PROGRAM. 18-8-2019. SUNDAY 8-30 ONWARDS REPORT, PHOTO AND U TUBE


అందరికి ప్రేమ పూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, హైదరాబాద్. 


ఈ రోజు అనగా 18-8-2019 న , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి వారి ఆధ్వర్యంలో, 84 భజనల కార్యక్రమము, ఘనంగా, భక్తి, శ్రద్దలతో, జరిపించిన స్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ జెసికుంటూ, అందరమూ 8-40 నిమిషములకు, హరే రామ హరే కృష్ణ ఆలయము నుండి, సాయి గాయత్రి, మంత్రమును జపించుకుంటూ, అబిడ్స్, జి పుల్ల రెడ్డి భవనం, 6 వ అంతస్తుకు చేరి, అందరము కలసి జ్యోతి ప్రకాశనం గావించి, స్వామి వారి నామ సంకీర్తన  లఘు సందేశమును విని ముందుగా బాలవికాస్, విద్యార్థులు, పెద్దలు అందరూ కలసి, 94 భజనలు పూర్చిచేసుకున్నాము. మన ఆహ్వానమును మన్నించి, స్వామి పూర్వ విద్యార్థి, చాగంటి సత్య శ్రీనివాస సుబ్బారావు, వారి హార్మోనియం ను తీసుకొని వచ్చి, కొన్ని భజనలను కూడా పాడారు. తరువాత, బాలవికాస్ విద్యార్థులు, భజనలు నేర్చుకొని, ఏ  విధంగా స్వామికి దగ్గర కావొచ్చునో, వారు స్వామికి ఏ విధముగా, స్వామి వీరికి, భజనలు పాడే, మెళుకువలు, నేర్పారో, వివరంగా తెలియ జేశారు. కోటి సమితి పక్షాన శ్రీ మహంకాళి లక్ష్మీ నరసింహ రావు గారు ఒక   జ్ఞాపిక ను  చాగంటి సత్య శ్రీనివాస సుబ్బారావు, బహుకరించారు. బ్రహ్మార్పరం తరువాత, అందరూ స్వామి ప్రసాదాన్ని, తీసుకున్నారు. నిలొఫర్ హాస్పిటల్, అటెండెంట్స్ కి ఆ ప్రాతంలో నున్నవారికి, నారాయణ సేవను కూడా నిర్వహించడమైనది. 

ఈ నాటి మన 94 భజనల కార్యక్రమంలో పాల్గొన్న వారు ...మాస్టర్ ప్రణవ్, హేమాంగ్, లీలాధర్, సాయి లక్ష్మి, సాయి కుమార్, శరణ్య, సాయి వాణి, సాయి గుప్త, గాయత్రీ నాగ, సాయి రూప, చిత్రుపిణి, గారి పిల్లలు, శ్రీమతి కల్పన, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి రేణుక, శ్రీమతి జ్యోతి విశ్వకర్మ, నిడుముక్కల శ్రీరామ్మూర్తి, లక్ష్మణ్ పాపన్న, పాపన్న  గారి సతీమణి, E V G రామకృష్ణ, వారి సతీమణి, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీ నాగేశ్వర రావు విశ్వకర్మ, శ్రీ నరసింహ రావు, శ్రీ చక్రధర్, శ్రీ ప్రకాష్, శ్రీ లక్ష్మీనారాయణ హుప్పుగూడ, శ్రీ రాము, రతి రావు పాటిల్, శ్రీమతి ఆశ పాటిల్, వెంకటేశ్వర నాయుడు, నాగేశ్వర రావు, తమ్ముడు   వారి భార్య. చల్లమల్ల వెంకట లక్ష్మ రెడ్డి, శ్రీమతి ఇందిరా, రామచందర్, తమ్ముడి కూతురు, కొడుకు, శ్రీ సుబ్బా రావు, హరి బాబు, తదితరులు పాల్గొన్నారు. మాన్యవర్ స్టాఫ్ 50 మంది స్వామి వారి మహా ప్రసాదాన్ని తీసుకున్నారు. 







MAHILA POOJA AT SIVAM: 7TH FEBRUARY, 2026

  MAHILA POOJA AT SIVAM: 7TH FEBRUARY, 2026