భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,ఈ సంవత్సరము, గురుపూర్ణిమ పర్వదినాన్ని (29.07.2026 బుధవారం నాడు) 106 రాయల్ ప్లాజా అపార్ట్మెంట్స్, సుల్తాన్ బజార్లోలో జరుపుకొనే భాగ్యం కోటి సమితి సభ్యులందరికి, ఎంతో కరుణతో స్వామి అనుగ్రహించారు. ఈ కార్యక్రమము 21 సార్లు ఓంకారం తో ప్రారంభించి, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి సుప్రభాతం, వేదం పఠనము గావించి, ఏంతో క్రమశిక్షణతో, బాలవికాస్ పిల్లలు, మహిళలు, పురుషులు, భజనలు పాడుకుంటూ, కోటి రాయల్ ప్లాజా అపార్ట్మెంట్స్ లో ప్రారంభించి, హనుమాన్ వ్యాయామశాల మీదుగా, టెలికాం క్వార్టర్స్, ఖందస్వామి లనే లో గల షిరిడి సాయి బాబా ఆలయము, చేరుకొని, అక్కడ నుండి, చిన్న చిన్న సందుల గుండా, గుజరాతి లేన్ లో గల కృష్ణ మందిరం గుండా, హనుమాన్ వాయాంశాల పబ్లిక్ స్కూల్ మీదుగా, మరల రాయల్ ప్లాజా అపార్ట్మెంట్ సెల్లార్ నుండి 106 ఫ్లాట్ లో చేరుకోవడంతో నగర సంకీర్తన ముగిసినది.
బాలవికాస్ విద్యార్థులు, చిరంజీవి కార్తీక్, చిరంజీవి ఆరతి బిరాడర్, మరియు చిరంజీవి నందిత, గురుపూర్ణిమ విశిష్టతను, ఆంగ్లములో, హిందీలో, మరియు తెలుగులో గురుపూర్ణిమ సందేశమును చదివారు. భజన కొనసాగుతుండంగా, నేషనల్ నారాయణ సేవ కార్యక్రమములో భాగంగా 5 మందికి, అంటే శ్రీ రాము గారికి, సోనాల్ బాయ్, శ్రీమతి రూప గారికి, శ్రీమతి మీరా గారికి, శ్రీమతి సునీత గారికి, 5 కిలోల బియ్యము, ఒక కిలో ఆయిల్, ఒక కిలో కందిపప్పు, పాకెట్స్ అందజేయబడినవి.
ఈ రోజు విశేష విచిత్రమేమిటంటే రాత్రి అంతా వర్షం పడుతున్న, కోటి సమితి లో ఈ రోజు గురుపూర్ణిమ సందర్భంగా, నిర్వహిస్తున్న నగర సంకీర్తనకు, ఏ మాత్రమూ వర్షం లేకుండా స్వామి వారి, దివ్య ఆసిస్సులతో దిగ్విజయముగా ముగిసినది.
ఈ కార్యక్రమములో కన్వీనర్ మాట్లాడుతూ, ఆశ్రిత కల్ప సేవల గురించి, ప్రతి బుధవారం నగర సంకీర్తన గూర్చి, స్కిల్మ డెవలప్మెంట్ లో కొత్త బ్యాచ్ గూర్చి, మరియు, ఆగష్టు 23 న జరగబోయే మీటింగ్ సేవాదళ్ మీటింగ్ గూర్చి, సవివరముగా వివరించారు. కన్వీనర్ స్వామి వారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
pictures relating to Gurupoornima Festival.
























.jpg)










