Wednesday, June 10, 2026

భారతదేశ వ్యాప్తంగా అనుసరించవలసిన శ్రీ సత్యసాయి భజన విధానం

 

భారతదేశ వ్యాప్తంగా అనుసరించవలసిన శ్రీ సత్యసాయి భజన విధానం:-

 ఓంకారం (3 సార్లు).   వేదపఠనము -  15 నిమిషాలు. *  శ్రీ సత్యసాయి అష్టోత్తరం  - 10 నిమిషాలు (అందరూ కలసి).  శ్రీ సత్యసాయి గాయత్రి - 11 సార్లు -  5 నిమిషాలు (అందరూ కలసి).

 (ఓంకారం నుండి సాయిగాయత్రి వరకు 30 నిమిషాలు). తదుపరి భజన:-

 

* ఓంకారం (3 సార్లు) (అందరూ కలసి). * గణేష్ భజన,గురు భజన,మాతా భజన తరువాత ఇతర భజనలు. * కనీసం ఒక్క సర్వధర్మ భజన ఉండాలి. * ఆఖరున సుబ్రహ్మణ్యం భజన. * తదుపరి భగవాన్ బాబా వారు పాడిన భజన.

 * ఓం తత్సత్ శ్రీ నారాయణతూ (గతములో పాడే విధంగానే, ఈ పాటలో సాయి అన్న పదం కలపవద్దు)

* ధ్యానం - 2 నిమిషాలు

* అసతోమా సద్గమయ -   * ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః * (అందరూ కలసి)

* భగవాన్ బాబా వారి దివ్య సందేశం

* (1 నుండి 5 నిమిషాలు)

* ప్రకటనలు కన్వీనర్.

* హారతి - ఓం జై జగదీశ హరే

* (అందరూ కలసి)

* సమస్త లోకాః సుఖినోభవంతు -

* 3 సార్లు ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః (అందరూ కలసి)

* జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి (మంచి కంఠం గలవారు) జై (అందరూ కలసి)

* విభూతి మంత్రం "పరమం పవిత్రం బాబా విభూతిం..." -

* 3 సార్లు (అందరూ కలసి) * ఓం శాంతి శ్శాంతి శ్శాంతి: * (అందరూ కలసి)

* విభూతి ప్రసాదము మాత్రమే ఇవ్వవలెను.

(భజన ప్రారంభం నుండి విభూతి మంత్రం వరకు ఒక గంటన్నర మాత్రమే.)

 

జై సాయిరాం.

శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు, శివం,హైదరాబాద్, ఆధ్యాత్మిక విభాగము.

Tuesday, June 9, 2026

AUM SRI SAI RAM NAAMA JAPAM PROGRAM. DT 13-6-2026 4-30 TO 7-30 PM



 AUM SRI SAI RAM NAAMA JAPAM PROGRAM
DT 13-6-2026 4-30 TO 7-30 PM 



  1. SRI M L N SWAMY 
  2. SRI DIWAKAR 
  3. SMT KALYANI
  4. SMT ANURADHA H V S 
  5. SRI SAGAR
  6. SRI P V SASTRY
  7. SRI M ANJANEYULU
  8. SMT VIJAYA LAKSHMI
  9. SMT SREEJA
  10. SMT GUBBA JYOTHI
  11. SMT KALPANA
  12. SMT VENI
  13. KUM GREESHMA
  14. SRI P PRAKASH
  15. SRI NAIDU
  16. SMT SYAMALA
  17. SRI SATHYANARAYANA
  18. SRI ANIL 
  19. SRI SHIVA
  20. SMT VAANI
  21. SRI NARASIMHA RAO
  22. SMT SREE SITAMAHA LAKSHMI
  23. SMT ROOPA
  24. SMT 
  25. SMT GANGA
  26. SMT SAI PRIYA
  27. SRI NAVEEN 
  28. SREE SHARADA SUPRIYA
  29. PARENTS OF H V S BALVIKAS STUDENTS 
  30. CHILDREN


REPORT ON ANNUAL OM SRI SAI RAM NAAMA JAPAM
Date: 13-06-2026

With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba, the “Aum  Sri Sai Ram Naama Japam” programme has been continuing every year for the past 32 years in Sri Sathya Sai Seva Organisations, Koti Samithi.

Today, i.e., 13-06-2026, this sacred Naama Japam programme was conducted with great devotion and reverence at the Sri Sathya Sai Bhajan Hall, Gowliguda Chaman, Hyderabad.

The programme commenced with the auspicious Jyothi Prajwalan (lighting of the lamp) by Smt. Kalyani Divakar and District Spiritual Coordinator Sri M.L.N. Swamy Garu. Addressing the gathering, Sri M.L.N. Swamy Garu explained the significance and spiritual importance of Naama Japam, elaborating on the profound meaning and essence embedded in the sacred chant “Aum  Sri Sai Ram”. Through several examples shared by Bhagawan Sri Sathya Sai Baba, he delivered an enlightening discourse in a manner easily understandable to both children and elders, thereby formally inaugurating the Naama Japam session.

Renowned singer Smt. Kalyani Divakar mesmerized the devotees by rendering several Bhajans and devotional songs tuned to “Aum  Sri Sai Ram”, creating a deeply devotional atmosphere and captivating the hearts of all devotees present.

On the occasion of this Annual Aum Sri Sai Ram Naama Japam, notebooks were distributed to students as part of the service activity.

After all devotees received Vibhuthi Prasadam, Convenor Sri P. Visweswara Sastry delivered the and vote of thanks. The programme concluded successfully with the offering of Mangala Haarathi to Swami, and was humbly offered at the Divine Lotus Feet of Bhagawan Sri Sathya Sai Baba.

Sairam

 REPORT ON ANNUAL OM SRI SAI RAM NAAMAJAPAM

DT 13-6-2026

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి లో " ఓం శ్రీ సాయి రామ్ నామ జపం"ప్రతి సంవత్సరం గత 32 సంవత్సములుగా, కొనసాగు చున్నది. ఈ రోజు అనగా 13-6-2026 న గౌలిగూడ చమన్ లో గల శ్రీ సత్యసాయి భజన హాల్  లో  ఈ నామ జపం కార్యక్రమముము అత్యంత భక్తి శ్రద్దలతో జరిగినది.   శ్రీమతి కళ్యాణి దివాకర్, మరియు జిల్లా అధ్యాత్మిక సమన్వయ కర్త శ్రీ ఏం ఎల్ ఎన్ స్వామి,   జ్యోతి ప్రకాశం గావించి ఏం ఎల్ ఎన్ స్వామి గారు మాట్లాడుతూ నామాని  కి వున్న   విషిస్టతను, ఓం శ్రీ సాయి రామ్ లో ఇమిడివున్న అనేక విషయాలను స్వామి చెప్పిన వి అనేక వుదాహరణలతో, పిన్నలకు, పెద్దలకు అర్ధమయ్యే రీతిలో తమ ప్రసంగమును కోన సాగించి, నామజపం కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ప్రముఖ గాయని, శ్రీమతి కళ్యాణి దివాకర్  అనేక భజనలను, భక్తి పాటలను ఓం శ్రీ సాయి రామ్ ట్యూన్ లో పాడి అందరిని మంత్రం ముగ్దులను గావించారు.  ఈ వార్షిక ఓం శ్రీ సాయి రామ్ నామ జపం సందర్భముగా విధ్యార్ధులకు, నోట్ బుక్స్ ను కూడా వితరణ గావించడంయ్నది. అందరు విభూతి ప్రసాదం స్వీకరించి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి కార్యక్రమానికి ముందు స్వాగత వచనాలను, వందన సమర్పణ  గావించిన అనంతరం, స్వామివారికి మంగళ హారతి  సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 



SRI M L N SWAMY ADDRESSING THE DEVOTEES OF KOTI SAMITHI


















బ్యాడ్జి – సాధనకి పిలుపు - పుట్టు పండుగ వేడుకలు, 22-11-1965

 ఓంశ్రీ సాయిరామ్

బ్యాడ్జి – సాధనకి పిలుపు

మీకు పంచడం కోసం తెచ్చిన ఈ స్వచ్ఛంద బ్యాడ్జిలను చూసి మీరంతా సంతోషంగా వున్నారని అర్ధమవుతోంది. మరి కొద్ది సేపటిలో వీటితో మీరు అలంకరింపబడతారని, ఈ పుట్టి పండుగ సందర్భంగా విపరీతంగా వున్న పనిని ఈ బ్యాడ్జి ద్వారా తప్పించుకోవచ్చని, మిగిలిన వారిపై అధికారం చెలాయించవచ్చని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు. అధికారం కోసమో, విశ్రాంతి కోసమో లేక ఇటువంటి పెద్ద పెద్ద పెద్ద కార్యక్రమాలలో ఆనవాయితీగా మహిళలు, పురుషులు వీటిని ధరించి అటు ఇటు తిరగడం  కోసమో ఇవ్వబోవడండం లేదు. వీటి వల్ల మీకు పని భారంఅధికంగానే  వుంటుంది. కేవలం పనిభారం చూస్తే ఈ బ్యాడ్జి స్వీకరించడానికి అనర్హులు. ఈ పండుగ కోసం  ప్రపంచం నలుమూలల నుండి వస్తున్న మీ బంధు మిత్రులకు స్వాగతం పలకడానికి, వారికి సేవ చేయడానికి ఈ బ్యాడ్జిలు వీలు కలిగిస్తాయి. ఈ బ్యాడ్జి మీలో ఏవిధమైన అతిశయభారాన్ని కలిగించరాదు, నేను సేవ చేస్తున్నాను కనుక ఎక్కువ, ఆ సేవని పొందేవాడు తక్కువ అనే భావన కలిగించరాదు. నువ్వేదో అవతలివారికి వరాన్ని దోసిట్లోకి ఇస్తున్నట్టు కాదు,వారి పాదాల దగ్గర సమర్పణ చేస్తున్నట్టుగా వుండాలి. నీవు సేవ చేసే వారికీ నీకు మధ్య బాంధవ్యం వున్నట్టుగా వుండాలి. ఆత్మ తత్వ విచారణలో నీవును,అతను ఇద్దరు ఒక్కటే. నీవు అతను ఒకే సముద్రములోని రెండు అలల వంటి వారు.

ఈ బ్యాడ్జి ని మీరు సాధనకి ఒక పిలుపులా, ఆధ్యాత్మిక సాహసానికి ప్రారంభంలా, ప్రేమ కోసం ప్రయత్నంలా అనుకోవాలి. మీరు తెలుసు కోవాల్సిన దానినే వేదాలు బోధిస్తున్నాయి. శాస్త్రాలలో చెప్పబడిన క్రమశిక్షణా మార్గాలన్నీ మనిషిని మాధవునిగా తయారు చేయడంలో సాయం చేసేవే. నీవు చేస్తున్నప్రతిపనిలోని నిజమైన అంతరార్ధం నీకు ఎరుకపరిచేదే సాధన.మీరంతా సాధన లో వుండాలని ఎదురుచూస్తూ, మిమ్మల్ని ఆ వైపు నడిపిస్తున్నాను. ఒక తల్లి తన పిల్లల ఆరోగ్యం,ఎదుగుదల వంటి విషయాలలో నిర్లక్ష్యం చేయదు. ఆమె మాట పెడచెవినపెట్టినా, వారిని సరిదిద్దడానికి,మంచి అలవాట్లు పెంచడానికి ఎదురు చూస్తూనే వుంటుంది.

స్వచ్ఛంద సేవకులు తమ సుఖాలను త్యాగం చేయాలి:

ఈ సాధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం అహంకారాన్ని అంటే  నేను’,‘మనం అనే భావాలని అణిచి వేయాలి. క్లుప్తంగా చెప్పాలంటే అదే ఆత్మవిద్య’. స్వచ్ఛంద సేవకులుగా వచ్చిన మీరు మీ సుఖాలను వదులుకోవాలి, మీరు మరెక్కడో సేవలో ఉన్నప్పుడు ఇక్కడ నా దర్శనం కానీ, నా సందేశం వినాలని కానీ ఆశించకూడదు. మీరు సంతోషంగా చేసే ఇటువంటి త్యాగాల వలన సాధకులుగా మీరు అర్హత పొందుతారు. అలా కాక ముందు నా అవసరం తీరాలి, తరవాతే మిగిలినవారు అనుకుంటే మాత్రం అది సేవ కాజాలదు. కేవలం ఒక పన్నాగం మాత్రమే.

మీరు కూచున్నసీటులో, మీరే అంటుకు పోకుండా  అవసరమైన వారికి,ఆ వసతి కోసం ఎదురుచూస్తున్న వారికి,బలహీనులకి,మీకంటే పెద్దవారికి ఇవ్వడమే సేవ అవుతుంది.

అటువంటి సేవ,త్యాగం వలన మాత్రమే మీరు నా అనుగ్రహాన్ని పొందగలుగుతారు, అంతేగానీ నా ఎదురుగా ముందు వరసలో కూచుని, నేను చెప్పినదానికి తలాడిస్తే సరిపోదు. ఇక్కడికి వచ్చే ప్రజలని నెట్టటం,తొయ్యడం కానీ చేయకండి.మృదువుగా, మధురంగా మాట్లాడండి. బలహీనులకి, పెద్దవారికి సరైన స్థలం చూపించి కూచోపెట్టండి,దానికే వారు ఎంతో కృతజ్ఞతగా వుంటారు. వారు మండేఎండవేడిమి బారిన పడకుండా చూడండి. వికలాంగులు,రక్తపోటు వున్నవారు ఇబ్బందిపడకుండా చూడండి. రద్దీలో వున్న అటువంటి వారిని జాగ్రత్తగా సురక్షిత స్థలానికి చేర్చండి. వారిని ఒక అరుదైన పువ్వులాగా,ఒక ఖరీదైన పండులాగా భావించి జాగ్రత్తగా చూడండి.

మేము సున్నితంగా మాట్లాడితే వాళ్ళు వినరు స్వామి, దురుసుగా వుండడానికే వాళ్ళు అలవాటు పడ్డారు అంటూ  సాకులు చెప్పే చాలామంది సేవకులు నాకు తెలుసు. అటువంటి సేవకులని నేను ఎన్నడూ క్షమించను. అసలు తప్పంతా వారు మాట్లాడే విధానంలో, వారు చేసే పనులలో,నిగ్రహం లేకపోవడంలో, వారి ప్రవర్తనలోనే  వుంది. అసలు మీకు అప్పచెప్పిన బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించారా? ఇక్కడ చేరిన వేలాదిమంది నుండి మిమ్మల్నివేరు చేస్తున్నది ఏమిటి?ఖచ్చితంగా ఈ బ్యాడ్జి మాత్రం కాదు.

అతిధుల బాగోగులే ముందు చూడాలి:

మీరంతా,ఇక్కడికి తరలివస్తున్న మీ సహోదరుల బాగోగుల బాధ్యత నిర్వర్తించడానికి, ప్రశాంతి నిలయ ప్రతినిధులుగా వున్నారు.కనుక ముందుగా మీ హృదయాలలో ప్రశాంతి నింపుకోవాలి. ఆందోళన,బాధ,కోపం,నిరుత్సాహం వంటి వాటికి మీరు గురి కాకూడదు.హుందాగా ప్రవర్తించండి. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు తన భర్తతో ఏ భార్య అయినా మనం తిన్నాక వారికి పెడదాము?’ అంటుందా? ముందు వచ్చినవారి అవసరాలు గమనించాలి, జాగ్రత్తగా వారికి కావలసినవి అమర్చాలి. ఆ రీతిగానే, మీ సౌకర్యాలు, మీ సుఖాలు పక్కన పెట్టి, ఇక్కడకి వచ్చిన పురుషులు,స్త్రీలను సంరక్షణతో, ప్రేమతో ఆదరించాలి. అదే నన్ను సంతోషపెట్టేది, అదే నా అనుగ్రహాన్నిఅందించేది.

వారిని సరైన రీతిలో,భక్తి తో,ఇష్టంతో,గౌరవంతో ఆదరించాలి. ఇక్కడి పద్ధతులు తెలియక ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారి వైపు మీరు పరిగెత్తిపోవడమో, సైగలు చేయడమో, వారి నోటి పై మీ చేతిని అడ్డుపెట్టడమో చేయకండి. వారికి దగ్గరగా పోయి చెవిలో చాలా నెమ్మదిగా ఇక్కడి నియమాలు,క్రమశిక్షణ గురించి తెలియచేయండి, ఎందుకంటే ఇక్కడ చాలామంది ధ్యానంలో వుంటారు.జపం, మౌనంగా గ్రంధపఠనం వంటివిఅభిరుచులు, ఆలోచనలు అదుపులో  వుంచడంతోపాటు నిశ్శబ్దం విలువని పెంచుతాయి.

అటువంటి వ్యక్తి మరికొంతమందిని ఆ మార్గంలోకి మళ్లించడంలో సాయపడతాడు. ఇక్కడి క్రమశిక్షణ అంతరార్ధాన్ని తెలుసుకోవడమే కాకఈ నిలయం వదిలి ఇంటికి వెళ్ళినా అక్కడ కూడా ఆచరణలో పెట్టగలుగుతాడు.

స్వచ్ఛంద సేవ అనేది కేవలం ఈ వారానికి మాత్రమే తాత్కాలికం కాకూడదు. పట్టణంలో వున్నఅతిపెద్ద అబద్ధాలకోరు, నాటకంలో సత్యహరిశ్చంద్ర పాత్ర పోషించినట్టు కాదు. జీవన నేపధ్యం ఏదైనా, రాజభవనమైనా,అడవిలో వున్నా, చివరికి శ్మశానవాటికలో వున్నా హరిశ్చంద్రుడు ఎన్నడూ సత్యమార్గమును విడిచి పెట్టలేదు.

స్వచ్ఛంద సేవకుడు అనుగ్రహానికి పాత్రుడు:

ఈ క్రమశిక్షణ కేవలం ప్రశాంతినిలయ సరిహద్దులకి మాత్రమే పరిమితం,ఈ నిలయం గేటు దాటగానే అన్నీ వదిలి వేయచ్చు అని కొంతమంది అనుకుంటారు. వారు గేటు దాటగానే కాఫీహౌస్ లు లాంజ్ లలో చేరి, ధూమపానం,అరవడం,గొడవ పడడం,భయపెట్టడం,అనవసర వాదనలు,తేలిక మాటలు,పుకార్లు,అపవాదులు పుట్టించడం,పొగరుగా ప్రవర్తించడం వంటివి చేస్తుంటారు. వ్యక్తిగత గౌరవం కలిగిన ఏ వ్యక్తికైనా ఇది సిగ్గుమాలినతనం అవుతుంది.పుణ్యక్షేత్రాలు దర్శించే యాత్రికులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోవాలనుకుంటారు. ఇక్కడ వున్న సేవకులు కూడా అనుగ్రహాము, ఆనందాల కోసం ఎదురుచూస్తుంటారు. మీకు, ఈ ప్రపంచం మొత్తం ప్రశాంతినిలయంలా గోచరించాలి. ఇదొక రాతి, సిమెంట్ కట్టడంలా భావించరాదు.నిజానికి ఈ ప్రపంచంమొత్తం ప్రశాంతినిలయమే. కాకపోతే మనిషి తన అజ్ఞానం వల్ల, వక్రబుద్ధి వల్ల ఇదంతా ద్వేషము,నేరాలతో కూడిన పాములపుట్టగా మార్చుకుంటున్నాడు.

సేవ చేయడానికి మీలో కేవలం ఉత్సాహం మాత్రమే వుంటే చాలదు, దాంతో పాటుగా తెలివి, నైపుణ్యంఉండాలి. అప్పుడే మీరు సమర్ధవంతమైన, ప్రయోజకులైన సేవకులు అవుతారు.సమర్ధత లేని ఉత్సాహం తరుచు నష్టానికి,దుఖానికి హేతువవుతుంది. ఒకసారి ఇద్దరు స్నేహితులు పరీక్షలకి కూచున్నారు. ఇద్దరిలో ఒకడు మందబుద్ధి. వాడు తెలివైన రెండోవాడిని పరీక్షలలో ప్రశ్నలకి జవాబులు చెప్పమని సాయం కోరాడు. వూహించని విధంగా పరీక్ష హాల్లో ఇద్దరి సీట్లు దూరదూరంగా పడ్డాయి.కనీసం గుసగుసలాడినా వినిపించే వీలు లేదు. ఇప్పుడు వారి సమస్య ఒక్కటే , పరీక్షాధికారి కళ్ళు కప్పి,మోసం చేసి జవాబులు అందించుకోవాలి.ఎలా? వీడో చివర, వాడో చివర వున్నారాయే. దానికోసం వారో పక్కా ప్లాన్ తయారుచేశారు.

సేవ తెలివిగా చేయాలి:

అదే స్కూల్ లో ఒక పిల్లి యధేచ్చగా అన్నీ గదుల్లోనూ తిరుగుతుండేది. దాని తోకకి జవాబులు కట్టాలి, ఈ లోగా మందబుద్ధి తన బల్ల క్రింద కొన్ని తీపి పదార్ధాలు వుంచాలి. వాటిని ఆ పిల్లి ఆకర్షించి వీడి వేపు రావాలి.అది బల్లక్రింద వున్న తీపి పదార్ధాలు చప్పరిస్తుండగా, వీడు పిల్లి తోకకి కట్టిన జవాబు పత్రం తీసుకుని తన సొరుగులో దాచివుంచాలి. చాలా సేపు ఈ ప్లాన్ విజయవంతంగా అమలు జరిగింది. హటాత్తుగా పిల్లి అత్యుత్సాహంతో తన తోకకి కట్టిన కాగితం కోసం, తోకని పట్టుకోవాలని గుండ్రంగా తిరగడం మొదలెట్టింది.ఈ తతంగమంతా పరీక్షాధికారి దృష్టిలో పడి అసలు మోసం బైటపడింది.స్నేహితుల పన్నాగం బెడిసికొట్టింది. ఇటువంటి పిచ్చి తెలివితేటలు పనిచేస్తాయని మీరు కూడా నమ్ముకోవడం మీ మూర్ఖత్వం. నీకు అప్పగించిన సేవని తెలివిగా,విజయవంతంగా పూర్తి చేయగలగాలి. నీ సేవని అందుకున్న వ్యక్తి తృప్తి చెందేడా లేదా నీకు అవసరం లేదు. ఏ సంకోచం గానీ,పక్షపాతం గానీ లేకుండా సేవని పరిపూర్ణంగా అందించడమే నీ బాధ్యత.

భోజనాల కోసం వందల సంఖ్యల ప్రజలు కూచుని ఎదురుచూస్తున్నప్పుడు, చేతిలో లడ్డూల బుట్టతో వెళ్ళి లడ్డూలు,లడ్డూలు,ఎవరికి కావాలి లడ్డూలు అంటూ అరుచుకుంటూ,ఎవరి దగ్గర ఆగకుండా,కనీసం ఒక్కరి విస్తరిలో కూడా వడ్డించకుండా హడావిడి చేయడం వల్ల ప్రయోజనం వుండదు. తినే వారికి పేరు వినబడి నోరు వూరడం తప్ప పదార్ధం అందదు. ఈ కాలంలో సేవ అంటే ఎక్కువ మాటలు, తక్కువ పని జరుగుతున్నాయి. అయితే భగవంతుణ్ణి మాత్రం ఎవరు మోసం చేయలేరు. ఆయనకి అన్నీ తెలుసు.

ఒకసారి పార్వతీపరమేశ్వరులు ఆకాశ మార్గాన, శివరాత్రి పర్వదినాన, వారణాసి పట్టణం మీదుగా వెడుతున్నారు. ఆ పుణ్యక్షేత్రంలో వాడ వాడల, ఇరుకు వీధులలో, గంగా నది ఒడ్డున లక్షల సంఖ్యలో భక్తులు నిండి పోయివున్నారు. విశ్వేశ్వరాలయంలోని ప్రాంగణమంతా  భక్తులైన పురుషుల తోనూ, శివుడిని స్తోత్రాలు చేస్తున్నమహిళలతోనూ నిండిపోయింది.

ఆనంద ద్వారాలని తెరువగలిగేవి పవిత్రత మరియు సత్యం మాత్రమే :

పార్వతి తన నాధునితో ప్రభూ..ఈ లక్షల మంది భక్తులని చూడండి. ఇంత పవిత్రమైన దినాన, ఎంతో భక్తిశ్రద్ధలతో,మీ పవిత్ర నామస్మరణతో ఈ పుణ్యక్షేత్రంలో చేరారంటే వీరందరికి స్వర్గప్రవేశం ఖాయం. కాకపోతే ఇంతమందికి స్వర్గంలో చోటు సరిపోతుందా అని సందేహం. అంటుంది. ఆమె అమాయకత్వానికి నవ్వుతూ శివుడు “ శివరాత్రి రోజున వారణాసికి వచ్చిన ప్రతిఒక్కరికీ స్వర్గం దక్కితే, వారణాసే స్వర్గం కదా. కాదు,మనకి స్వార్ధపూరిత వాంఛలు, బంధాలు లేవు కనుక స్వర్గంలో వున్నాము. ఇక్కడ కనపడుతున్నవారంతా స్వార్ధంతో నిండిన వారు, ఎవరికి స్వర్గం చేరుకునే ఆశ లేదు.ఒక దొంగ తను దొంగిలించిన వస్తువుని అమ్మి వచ్చిన డబ్బుతో కాశీ వస్తే స్వర్గం లభిస్తుందా?ఆనంద ద్వారాలని తెరువగలిగేవి పవిత్రత మరియు సత్యం మాత్రమే. నాతో రా, ఈ లక్షల జనంలో అతి కొద్ది మందికి మాత్రమే స్వర్గార్హత వుందని, నా వాదన నిజమని నిరూపిస్తాను. ఇప్పుడే ఇద్దరం మారు వేషాలలో వృద్ధ యాచకుల మాదిరి ఈ పట్టణంలోకి ప్రవేశిద్దాము.” అంటాడు.

విశ్వేశ్వరాలయానికి చేరుకునే ఒక వీధిలో, వందల సంఖ్యలో ప్రజలు హడావిడిగా ఆలయంలోని శివలింగానికి అభిషేకించాలని తమ చేతులలో పవిత్ర గంగని గొని పోతూపరిగెడుతున్న సందడిలో, వృద్ధ సతిలా వున్నపార్వతి ఒడిలో తల పెట్టుకుని శతాధికవృద్ధునిలా మారిన శివుడు దాహార్తి వున్నట్టుగా తపించిపోతూ అలమటిస్తున్నాడు.

మరణం అంచులలో వున్న తన పతి దాహాన్ని తీర్చమని ఆ తల్లి ప్రతి ఒక్కరినీ అర్ధిస్తోంది. గుక్కెడు నీరు పోసి, నాకోసం నా పతిని  బ్రతికించండి అంటూ కన్నీటితో తమ ముందు నుంచి వెడుతున్న వారిని బ్రతిమాలుతోంది. ఆమె ఆవేదన ఏ ఒక్కరూ అలకించలేదు సరికదా, ఆమెని ఆమె భర్తని శాపనార్ధాలు పెడుతూ కొందరు, దారిలోంచి పక్కకి పొమ్మని మరికొందరు, గుడిలో అభిషేకం తర్వాత వచ్చి నీళ్ళు ఇస్తామని అతి కొద్దిమంది అంటారు. చాలామంది మాత్రం భిక్షాటన నేరమని,ఇలా దారిలో ఇబ్బంది కలిగిస్తున్న వాళ్ళని రక్షకభటులు తక్షణమే తరిమికొట్టాలని అంటారు. జనాలని ఆకర్షించడానికి ముసలావిడ భలే ఎత్తు వేసిందని ఒకరిద్దరు పడిపడి నవ్వుతారు. నిస్సహాయులుగా రోదిస్తున్న ఆ వృద్ధజంటని చూసినా కూడా ఒక్క మనసు కూడా కరగలేదు. చివరికి ఒక వ్యక్తి వారిని చూసి, వారి దుస్థితికి చలించిపోయి దగ్గరికి వస్తాడు. నిజానికి అతనొక జేబు దొంగ. ఈ పండుగ రద్దీలో అందినంత సొమ్ము కాజేయాలని వస్తాడు. కిందకి వంగి వృద్ధుని పక్కకి చేరి తన దగ్గరున్న నీటి సీసాని తీస్తాడు. కానీ పార్వతి అతన్ని పరీక్షింపదలచి “ సోదరా, కృతజ్ఞతలు. నీవు ఇవ్వబోయే నీటిని, మరణం అంచుల్లో వున్న నా భర్త తన పిడచకట్టుకు పోయిన గొంతుతో త్రాగాలంటే, జీవితంలో నీవు ఇంతవరకు చేసిన మంచిని వివరించాలి. అది వింటూ నా భర్త నీవు ఇచ్చిన నీటిని త్రాగుతాడు. అంటుంది. ఆ మాటలకి ఆ కరడుగట్టిన

దొంగ“ అమ్మా, ఇంతవరకు నా జీవితంలో నేను ఏ మంచిని చేయలేదు. మరొకరి దుస్థితి ని చూసి నా మనసు చలించడం ఇదే మొదటిసారి. ఆ ఆలయంలో వున్న వారణాసి విశ్వేశ్వరుడే ఇందుకు సాక్షి. అంటూ తన దగ్గరున్న నీటిని వృద్ధుని నోటిలో పోస్తాడు. తక్షణమే కళ్ళు మిరుమిట్లు గొలిపేలా పార్వతీపరమేశ్వరులు తమ నిజ రూపాలలో సాక్షాత్కరిస్తారు. శూన్య హృదయులైనఅన్ని లక్షల మందిలో, అతనొక్కడే స్వర్గానికి అర్హుడని అనుగ్రహిస్తారు. అతనిలోని ప్రేమ, సత్యం మాత్రమే దైవానుగ్రాహాన్ని పొందగలిగింది.

సేవల అవకాశాలకోసం సిద్ధంగా వుండాలి:

నిరుపేదలు, తెలివిలేని వారు, అన్నార్తులు,దాహర్తులు,రద్దీలో తల్లితండ్రుల నుండి తప్పిపోయిన పిల్లలు, ఆ పిల్లల కోసం వెదుకుతున్న తల్లితండ్రులు,రోగగ్రస్తులు, బలహీనులు, ఇతర విధాల బాధితుల వంటి వారిని చూసి స్వచ్ఛంద సేవకులు దయార్ద్ర హృదయంతో ప్రవర్తించాలి. అలాగే ఇటువంటి పుట్టుపండుగ దినాల హడావిడిలో సొమ్ములు దొంగిలించాలనుకునే మోసగాళ్ళని ఒక కంట కనిపెట్టాలి. వీరి గురుంచి భక్తులకు, వారి విలువైన వస్తువులు భద్రంగా చూసుకోవాలని  హెచ్చరికలు ఆందించాలి. రక్షణ,భద్రతల గురించి వారు ఎరుకకలిగి వుండడంలో సాయం చేయాలి.

సేవలను అందిపుచ్చుకునే అవకాశాల కోసం ఎదురుచూడాలి తప్ప, మమ్మల్ని ఇదే చేయమన్నారు, ఇంతవరకే మా పరిమితి, ఇది దాటకూడదు అనే ఆలోచన కూడదు. బస్సుల్లోనుండి ప్రయాణికులు దిగుతున్నపుడు, ఎవరి వస్తువులు వారు దింపుకోవడములో సాయం చేయాలి. అలాగే వసతి అందుబాటు గురించి ప్రేమపూర్వకంగా సమాచారం ఇవ్వాలి. నీకు ఒక విధమైన సేవని కేటాయించారు కనుక, ఈ పనిని చెప్పలేదు అని దూరం నుంచి చూస్తూ నిలబడడం కాదు. బైట వారు నీవున్న ప్రదేశానికి వచ్చారు. వారిని తగిన రీతిలో హృదయపూర్వకంగా ఆహ్వానించాలి.

స్వచ్ఛంద సేవకులకి సేవలలో పరిమితులు లేవు: 

నీవెలా గౌరవింపబడాలి అని భావిస్తున్నావో,అదే రీతిలో వచ్చిన అతిధులని ఆదరించాలి. ఈ నిలయాన్ని దర్శించాలని ఎన్నో యేళ్లుగా ఎదురుచూసి, ఎన్నో నెలలుగా ఏర్పాట్లు చేసుకుని, ఆనందం కోసం వారంతా వచ్చారు. వాహనాల డ్రైవరులు,కండక్టర్లు ప్రయాణికులని వదిలి తమ దారిన తాము పోవచ్చును. ఈ సందడిలో వచ్చినవారు తమ వస్తువులను పోగొట్టుకుని వుండవచ్చును. అప్పుడే నీవు అప్రమత్తతో వుండాలి. ఆ సమయంలో వారికి తగిన సాయం అందించగలిగితే,“ ఒక మంచి మిత్రుడు మా వస్తువులు వెదకడంలో మాకు సాయం చేశాడు. మేము ఇక్కడికి వచ్చీరాగానే అతను ఎంతో ధైర్యం చెప్పాడు. ఇక్కడున్న ప్రతీఒక్కరూ, మా బంధుమిత్రుల కన్నా ఎంతో ప్రేమ కురిపించారు. ప్రేమ, దయ, కరుణ ల తో పాటు, సమర్ధవంతమైన సేవలు అందించడమే కాక, కుల మత వర్ణ వర్గ ధనిక పేద హోదాలు వంటి తేడాలు లేని ప్రదేశం ఇదొక్కటే” అని ఎంతో ఆనందంతో వారు చెప్పుకుంటారు.

నన్ను చూడండి, ఈ పనుల వల్ల ఏమి లాభం పొందగలుగుతున్నాను. ఏ లాభాలయినా ఏ కార్యక్రమాలకి అవసరమో వాటి కొరకు నేనే కేటాయిస్తున్నాను. అయినా సరే నేను ఉదయం నుండి రాత్రి వరకు, రాత్రి నుండి ఉదయం వరకు బిజీ గానే వుండడం మీరు చూస్తున్నారు.మధ్యాహ్నం గాని, రాత్రి గానీ నా భోజనం త్వరగా ముగిస్తాను, తద్వారా కాలం విలువ మీకు తెలియ చెప్పాలనుకుంటాను. పలు కార్యక్రమాలకి సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా నేను పట్టించుకుంటాను. ఆ విధంగా మీకు నేనొక ఉదాహరణగా నిలబడాలనుకుంటాను. అత్యవసర పరిస్థితులను వూహించి లెక్కలు వేసుకుని ఎదురుకోవడానికి సిద్ధంగా వుంటాను. మీలో చాలామంది, మీకు కేటాయించిన పనులు కాగానే, రోజు చివరిలో విలువైన సమయాన్ని పనికి మాలిన మాటలతో, గాలి కబుర్లతో,అనవసర వాదనలతో గడుపుతున్నారని నాకు తెలుసు.మీరు చేసే ప్రతీ చర్యని సర్వాంతర్యామిగా సర్వత్రా నిండి వున్న భగవంతుడు గమనిస్తుంటాడనే చింతనని, మీరు కలిసి సేవించే ప్రతీ జీవిలోనూ భగవంతుడు వున్నాడు అన్న విశ్వాసాన్ని అలవరుచుకుంటే, ఆ పరమాత్ముని దృష్టి లో పడి అనుగ్రహాన్ని పొందగలుగుతారు.

 

సేవ చేసే అవకాశాన్ని జారవిడుచుకోవద్దు:

అజ్ఞానం వల్లనో , నిర్లక్ష్యం వల్లనో అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు.  అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగండి. ఆదేశాలు పాటించడం, సూచనలు స్వీకరించడం, అత్యంత ప్రేమతో కర్తవ్యాన్ని నిర్వహించడమే అనుగ్రహం పొందడానికి అత్యుత్తమ మార్గం. నేను ఏదైతే ఇవ్వడానికి సిద్ధంగా వున్నానో, అది పూర్తిగా మీరు అందుకోలేకపోతున్నారని దిగులుగా వున్నాను. తామరలు నిండిన చెరువులో కప్పలు చాలానే వుంటాయి. దూర తీరాల నుంచి వచ్చిన తుమ్మెదలు,తామరలోనే అమృతతుల్యమైన మకరందం వుందని, దాని కోసమే వచ్చి  తాము గ్రోల గలుగుతున్నాయి తప్ప, ఆ మాధుర్యం గురించి కప్పలకి మాత్రం నచ్చచెప్పలేక పోతునట్లుగా వుంది.

ఇక్కడకు దర్శనం కోసం , సందేశం కోసం చేరిన ప్రజలకు  ప్రేమపూర్వకంగా చక్కని రీతిలో సేవలు అందించడం మీకొక మహద్భాగ్యం. తద్వారా వివక్ష లేకపోవడం , నిర్మోహత్వం కలిగి వుండడం , భక్తిని మరింత లోతుగా,విశాల భావనతో పెంచుకోవడం,తుదకు సర్వ జీవులలోని అంతర్శక్తి సాయి అని ఎరుక కలగడంతో మీ లోని సాధన మరింత పరిపుష్టమవుతుంది. మీ ఎల్లరకు మంచి జరగాలని ఆశిస్తున్నాను. నమ్రతగా వుండండి, మధురంగా వుండండి, నిజాయితీగా వుండండి..

(ప్రశాంతి నిలయం: పుట్టు పండుగ వేడుకలు, 22-11-1965.)

భక్తి జ్ఞానంతో చేరి

రెండూ ఒకటిగా కనిపిస్తాయి!

భక్తి జ్ఞానంగా మారినప్పుడు

రెండు వేరు వేరు అనరాదు!!

ఒక దశలో అది భక్తి

తరువాతి దశలో దానినే జ్ఞానంగా చెప్పుకుంటాము!!!

ఒకనాడు అది చెరకుగడ, తదనంతరం అదే చక్కెర!!!!

శ్రీ సత్య సాయి జై సాయిరామ్


ఓంశ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1965 నాటి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రశాంతి నిలయంలోని స్వచ్ఛంద సేవకులకు (Sevadal) అందించిన ఈ దివ్య సందేశం అత్యంత విలువైనది.

మీరు కోరినట్లుగా, ప్రతి పారాగ్రాఫ్‌లోని ముఖ్యమైన విషయాలను బుల్లెట్ పాయింట్ల రూపంలో తెలుగులోనే కింద ఇవ్వడం జరిగింది:

1. బ్యాడ్జి సాధనకి పిలుపు

·         అధికార గర్వం వద్దు: సేవకుల బ్యాడ్జి అనేది అధికారం చెలాయించడానికో, పనుల నుండి తప్పించుకుని విశ్రాంతి తీసుకోవడానికో ఇచ్చినది కాదు. దీని వల్ల బాధ్యత, పని భారం ఇంకా పెరుగుతాయి.

·         నమ్రతతో కూడిన సేవ: ప్రపంచం నలుమూలల నుండి వచ్చే భక్తులకు సేవ చేయడానికే ఈ బ్యాడ్జి. సేవ చేసేటప్పుడు "నేను ఇస్తున్నాను, అవతలివాడు పుచ్చుకుంటున్నాడు" అనే అహంకారం ఉండకూడదు.

·         ఆత్మ తత్వ విచారణ: సేవ చేసేవాడు, సేవ పొందేవాడు ఇద్దరూ ఒకే పరమాత్మ సముద్రంలోని రెండు అలల వంటివారని గుర్తించాలి.

2. వేదాలు - శాస్త్రాల అంతరార్ధం

·         మాధవత్వ సాధన: శాస్త్రాలలో చెప్పబడిన క్రమశిక్షణా మార్గాలన్నీ మనిషిని మాధవునిగా (దైవంగా) మార్చడానికే తోడ్పడతాయి.

·         తల్లి వంటి ప్రేమ: ఒక తల్లి తన పిల్లలను ఎలా సరిదిద్దుతుందో, భగవంతుడు కూడా సేవకులను సాధన వైపు నడిపిస్తూ, వారి తప్పులను సరిదిద్దడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

3. స్వచ్ఛంద సేవకులు తమ సుఖాలను త్యాగం చేయాలి

·         అహంకార నిర్మూలన: సేవ యొక్క ముఖ్య ఉద్దేశ్యం నేను’, ‘మనంఅనే అహాన్ని అణిచివేయడమే. ఇదే నిజమైన ఆత్మవిద్య’.

·         స్వార్థం లేని త్యాగం: సేవకులు తమ సుఖాలను వదులుకోవాలి. సేవలో ఉన్నప్పుడు బాబా దర్శనం కానీ, సందేశం వినాలని కానీ ఆశించకూడదు. "ముందు నా అవసరం తీరాలి" అనుకుంటే అది సేవ కాదు, ఒక పన్నాగం మాత్రమే.

·         సీట్ల సర్దుబాటు: తాము కూర్చున్న సీట్లను బలహీనులకు, పెద్దవారికి ఇవ్వడమే నిజమైన సేవ.

4. మృదువైన సంభాషణ - బాధ్యత

·         మృదుమధుర సంభాషణ: భక్తులను నెట్టడం, తోయడం చేయకూడదు. చాలామంది సేవకులు "మేము గట్టిగా చెబితేనే వింటారు" అని సాకులు చెబుతుంటారు, కానీ అటువంటి వారిని బాబా క్షమించరు.

·         భక్తుల సంరక్షణ: ఎండవేడిమి వల్ల భక్తులు, ముఖ్యంగా వికలాంగులు, రక్తపోటు (బి.పి) ఉన్నవారు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా సురక్షిత స్థలాలకు చేర్చాలి. వారిని ఒక అరుదైన పువ్వులా, ఖరీదైన పండులా భావించి కాపాడాలి.

5. అతిధుల బాగోగులే ముఖ్యం

·         ప్రశాంతి నిలయ ప్రతినిధులు: సేవకులంతా ప్రశాంతి నిలయ ప్రతినిధులు, కాబట్టి ముందు వారి హృదయాలలో ప్రశాంతి (శాంతి) నింపుకోవాలి. కోపం, నిరుత్సాహం పనికిరావు.

·         అతిథి మర్యాద: ఇంట్లోకి అతిథి వచ్చినప్పుడు భార్య ముందుగా అతిథికే వడ్డిస్తుంది. అలాగే సేవకులు కూడా తమ సౌకర్యాలను పక్కనబెట్టి భక్తులను ప్రేమతో ఆదరించాలి.

·         నిశ్శబ్దాన్ని కాపాడడం: ఎవరైనా తెలియక గట్టిగా మాట్లాడితే వారిపై అరవడం, సైగలు చేయడం చేయకూడదు. వారి దగ్గరకు వెళ్ళి చెవిలో నెమ్మదిగా ఇక్కడి నియమాలను చెప్పాలి, ఎందుకంటే ప్రశాంతి నిలయంలో చాలామంది జపం, ధ్యానంలో ఉంటారు.

6. తాత్కాలికం కాకూడదు (సత్యహరిశ్చంద్రుని ఉదాహరణ)

·         నిరంతర సాధన: సేవ అనేది కేవలం ఆ ఒక్క వారానికి మాత్రమే పరిమితం కాకూడదు. నాటకంలో హరిశ్చంద్రుని పాత్ర వేసిన అబద్ధాలకోరులా ఉండకూడదు.

·         ఆచరణ: హరిశ్చంద్రుడు రాజభవనంలో ఉన్నా, శ్మశానంలో ఉన్నా సత్యమునే నమ్మాడు. అలాగే సేవకులు కూడా ఎక్కడున్నా ఆ క్రమశిక్షణను వదలకూడదు.

7. ప్రశాంతి నిలయ సరిహద్దులు దాటాక ప్రవర్తన

·         కపట ప్రవర్తన వద్దు: కొందరు ప్రశాంతి నిలయం గేటు దాటగానే కాఫీహౌస్‌లలో చేరి ధూమపానం, అరుచుకోవడం, పుకార్లు పుట్టించడం, పొగరుగా ప్రవర్తించడం చేస్తుంటారు. ఇది సిగ్గుమాలినతనం.

·         ప్రపంచమంతా ప్రశాంతి నిలయమే: ఈ ప్రపంచాన్ని కేవలం రాతి, సిమెంట్ కట్టడంగా చూడకూడదు. ప్రపంచమంతా ప్రశాంతి నిలయమే, కానీ మనిషి తన అజ్ఞానంతో దీనిని పాములపుట్టగా మార్చుకుంటున్నాడు.

8. సేవలో తెలివి, నైపుణ్యం అవసరం (పిల్లి-పరీక్ష ఉదాహరణ)

·         సమర్థత లేని ఉత్సాహం నష్టం: సేవ చేయాలనే ఉత్సాహంతో పాటు తెలివి, నైపుణ్యం కూడా ఉండాలి.

·         పిల్లి కథ అంతరార్ధం: పరీక్షల్లో మోసం చేయడానికి పిల్లి తోకకు జవాబులు కట్టి, చివరకు దొరికిపోయిన ఇద్దరు స్నేహితుల కథ ద్వారా... ఇటువంటి పిచ్చి తెలివితేటలు భగవంతుని దగ్గర సాగవని హెచ్చరించారు.

·         నిష్పక్షపాత సేవ: సేవ పొందిన వ్యక్తి తృప్తి చెందాడా లేదా అనేది పక్కనబెట్టి, ఎటువంటి సంకోచం, పక్షపాతం లేకుండా సేవను పరిపూర్ణంగా అందించడమే సేవకుని బాధ్యత.

9. ఎక్కువ మాటలు - తక్కువ పని (భగవంతుణ్ణి మోసం చేయలేరు)

·         ఆర్భాటాలు వద్దు: విస్తట్లో లడ్డూ వడ్డించకుండా, బుట్ట పట్టుకుని 'లడ్డూలు లడ్డూలు' అని అరుస్తూ తిరగడం వల్ల ఉపయోగం లేదు. ప్రస్తుత కాలంలో మాటలు ఎక్కువ, పని తక్కువ అవుతోంది. కానీ అంతర్యామి అయిన భగవంతుణ్ణి ఎవరూ మోసం చేయలేరు.

10. పార్వతీపరమేశ్వరుల వారణాసి వృత్తాంతం (సత్యం-పవిత్రత)

·         స్వార్థంతో కూడిన భక్తి: శివరాత్రి నాడు కాశీలో ఉన్న లక్షలాది భక్తులలో అందరికీ స్వర్గ ప్రాప్తి కలగదు, ఎందుకంటే వారిలో పవిత్రత, సత్యం లేవు, అంతా స్వార్థమే.

·         జేబుదొంగ కథ: ముసలి దంపతులుగా మారిన పార్వతీపరమేశ్వరులలో, మరణशय్యపై ఉన్న వృద్ధునికి (శివునికి) లక్షలాది మంది భక్తులు నీరు ఇవ్వలేదు. కానీ ఒక జేబుదొంగ తన పాపాలను ఒప్పుకుంటూ, నిఖార్సైన జాలితో నీరు అందించాడు. ఆ ప్రేమ, సత్యం వల్లే అతను దైవానుగ్రహాన్ని (స్వర్గాన్ని) పొందగలిగాడు.

11. సేవకులకు పరిమితులు లేవు - బాధ్యతలు

·         అప్రమత్తత: యాత్రికులు బస్సులు దిగేటప్పుడు సాయం చేయడం, వసతి సమాచారం ఇవ్వడం చేయాలి. "నాకు ఈ పని చెప్పలేదు కదా" అని దూరంగా నిలబడకూడదు.

·         నిర్వ్యాజ్యమైన ప్రేమ: కుల, మత, వర్గ, ధనిక, పేద భేదాలు లేకుండా అందరినీ సమానంగా ఆదరించాలి.

12. భగవంతుడే ఆదర్శం - సమయపాలన

·         బాబా స్వయంగా ఉదాహరణ: భగవంతుడైనప్పటికీ బాబా ఉదయం నుండి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా భక్తుల కోసమే పనిచేస్తుంటారు. కాలం విలువను తెలియజెప్పడానికే ఆయన త్వరగా భోజనం ముగిస్తారు.

·         సమయాన్ని వృథా చేయకండి: పనులు కాగానే సేవకులు గాలి కబుర్లతో సమయం వృథా చేయకూడదు. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడనే చింతన కలిగి ఉండాలి.

13. సేవ చేసే అవకాశాన్ని జారవిడుచుకోవద్దు (కప్పలు - తుమ్మెదల ఉదాహరణ)

·         మహద్భాగ్యం: తామర చెరువులోనే ఉన్నా కప్పలు మకరందాన్ని ఆస్వాదించలేవు, కానీ ఎక్కడో దూరం నుండి వచ్చే తుమ్మెదలు ఆ మధురిమను గ్రహిస్తాయి. అలాగే, దగ్గరుండి కూడా సేవకులు ఈ అద్భుత అవకాశాన్ని అజ్ఞానంతో జారవిడుచుకోవద్దు.

·         ముగింపు సందేశం: "నమ్రతగా వుండండి, మధురంగా వుండండి, నిజాయితీగా వుండండి."

14. చివరగా దివ్య సూక్తి

·         భక్తి మరియు జ్ఞానం రెండు వేరు వేరు కావు. ఒక దశలో భక్తిగా ఉన్నదే తదుపరి దశలో జ్ఞానంగా మారుతుంది.

·         ఇది ఎలాగంటే... ఒకనాడు చెరకుగడగా ఉన్నదే, తదనంతర ప్రక్రియలో చక్కెరగా మారుతుంది. రెండూ ఒకటే!

జై సాయిరామ్ఓంశ్రీ సాయిరామ్

ఓంశ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1965 నాటి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రశాంతి నిలయంలోని స్వచ్ఛంద సేవకులకు (Sevadal) అందించిన ఈ దివ్య సందేశం అత్యంత విలువైనది.

మీరు కోరినట్లుగా, ప్రతి పారాగ్రాఫ్‌లోని ముఖ్యమైన విషయాలను బుల్లెట్ పాయింట్ల రూపంలో తెలుగులోనే కింద ఇవ్వడం జరిగింది:

1. బ్యాడ్జి – సాధనకి పిలుపు

  • అధికార గర్వం వద్దు: సేవకుల బ్యాడ్జి అనేది అధికారం చెలాయించడానికో, పనుల నుండి తప్పించుకుని విశ్రాంతి తీసుకోవడానికో ఇచ్చినది కాదు. దీని వల్ల బాధ్యత, పని భారం ఇంకా పెరుగుతాయి.

  • నమ్రతతో కూడిన సేవ: ప్రపంచం నలుమూలల నుండి వచ్చే భక్తులకు సేవ చేయడానికే ఈ బ్యాడ్జి. సేవ చేసేటప్పుడు "నేను ఇస్తున్నాను, అవతలివాడు పుచ్చుకుంటున్నాడు" అనే అహంకారం ఉండకూడదు.

  • ఆత్మ తత్వ విచారణ: సేవ చేసేవాడు, సేవ పొందేవాడు ఇద్దరూ ఒకే పరమాత్మ సముద్రంలోని రెండు అలల వంటివారని గుర్తించాలి.

2. వేదాలు - శాస్త్రాల అంతరార్ధం

  • మాధవత్వ సాధన: శాస్త్రాలలో చెప్పబడిన క్రమశిక్షణా మార్గాలన్నీ మనిషిని మాధవునిగా (దైవంగా) మార్చడానికే తోడ్పడతాయి.

  • తల్లి వంటి ప్రేమ: ఒక తల్లి తన పిల్లలను ఎలా సరిదిద్దుతుందో, భగవంతుడు కూడా సేవకులను సాధన వైపు నడిపిస్తూ, వారి తప్పులను సరిదిద్దడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

3. స్వచ్ఛంద సేవకులు తమ సుఖాలను త్యాగం చేయాలి

  • అహంకార నిర్మూలన: సేవ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ‘నేను’, ‘మనం’ అనే అహాన్ని అణిచివేయడమే. ఇదే నిజమైన ‘ఆత్మవిద్య’.

  • స్వార్థం లేని త్యాగం: సేవకులు తమ సుఖాలను వదులుకోవాలి. సేవలో ఉన్నప్పుడు బాబా దర్శనం కానీ, సందేశం వినాలని కానీ ఆశించకూడదు. "ముందు నా అవసరం తీరాలి" అనుకుంటే అది సేవ కాదు, ఒక పన్నాగం మాత్రమే.

  • సీట్ల సర్దుబాటు: తాము కూర్చున్న సీట్లను బలహీనులకు, పెద్దవారికి ఇవ్వడమే నిజమైన సేవ.

4. మృదువైన సంభాషణ - బాధ్యత

  • మృదుమధుర సంభాషణ: భక్తులను నెట్టడం, తోయడం చేయకూడదు. చాలామంది సేవకులు "మేము గట్టిగా చెబితేనే వింటారు" అని సాకులు చెబుతుంటారు, కానీ అటువంటి వారిని బాబా క్షమించరు.

  • భక్తుల సంరక్షణ: ఎండవేడిమి వల్ల భక్తులు, ముఖ్యంగా వికలాంగులు, రక్తపోటు (బి.పి) ఉన్నవారు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా సురక్షిత స్థలాలకు చేర్చాలి. వారిని ఒక అరుదైన పువ్వులా, ఖరీదైన పండులా భావించి కాపాడాలి.

5. అతిధుల బాగోగులే ముఖ్యం

  • ప్రశాంతి నిలయ ప్రతినిధులు: సేవకులంతా ప్రశాంతి నిలయ ప్రతినిధులు, కాబట్టి ముందు వారి హృదయాలలో ప్రశాంతి (శాంతి) నింపుకోవాలి. కోపం, నిరుత్సాహం పనికిరావు.

  • అతిథి మర్యాద: ఇంట్లోకి అతిథి వచ్చినప్పుడు భార్య ముందుగా అతిథికే వడ్డిస్తుంది. అలాగే సేవకులు కూడా తమ సౌకర్యాలను పక్కనబెట్టి భక్తులను ప్రేమతో ఆదరించాలి.

  • నిశ్శబ్దాన్ని కాపాడడం: ఎవరైనా తెలియక గట్టిగా మాట్లాడితే వారిపై అరవడం, సైగలు చేయడం చేయకూడదు. వారి దగ్గరకు వెళ్ళి చెవిలో నెమ్మదిగా ఇక్కడి నియమాలను చెప్పాలి, ఎందుకంటే ప్రశాంతి నిలయంలో చాలామంది జపం, ధ్యానంలో ఉంటారు.

6. తాత్కాలికం కాకూడదు (సత్యహరిశ్చంద్రుని ఉదాహరణ)

  • నిరంతర సాధన: సేవ అనేది కేవలం ఆ ఒక్క వారానికి మాత్రమే పరిమితం కాకూడదు. నాటకంలో హరిశ్చంద్రుని పాత్ర వేసిన అబద్ధాలకోరులా ఉండకూడదు.

  • ఆచరణ: హరిశ్చంద్రుడు రాజభవనంలో ఉన్నా, శ్మశానంలో ఉన్నా సత్యమునే నమ్మాడు. అలాగే సేవకులు కూడా ఎక్కడున్నా ఆ క్రమశిక్షణను వదలకూడదు.

7. ప్రశాంతి నిలయ సరిహద్దులు దాటాక ప్రవర్తన

  • కపట ప్రవర్తన వద్దు: కొందరు ప్రశాంతి నిలయం గేటు దాటగానే కాఫీహౌస్‌లలో చేరి ధూమపానం, అరుచుకోవడం, పుకార్లు పుట్టించడం, పొగరుగా ప్రవర్తించడం చేస్తుంటారు. ఇది సిగ్గుమాలినతనం.

  • ప్రపంచమంతా ప్రశాంతి నిలయమే: ఈ ప్రపంచాన్ని కేవలం రాతి, సిమెంట్ కట్టడంగా చూడకూడదు. ప్రపంచమంతా ప్రశాంతి నిలయమే, కానీ మనిషి తన అజ్ఞానంతో దీనిని పాములపుట్టగా మార్చుకుంటున్నాడు.

8. సేవలో తెలివి, నైపుణ్యం అవసరం (పిల్లి-పరీక్ష ఉదాహరణ)

  • సమర్థత లేని ఉత్సాహం నష్టం: సేవ చేయాలనే ఉత్సాహంతో పాటు తెలివి, నైపుణ్యం కూడా ఉండాలి.

  • పిల్లి కథ అంతరార్ధం: పరీక్షల్లో మోసం చేయడానికి పిల్లి తోకకు జవాబులు కట్టి, చివరకు దొరికిపోయిన ఇద్దరు స్నేహితుల కథ ద్వారా... ఇటువంటి పిచ్చి తెలివితేటలు భగవంతుని దగ్గర సాగవని హెచ్చరించారు.

  • నిష్పక్షపాత సేవ: సేవ పొందిన వ్యక్తి తృప్తి చెందాడా లేదా అనేది పక్కనబెట్టి, ఎటువంటి సంకోచం, పక్షపాతం లేకుండా సేవను పరిపూర్ణంగా అందించడమే సేవకుని బాధ్యత.

9. ఎక్కువ మాటలు - తక్కువ పని (భగవంతుణ్ణి మోసం చేయలేరు)

  • ఆర్భాటాలు వద్దు: విస్తట్లో లడ్డూ వడ్డించకుండా, బుట్ట పట్టుకుని 'లడ్డూలు లడ్డూలు' అని అరుస్తూ తిరగడం వల్ల ఉపయోగం లేదు. ప్రస్తుత కాలంలో మాటలు ఎక్కువ, పని తక్కువ అవుతోంది. కానీ అంతర్యామి అయిన భగవంతుణ్ణి ఎవరూ మోసం చేయలేరు.

10. పార్వతీపరమేశ్వరుల వారణాసి వృత్తాంతం (సత్యం-పవిత్రత)

  • స్వార్థంతో కూడిన భక్తి: శివరాత్రి నాడు కాశీలో ఉన్న లక్షలాది భక్తులలో అందరికీ స్వర్గ ప్రాప్తి కలగదు, ఎందుకంటే వారిలో పవిత్రత, సత్యం లేవు, అంతా స్వార్థమే.

  • జేబుదొంగ కథ: ముసలి దంపతులుగా మారిన పార్వతీపరమేశ్వరులలో, మరణशय్యపై ఉన్న వృద్ధునికి (శివునికి) లక్షలాది మంది భక్తులు నీరు ఇవ్వలేదు. కానీ ఒక జేబుదొంగ తన పాపాలను ఒప్పుకుంటూ, నిఖార్సైన జాలితో నీరు అందించాడు. ఆ ప్రేమ, సత్యం వల్లే అతను దైవానుగ్రహాన్ని (స్వర్గాన్ని) పొందగలిగాడు.

11. సేవకులకు పరిమితులు లేవు - బాధ్యతలు

  • అప్రమత్తత: యాత్రికులు బస్సులు దిగేటప్పుడు సాయం చేయడం, వసతి సమాచారం ఇవ్వడం చేయాలి. "నాకు ఈ పని చెప్పలేదు కదా" అని దూరంగా నిలబడకూడదు.

  • నిర్వ్యాజ్యమైన ప్రేమ: కుల, మత, వర్గ, ధనిక, పేద భేదాలు లేకుండా అందరినీ సమానంగా ఆదరించాలి.

12. భగవంతుడే ఆదర్శం - సమయపాలన

  • బాబా స్వయంగా ఉదాహరణ: భగవంతుడైనప్పటికీ బాబా ఉదయం నుండి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా భక్తుల కోసమే పనిచేస్తుంటారు. కాలం విలువను తెలియజెప్పడానికే ఆయన త్వరగా భోజనం ముగిస్తారు.

  • సమయాన్ని వృథా చేయకండి: పనులు కాగానే సేవకులు గాలి కబుర్లతో సమయం వృథా చేయకూడదు. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడనే చింతన కలిగి ఉండాలి.

13. సేవ చేసే అవకాశాన్ని జారవిడుచుకోవద్దు (కప్పలు - తుమ్మెదల ఉదాహరణ)

  • మహద్భాగ్యం: తామర చెరువులోనే ఉన్నా కప్పలు మకరందాన్ని ఆస్వాదించలేవు, కానీ ఎక్కడో దూరం నుండి వచ్చే తుమ్మెదలు ఆ మధురిమను గ్రహిస్తాయి. అలాగే, దగ్గరుండి కూడా సేవకులు ఈ అద్భుత అవకాశాన్ని అజ్ఞానంతో జారవిడుచుకోవద్దు.

  • ముగింపు సందేశం: "నమ్రతగా వుండండి, మధురంగా వుండండి, నిజాయితీగా వుండండి."

14. చివరగా దివ్య సూక్తి

  • భక్తి మరియు జ్ఞానం రెండు వేరు వేరు కావు. ఒక దశలో భక్తిగా ఉన్నదే తదుపరి దశలో జ్ఞానంగా మారుతుంది.

  • ఇది ఎలాగంటే... ఒకనాడు చెరకుగడగా ఉన్నదే, తదనంతర ప్రక్రియలో చక్కెరగా మారుతుంది. రెండూ ఒకటే!

జై సాయిరామ్

i would like to conduct quizz on the above points please give questions and answers please

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సందేశం ఆధారంగా స్వచ్ఛంద సేవ (Seva) మరియు సాధన అనే అంశాలపై 10 ప్రశ్నలతో ఒక ప్రత్యేకమైన క్విజ్ సిద్ధం చేయబడింది. ఈ ప్రశ్నలు బాబా వారు అందించిన ముఖ్యమైన సూత్రాలు, ఉదాహరణలు మరియు అంతరార్థాలను చక్కగా అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి.

శ్రీ సత్యసాయి సేవ మరియు సాధన క్విజ్
9 Jun, 2:36 pm

ఈ క్విజ్ ద్వారా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సందేశాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుని, మీ సేవారంగంలో ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్! జై సాయిరామ్.



భారతదేశ వ్యాప్తంగా అనుసరించవలసిన శ్రీ సత్యసాయి భజన విధానం

  భారతదేశ వ్యాప్తంగా అనుసరించవలసిన శ్రీ సత్యసాయి భజన విధానం:-   ఓంకారం ( 3 సార్లు).     వేదపఠనము -   15 నిమిషాలు. *   శ్రీ సత్యసాయి అష్టోత...