Thursday, September 30, 2021

PRASHANTI NILAYAM SERVICE & SIVAM SECURITY DUTIES - ON EVERY SATURDAY IN OCTOBER, 2021.



         ఓం శ్రీ సాయిరాం   

         3వ తారీకు శనివారం శ్రీ సత్య సాయి మందిరం శివం నందు సర్వీస్ చేయుటకు గాను ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ చక్రధర్ గారు శ్రీ హరి ముత్యం నాయుడు గారు శ్రీ శ్రీనివాస్ గారు హాజరవుతారని తెలియజేయుచున్నాము. 

        సర్వీస్ చేయుటకు వచ్చే ముందు 7:45 కల్లా శివ మందిరం దగ్గర ఉండవలెను . డ్రెస్ కోడ్ స్కార్ఫ్ మైంటైన్ చేయవలెను. సెల్ ఫోన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు. ఇచ్చిన ఈ అవకాశాన్ని భక్తిశ్రద్ధలతో, పూర్తి చేస్తారని ఆశిస్తూ, స్వామివారికి శతకోటి వందనాలు సమర్పిస్తూ,   

         మన శ్రీ సత్య సాయికోటి సమితి.


1st Jan 2022, 8th Jan 2022, 15th Jan 2022, Sri V Srinivas, & Lakshminarayna of Huppu Guda have attended the Sivam Duties. 

For the Calendar Year 2020: Sri V Srinivas has attended fully Sivam Duties, and for the encouragement, Swamy blessed and facilitated at Sivam  8th Jan 2022.

20-8-2022: today Mr V Srinivas, Sri Ram Reddy, and Mr Kamesh Gandhi have attended the Sivam Security Duties. 

pl click here for the felicitations Program at Sivam 



JAN 2022 SEVA SAADHANA AT PRASHANTI NILAYAM.: 

STARTING FROM KACHIGUDA - GOWLIGUDA ON 6TH JAN

 2022 REACHING 7TH JAN 2022. RETURN DATE 15-1-2022. AT 4 PM 


1) SRI YOGESH  PATIL  713245    BUS TICKET PURCHASED

2) SRI VENKAT RAO      149959     BUS TICKET PURCHASED.    

3) SRI M LAKSHMINARYANA     BY TRAIN              

4) SRI Y PANDU.                              BY TRAIN 

 PNR No.:4842991583,

TXN ID:100003103373147,

Passenger Name:M LAXMINARAYANA,Y PANDU,

Gender:M,M,

Age:65,32,

Status:CNF,CNF,

Quota:GN,

Train Number:17603 ,

Train Name: KACHEGUDA - YELHANKA  Prashanti Nilayam Exp,

Scheduled Departure:06-Jan-2022 21:05 ,

From:KACHEGUDA,

To:SATYA SAI P NILAYAM,

Date of Journey:06-Jan-2022,

Class:SL,

Ticket Fare: Rs.630.0,

IRCTC SC: Rs.0.0+ PG Charges Extra.






M LAKSHMINARAYANA – 65 AADHADHAR CARD NO. 782644314255 H.NO. 21-3-740 CHELAPURA, HYDERABAD – 500 002 CELL NO. 9052151409 SAI CONNECT NO.

 Y PANDU 32 YEARS CELL NO. 6305758913 C/O PREM SIA CALENDER SHOP OSMAN GUNJ, HYDERABAD SAI CONNECT NO: 265207

 



NOVEMBER, 2021 SERVICE AT PRASHANTI NILAYAM 

SRI RAMULU 
SRI LAKSHMINARAYANA.
BOTH HAVE STARTED ON 18TH NOVEMBER BY BUS AND REACHED PRASHANTI NILAYAM ON 19TH AND STAYED UP TO 30TH NOVEMBER, AND CAME BACK ON 1 ST DECEMBER, 2021. 


ఈ ప్రపంచములో మిమ్మల్ని మించిన భక్తులు అనేకమంది ఉన్నారు.------కానీ నేను మిమ్మల్నే సేవాదల్ గా ఎందుకు ఎంచెకున్నానో గ్రహించండి.---- మీ తల్లిదండ్రులు తాతముత్తాతలు  చేసిన ప్రార్థనల ఫలితంగా, జన్మజన్మలుగా మీరు దైవ ప్రేమను కలిగివున్నందు వలన మీకు సత్యసాయి సంస్థలలో చేరి సేవలందించే అవకాశము లభించింది.----- మిమ్మల్ని స్వామియే స్వయముగా ఎన్నుకున్నారు.----కాబట్టి ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి. ---నేను చెపుతున్న ఈ మాటలు మీకిప్పుడు అర్ధం కాకపోవచ్చు.----- కానీ ఈ అవకాశన్ని జారవిడుచుకుంటే జీవితాన్ని వృధా చేసుకున్నవారవుతారు.--------"శ్రీ స సాయి". "స సా 2/20"

Saturday, September 25, 2021

భగవాన్ శ్రీ సత్యసాయి అవతార వైభవం

 ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీ సత్యసాయి అవతార వైభవం


23-11-1926 : స్వస్తిశ్రీ అక్షయనామ సంవత్సర కార్తీక బహుళ తదియ సోమవారము ఆర్ద్ర 

                                         నక్షత్రము ఉదయము గం.5.06లకు ఉషఃకాల బ్రహ్మముహూర్తమున 

                                         పరిపూర్ణ పరబ్రహ్మ మహావతార భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య

                                         అవతరణము (తల్లి ఈశ్వరమ్మ, తండ్రిపెద్ద వేంకమరాజు గారు).  

08-03-1940 : బాబా వారిని పుట్టపర్తిలో నల్లతేలు కుట్టడము.

23-05-1940 : నేను "సాయిబాబాను" అని ప్రకటించుట.

28-05-1940 : మల్లెపూలు "నేను సాయిబాబా" గ ఏర్పడుట.

19-10-1940 : హంపి విరూపాక్ష దేవాలయములో విరూపాక్షునికి బదులుగా బాబావారు   

                                         దర్శనమిచ్చుట.

20-10-1940 : అవతార ప్రకటన (ఉరవకొండలో నేను సాయిబాబాను అని ప్రకటించిన 

                                         దినం. అదేరోజు మానస భజరే గురుచరణం అనే భజనను చెప్పిన దినం)

14-12-1945 : పుట్టపర్తిలో పాతమందిరము ప్రారంభం.

26-09-1946 : పుట్టపర్తిలో మొదటి దసరా ఉత్సవాలు ప్రారంభం.

25-05-1947 : బాబావారు అన్నగారైన శ్రీ శేషమరాజు గారికి “అఖిల మానవులకు 

                                         ఆనందమొనగూర్చి”... అను చారిత్రాత్మక ఉత్తరము వ్రాసిన దినం.

25-10-1947 : తమిళనాడులో కరూర్ అనే పట్టణములో బాబావారు మొట్టమొదట 

                                         ప్రజలనుద్దేశించి దివ్య ప్రసంగము చేసిన దినం.

14-01-1948 : ప్రశాంతి మందిరమునకు బాబావారు శంకుస్థాపన చేసిన దినం.

03-02-1949 : తమిళనాడులో (GUINDY) గుఇండి అనే పట్టణములో బాబావారు శ్రీ 

                                         షిర్డీసాయి విగ్రహము ఆవిష్కరణము గావించినారు.

23-11-1950 : ప్రశాంతినిలయము ప్రారంభం. (25వ జన్మదినం సందర్భముగా)                                        

26-02-1955 : బాబావారు మొదటిసారి సేవాదళమును ఏర్పాటు గావించినారు.                                       

04-10-1956 : పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రారంభం.

16-02-1958 : బాబావారు శివరాత్రి సందర్భముగా “సనాతన సారథి” అను మాసపత్రిక 

                                         (తెలుగు మరియు ఆంగ్ల భాషలలో) ప్రారంభించినారు.

22-12-1958 : భగవాన్ బాబావారికి కన్యాకుమారిలో సముద్రుడు ముత్యాల హారమును 

                                         సమర్పించుకున్నారు.

29-06-1959 : బాబావారు వటవృక్ష ప్రతిష్ఠాపన (ధ్యాన వృక్షము) గావించినారు.

16-03-1960 : శ్రీమతి కరణం సుబ్బమ్మగారు నిర్యాణం చెందిన దినం.

26-02-1961 : నాగసాయి మందిరము, కోయంబత్తూరులో ప్రారంభించుట.

01-04-1961 : బాబావారి అయోధ్య యాత్ర.

00-06-1961 : బాబావారి బదరీనాథ్ యాత్ర.

06-10-1961 : దసరా ఉత్సవాల సందర్భముగా ప్రశాంతినిలయములో బాబావారు 

                                         “వేదపురుష జ్ఞానయజ్ఞం”ను ప్రారంభించినారు.

23-11-1961 : 36వ జన్మదినం సందర్భముగా ఆంగ్లములో శ్రీ ఎన్.కస్తూరి గారు రచించిన 

                                         “సత్యం శివం సుందరం” మొదటి భాగమును ఆవిష్కరించినారు.

16-10-1962 : “అఖిలభారత విద్వన్మహాసభ” ప్రారంభం.

23-11-1962 : “వేదపాఠశాల” ప్రారంభం.

05-01-1963 : బాబావారు శ్రీశైల క్షేత్ర మహిమకు వన్నె బెట్టుట.

22-02-1963 : శ్రీ దూపాటి తిరుమలాచార్యులు బాబావారి సుప్రభాతమును రచించి భక్తి 

                                         శ్రద్ధలతో స్వామివారికి సమర్పించుకున్నారు. స్వామి ఈ సుప్రభాత శ్లోకాలను 

                                         సరిదిద్ది స్వయానా బాణీ కట్టి ఆలపించారు. అంతేకాక, 1963  ఫిబ్రవరి 22   

                                         శివరాత్రి ఉషోదయ సమయాన వేదపాఠశాల విద్యార్థులచే 21 సార్లు 

                                         ఓంకారము చేయించి, మొట్టమొదటిసారిగా సుప్రభాతాన్ని పఠింపజేశారు.

18-03-1963 : బాబావారు ప్రశాంతినిలయములో మొట్టమొదట “శ్రీ సత్యసాయి భజన 

                                         కేంద్రము”ను ప్రారంభించినారు.

29-06-1963 : బాబావారు (ఒక అజ్ఞాత భక్తుని) పక్షవాతము స్వీకరణ.

06-07-1963 : బాబావారు గురుపూర్ణమి నాడు పక్షవాతము బాగుచేసుకొనుట మరియు ఆ 

                                         రోజే తాను “శివ-శక్తి” స్వరూపుడనని ప్రకటన.

04-11-1963 : శ్రీ పెద్ద వేంకమరాజు నిర్యాణము (బాబావారి తండ్రిగారు)

00-02-1964 : భగవాన్ బాబావారి భద్రాచలం యాత్ర.

13-04-1964 : బెంగళూరులో “బృందావనం” ప్రారంభం.

00-00-1965 : శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రారంభం.

13-06-1965 : భగవాన్ బాబావారు పండరిపురములో మంగళసూత్రమును సృష్టించి 

                                         రుక్మిణీదేవి మెడలో అలంకరించినారు.

00-08-1965 : బొంబాయిలో మొట్టమొదటగా “శ్రీ సత్యసాయి సేవా సమితి” ప్రారంభం.  

20-04-1967 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల మొదటి సమ్మేళనం -  మద్రాసులో 

                                          జరిగినది.                                       

08-05-1967 : ప్రశాంతి పట్టణ వాటిక ఏర్పడుట.

00-00-1967 : సనాతన సారథి అట్ట వెనుక ముద్రించుటకు భగవాన్ బాబావారు 

                                         స్వయముగా “సర్వధర్మ” గుర్తును లిఖించి ఇచ్చినారు. 

12-05-1968 : బొంబాయిలో “ధర్మక్షేత్ర” మరియు “సత్యదీప్”  ప్రారంభం. 

                                         (దీనిని కేవలము 108 రోజులలో నిర్మాణము పూర్తిజేసినారు)

16-05-1968 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల రెండవ సమ్మేళనం మరియు శ్రీ 

                                         సత్యసాయిసేవా సంస్థల మొదటి ప్రపంచ సమ్మేళనం – బొంబాయిలో 

                                         జరిగినవి.

30-06-1968 : 30-06-1968 నుండి 14-07-1968 వరకు ఉగాండా, టాంజానియా 

                                         మరియు కెన్యాలలో పర్యటించినారు.

22-07-1968 : శ్రీ సత్యసాయి ఆర్ట్స్ & సైన్స్ మహిళా కళాశాలను అనంతపురంలో 

                                         ప్రారంభించినారు.

00-00-1968 : శ్రీ సత్యసాయి బాలవికాస్ ప్రారంభం.

09-06-1969 : శ్రీ సత్యసాయి ఆర్ట్స్ & సైన్స్ పురుషుల కళాశాలను బృందావనంలో 

                                         ప్రారంభించినారు.

00-11-1969 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల మూడవ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

22-11-1969 : శ్రీ సత్యసాయి సంస్థల అఫీషియల్ సంవత్సర ప్రారంభదినము “మకర 

                                         సంక్రాంతి” దినమని ప్రకటించినారు.

11-05-1970 : బొంబాయిలో శ్రీ సత్యసాయి బాలవికాస్ గురువుల మొదటి సమ్మేళనం.

17-05-1970 : బాబావారు ద్వారకను సందర్శించినారు.

17-05-1970 : బాబావారు సోమనాథ్ మందిరములో జ్యోతిర్లింగము సృష్టించినారు మరియు 

                                         దిగ్విజయ్ ద్వారమును ప్రారంభించినారు.

00-11-1970 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల నాలుగవ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

27-01-1971 : శ్రీ సత్యసాయి సేవా సమితి, హైదరాబాదులో ప్రారంభం.

25-10-1971 : హైదరాబాదులో శివం మందిరమునకు బాబావారు శంకుస్థాపన.

00-12-1971 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల ఐదవ సమ్మేళనం మద్రాసులో 

                                         జరిగినది.

25-12-1971 : వాల్టర్ కోవన్ అనే విదేశీ భక్తుడిని పునర్జీవితుని చేయుట.

01-05-1972 : బృందావనంలో మొదటి సమ్మర్ కోర్స్ జరిగినది.

06-05-1972 : మాతృశ్రీ ఈశ్వరమ్మగారు పరమపదించినారు.

20-07-1972 : శ్రీమతి ఈశ్వరమ్మ హై స్కూల్ ప్రారంభం.

02-09-1972 : శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఏర్పాటు.

17-10-1972 : పూర్ణచంద్ర ఆడిటోరియం ప్రారంభం. (ఈ సభామందిరము సుమారు 

                                         15,000 మంది కూర్చొనగలిగే 60 x 40 మీటర్ల విస్తీర్ణము గలిగినది).

04-04-1973 : హైదరాబాదులో శివం మందిరము ప్రారంభం.

02-01-1974 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల ఆరవ సమ్మేళనం – రాజమండ్రిలో 

                                         జరిగినది. (1974 వ సంవత్సరము, జనవరి 2,3,4 తేదీలలో జరిగినది)  

00-00-1974 : బాబావారి నివాసము క్రింది గదిని కోరికలగదిగా మార్చినారు. 

10-04-1975 : జైపూరులో శ్రీ సత్యసాయి మహిళా కళాశాల ప్రారంభం.

26-08-1975 : పుట్టపర్తిని వరదతో ముంచివేయకుండా చిత్రావతినదిని వెనుకకు పంపుట.

29-08-1975 : గోకులం ప్రారంభం.

18-11-1975 : గోపురం ప్రారంభం.

00-00-1975 : ప్రశాంతినిలయములో గణేశ మందిరము ప్రారంభం.

00-11-1975 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల ఏడవ సమ్మేళనం మరియు శ్రీ 

                                         సత్యసాయిసేవా సంస్థల రెండవ ప్రపంచ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

21-11-1975 : ప్రతిదినము పిడికెడు బియ్యము తీయుట గురించి చెప్పిన దినం.

23-11-1975 : 50వ జన్మదినం సందర్భముగా 50 ఫీట్ల “సర్వధర్మ స్థూపం” ప్రారంభం.

00-00-1976 : శ్రీ సత్యసాయి విద్యావిహార్ హై స్కూల్, హైదరాబాద్ ప్రారంభం.

28-08-1976 : వైట్ ఫీల్డ్ లో శ్రీ సత్యసాయి హాస్పిటల్ ప్రారంభం.

13-11-1976 : మొదటి “అఖండ భజన” ప్రశాంతినిలయంలో ప్రారంభం.

06-05-1977 : ఈ సంవత్సరము నుండి మే 6వ తేదీని (మాతృశ్రీ ఈశ్వరమ్మ వర్ధంతి) 

                                         పిల్లల దినోత్సవముగా జరుపుచున్నారు. 

00-11-1977 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల ఎనిమిదవ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

24-12-1977 : “సాయి గాయత్రీ” మంత్రమును బృందావనములో శ్రీ గండికోట సుబ్రహ్మణ్య 

                                         శాస్త్రి గారు దర్శించి చెప్పిన దినం.

14-08-1978 : “శ్రీ సత్యసాయి లోకసేవా ట్రస్టు” ను ముద్దనహల్లిలో స్థాపించినారు.

00-00-1978 : బాబావారు పుట్టపర్తిలో మసీదు కట్టించి ప్రారంభించినారు. 

01-07-1979 : శ్రీ సత్యసాయి కాలేజ్ ప్రశాంతినిలయంలో ప్రారంభం.

22-11-1979 : పుట్టపర్తిలో బాబావారి జన్మస్థలములో “శివాలయము” ప్రారంభం.

07-03-1980 : బాబావారిని నీవు ఎవరు? అని అడిగితే నా నిజస్వరూపము ఇదేనని 

                                        “దత్తాత్రేయుని” చిత్రపటమును సృష్టించి చూపినారు.

01-06-1980 : బాబావారు 18 రోజుల కశ్మీర్ యాత్రకు వెళ్ళిన రోజు.

19-11-1980 : ప్రశాంతినిలయములో కాలేజీ ఆడిటోరియం, కాలేజీ భవనము మరియు 

                                         బాలుర హాస్టల్ భవనము ప్రారంభం.  

00-11-1980 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల తొమ్మిదవ సమ్మేళనం మరియు శ్రీ 

                                         సత్యసాయిసేవా సంస్థల మూడవ ప్రపంచ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

00-11-1980 : శ్రీ సత్యసాయిసేవా సంస్థల మూడవ ప్రపంచ సదస్సు అభ్యర్థన మేరకు 

                                         భగవాన్ పరమ కృపతో లిఖించి, సంస్థల కందించిన 6 శాశ్వత లక్ష్యములు 

                                         మరియు నవవిధ ప్రవర్తనా నియమావళి.                                        

19-01-1981 : మద్రాసులో “సుందరం” ప్రారంభం.

15-06-1981 : ప్రశాంతినిలయములో శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూల్ మరియు శ్రీ సత్యసాయి 

                                         హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రారంభం.

23-06-1981 : శ్రీ సత్యసాయి గురుకులం స్కూల్, రాజమండ్రి ప్రారంభం.

22-11-1981 : ప్రశాంతినిలయములో శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 

                                         ప్రారంభం.

00-11-1982 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల పదవ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

22-11-1982 : ప్రశాంతినిలయములో శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 

                                         యొక్క “పరిపాలనా భవనము” ప్రారంభం.

00-12-1983 : శ్రీ సత్యసాయి విద్యాగిరి స్టేడియం ప్రారంభం.

27-12-1983 : ప్రశాంతినిలయములో అంతర్జాతీయ బాలవికాస్ ర్యాలీ, బాలవికాస్ 

                                         గురువుల మరియు విద్యార్థుల సమ్మేళనం జరిగినది. (27-12-1983 

                                         నుండి 31-12-1983 వరకు)

28-12-1983 : గుణపర్తిలో ప్రేమసాయి తండ్రి జన్మించినట్లు బాబావారు ప్రకటించినారు.

31-12-1983 : బొంబాయిలో శ్రీ సత్యసాయి బాలవికాస్ గురువుల మొదటి సమ్మేళనం.

26-04-1984 : త్రయీ బృందావన్ ప్రారంభం.

18-11-1984 : శ్రీ సత్యసాయిసేవా సంస్థల మొదటి ప్రపంచ సేవాదళ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

17-02-1985 : శ్రీ శేషమరాజు నిర్యాణము (బాబావారి అన్నగారు)

23-07-1985 : ప్రశాంతినిలయములో శ్రీ సత్యసాయి  హయ్యర్ సెకండరీ స్కూల్ హాస్టల్ 

                                         భవనము ప్రారంభం.

16-11-1985 : పుట్టపర్తిలో గోకులం ప్రక్కన “కరణం సుబ్బమ్మ నగర్” అనే పేరుతో 60 

                                         ఇల్లు కట్టించి అర్హులకు అందించినారు.

00-11-1985 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల పదకొండవ సమ్మేళనం మరియు శ్రీ 

                                         సత్యసాయిసేవా సంస్థల నాలుగవ ప్రపంచ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినవి.

21-11-1985 : భగవాన్ తమ దివ్యోపన్యాసములో సంస్థ సభ్యులు గుర్తించి వర్తించవలసిన 

                                         దశసూత్రములు అనుగ్రహించినారు.

22-11-1985 : ప్రశాంతినిలయములో శ్రీ సత్యసాయి నక్షత్రశాల ప్రారంభం.

13-01-1986 : ప్రశాంతినిలయములో తల్లిదండ్రుల సమాధి ప్రక్కన గల స్థలములో శ్రీ 

                                         దత్తాత్రేయుని విగ్రహమును ప్రతిష్ఠచేసినారు.

19-06-1986 : ఉదకమండలంలో (kodaikanal) సాయిశృతి ప్రారంభం.

21-08-1986 : పుట్టపర్తిలో MBA కోర్సు ప్రారంభం. 

25-12-1986 : శ్రీమతి గాలి శారదాదేవి గారు (పెద్ద బొట్టు) పరమపదించినారు.

02-01-1987 : ప్రశాంతినిలయములో 02-01-1987 నుండి 04-01-1987 వరకు 

                                         మూడు రోజుల అఖిలాంధ్ర సాధు పరిషత్తు యొక్క సదస్సు జరిగినది.

14-08-1987 : శ్రీ ఎన్.కస్తూరి గారు పరమపదించినారు.

00-11-1987 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల పన్నెండవ సమ్మేళనం - 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

15-09-1988 : 15-09-1988 నుండి 21-09-1988 శ్రీ సత్యసాయి సేవా సంస్థల 

                                         రజితోత్సవములు జరిగినవి. (తెలుగు రాష్ట్రములలో)

27-03-1989 : శ్రీ కుటుంబరావు గారు పరమపదించినారు.

20-10-1990 : అవతార ప్రకటన గావించి 50 సంవత్సరములు పూర్తి అయిన సందర్భముగా 

                                         తెలుగు రాష్ట్రములలో బాబావారు వెలిగించిన జ్యోతులతో వీధి 

                                         వీధిలో, ఇంటింటా కార్యక్రమము జరుపుకొన్నాము మరియు ఆ రోజు నుండి 

                                         అవతార ప్రకటన దినోత్సవము జరుపుకొనుచున్నాము.

00-11-1990 : శ్రీ సత్యసాయిసేవా సంస్థల ఐదవ ప్రపంచ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

19-11-1990 : సనాతన సంస్కృతి ప్రదర్శనశాల ప్రారంభం.

22-11-1990 : శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంఖుస్థాపన.

22-11-1990 : 65వ జన్మదినం సందర్భముగా 65 ఫీట్ల “హనుమాన్ విగ్రహం” ప్రారంభం.

24-11-1990 : శ్రీ సత్యసాయి విమానాశ్రయము ప్రారంభం. 

22-11-1991 : పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం.

29-08-1992 : శ్రీ సత్యసాయి నిగమాగమం, హైదరాబాద్ ప్రారంభం.  

20-11-1992 : ప్రశాంతినిలయములో “శ్రీ సాయిశ్రీనివాస గెస్ట్ హౌస్” ప్రారంభం.

05-12-1992 : బృందావనంలో “సాయి రమేశ్ హాల్” ప్రారంభం.

09-07-1995 : ప్రశాంతినిలయములో “సాయి కుల్వంత్ హాల్” ప్రారంభం.

23-07-1995 : హయ్యర్ సెకండరీ స్కూల్ హాస్టల్ ప్రారంభం.

23-11-1995 : శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ ప్రారంభం. ఈ పథకం ద్వారా అనంతపురం 

                                         జిల్లాలోని సుమారు 700 గ్రామాలకు త్రాగునీరు సౌకర్యము కల్పించినారు.

00-11-1995 : శ్రీ సత్యసాయిసేవా సంస్థల ఆరవ ప్రపంచ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

21-10-1996 : ప్రశాంతినిలయములో “శాంతిభవన్ గెస్ట్ హౌస్” ప్రారంభం.

16-07-1997 : 16-07-1997 నుండి 18-07-1997 వరకు మొదటి ప్రపంచ యువజన 

                                         సమ్మేళనం ప్రశాంతినిలయములో జరిగినది.

21-09-1997 : ప్రశాంతినిలయములో “శ్రీ సుబ్రహ్మణ్యస్వామి మందిరం” ప్రారంభం.

22-09-1997 : భగవాన్ బాబావారు స్వర్ణరథమును అధిరోయించుట.

30-12-1997 : హిల్ వ్యూ స్టేడియంలో “శ్రీ సత్యసాయి యూనిటీ కప్ క్రికెట్ మ్యాచ్” 

                                         నిర్వహించడము జరిగినది.

09-10-1998 : ప్రశాంతినిలయములో “శ్రీ గాయత్రీ మాత మందిరం” ప్రారంభం.

12-03-1999 : న్యూ డిల్లీలో “శ్రీ సత్యసాయి ఇంటర్నేషనల్ సెంటర్” ప్రారంభం.

30-09-1999 : ప్రశాంతినిలయములో “సీతా, రామ, లక్ష్మణ, హనుమాన్” విగ్రహముల 

                                         ఆవిష్కరణ.

18-11-1999 : రెండవ ప్రపంచ యువజన సమ్మేళనం ప్రశాంతినిలయములో జరిగినది.

01-11-2000 : పుట్టపర్తి పరిసర గ్రామాలలో గ్రామ సేవ కార్యక్రమము ప్రారంభం.

18-11-2000 : చైతన్యజ్యోతి ప్రదర్శనశాల ప్రారంభం.

20-11-2000 : శ్రీ సత్యసాయి సంగీత కళాశాల ప్రారంభం.

22-11-2000 : శ్రీ సత్యసాయి ప్రశాంతినిలయము రైల్వే స్టేషన్ ప్రారంభం.

00-11-2000 : శ్రీ సత్యసాయిసేవా సంస్థల ఏడవ ప్రపంచ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

19-01-2001 : బెంగళూరులో శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం.

00-07-2001 : శ్రీ సత్యసాయి ఎడ్యుకేర్ రూపకల్పన జరిగినది.

05-07-2001 : ఈ దినము నుండి పాదనమస్కారములు వద్దు (గురుపూర్ణమి నాడు)

15-07-2001 : భగవాన్ బాబావారు మహారాష్ట్రలోని చాకూరులో మందిరము 

                                         ప్రారంభించినారు.

17-07-2001 : భగవాన్  బాబావారు నాందేడులో భక్తులనుద్దేశించి ప్రసంగించినారు.      

00-07-2001 : ప్రపంచ బాలవికాస్ గురువుల సమ్మేళనం ప్రశాంతినిలయములో జరిగినది.

23-08-2001 : శ్రీ సత్యసాయి బుక్ ట్రస్ట్ భవనము ప్రారంభం.

23-08-2001 : షాపింగ్ కాంప్లెక్స్ భవనము ప్రారంభం.

20-11-2001 : శ్రీ సత్యసాయి స్కూల్స్ యొక్క సదస్సు రెండు రోజులపాటు 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

23-11-2001 : రేడియో సాయి ప్రారంభం.

23-11-2001 : శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ ప్రారంభం. ఈ పథకం ద్వారా మహబూబ్                                        

                                         నగర్ మరియు మెదక్ జిల్లాలలోని కొన్ని గ్రామాలకు త్రాగునీరు సౌకర్యము 

                                         కల్పించినారు.

21-07-2002 : 21-07-2002 నుండి 24-07-2002 వరకు మొదటి ప్రపంచ “సేవా” 

                                         సమ్మేళనం ప్రశాంతినిలయములో జరిగినది.

24-07-2002 : గురుపౌర్ణమి సందర్భముగా బాబావారు తన నిలువెత్తు కాంస్య విగ్రహమును 

                                         ఆవిష్కరించినారు.

29-08-2002 : ప్రశాంతి డిజిటల్ స్టూడియో ప్రారంభం.

23-11-2004 : శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ ప్రారంభం. ఈ పథకం ద్వారా చెన్నై 

                                         నగరమునకు త్రాగునీరు సౌకర్యము కల్పించినారు.

09-08-2006 : 09-08-2006 నుండి 20-08-2006 వరకు ప్రశాంతినిలయములో 

                                         “అతిరుద్ర మహా యజ్ఞం” జరిపించినారు.

15-11-2006 : 15-11-2006 నుండి 18-11-2006 వరకు “సహస్ర పూర్ణ చంద్ర దర్శన 

                                         మహోత్సవం” జరిగినది.

22-11-2006 : శ్రీ సత్యసాయి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ప్రారంభం.

22-05-2007 : బాబావారి పెంపుడు ఏనుగు “సాయిగీత” మరణం.

23-05-2007 : బాబావారు సాయిగీతకు దగ్గరుండి అంత్యక్రియలు జరిపించినారు. 16-07-2007 : సత్యగీత అనే ఏనుగును ప్రశాంతినిలయమునకు తీసుకువచ్చినారు.

16-07-2007 : శ్రీ సత్యసాయి గురుకుల విద్యా నికేతన్, బెజ్జంకి ప్రారంభం.

31-08-2008 : భగవాన్ బాబావారు “లోకాః సమస్తా సుఖినోభవంతు” ను “సమస్త లోకాః 

                                         సుఖినోభవంతు” గా మార్చినారు.

01-05-2009 : బాబావారు ఉదకమండలంలో (kodaikanal) మాతృశ్రీ ఈశ్వరమ్మ 

                                         పంచలోహ విగ్రహమును ఆవిష్కరించినారు.

28-10-2009 : శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్ర –మహారాష్ట్ర హడ్షిలో ప్రారంభం. 

09-04-2010 : 09-04-2010 నుండి 18-04-2010 వరకు డిల్లీ                                         

                                         మరియు షిమ్లాలలో పర్యటించినారు.

20-03-2011 : భగవాన్ బాబావారి చివరి దర్శనము.  

28-03-2011 : భగవాన్ బాబావారిని హాస్పిటల్ లో చేర్చినారు.

24-04-2011 : ఖరనామ సంవత్సర చైత్ర బహుళసప్తమి పూర్వాషాడ నక్షత్రము ఆదివారము 

                                         ఉదయము 7.40 నిమిషములకు భగవాన్ బాబావారు తన చిన్మయ                                         

                                         శరీరమును సూపర్ హాస్పిటల్లో రూమ్ నంబరు 255 యందు వదలినారు.ఆ  

                                         రూమును ఇప్పుడు మందిరముగా తీర్చిదిద్ది ప్రతి గురువారము 

                                         సేవాదళమునకు దర్శన భాగ్యము కల్పించుచున్నారు.

27-04-2011 : భగవాన్ బాబావారి భౌతిక కాయమును సుమారు 10.30 నిమిషములకు 

                                         మహాసమాధి గావించినారు.

భగవాన్ శ్రీ సత్యసాయి అవతార నిష్క్రమణానంతరం:

00-06-2011 : రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రారంభం. (రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 

                                         స్టూడియోలు తిరుపతి, విశాఖపట్నం మరియు హైదరాబాదులలో కలవు) 

15-07-2011 : గురుపౌర్ణమి సందర్భముగా పాలరాతితో సుందరముగా తీర్చి దిద్దిన భగవాన్ 

                                         బాబావారి మహాసమాధి దర్శనము ప్రారంభం.

22-01-2013 : బాబావారి రెండవ పెంపుడు ఏనుగు “సత్యగీత” మరణం.

01-03-2015 : 01-03-2015 నుండి 12-03-2015 వరకు బృందావనంలో 

                                         “అతిరుద్ర మహా యజ్ఞం” జరిగినది.

09-07-2017 : గురుపౌర్ణమి సందర్భముగా “శ్రీ సత్యసాయి నిత్య అన్న సేవ” ప్రారంభం.

20-11-2017 : 20-11-2017 మరియు 21-11-2017 ప్రపంచ వేద సమ్మేళనం.

22-11-2017 : శ్రీ సత్యసాయి ఆర్కైవ్ భవనము ప్రారంభం.

05-03-2020 :  ప్రశాంతి మందిరములో షిర్డిసాయి విగ్రహము స్థానములో స్వామివారి 

                                         కాంస్యవిగ్రహ స్థాపన.

06-03-2020 : జమ్మూలో “శ్రీ సత్యసాయి శ్రద్ధా పీఠ్”  ప్రారంభం.

24-06-2020 : “రేడియోసాయి” పేరును “శ్రీ సత్యసాయి మీడియా సెంటర్” గా మార్పుట.

20-10-2020 : అఖిలబారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల నూతన నియమ నిబంధనల 

                                         పుస్తకము ఆవిష్కరణ.

24-07-2021 : శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ ఆవిర్భావము.

Tuesday, September 21, 2021

ఉండ్రాళ్ళతద్దె - మహాలయ పక్షం

నేటి విశేషం ---------- ఉండ్రాళ్ళతద్దె / ఉండ్రాళ్ళ తదియ మన సాంప్రదాయం లో ప్రతి వేడుక వెనుక ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యత, ఆరోగ్యపరమైన రహస్యాలను మేళవించి రూపొందించారు మన శాస్త్రాలు ... అటువంటి లక్షణాలన్నీ ఉండి మహిళలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ ‘ఉండ్రాళ్ల తద్దె’. ప్రతి గ్రామంలో మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో, హుషారుగా జరుపుకునే ఈ వేడుక ప్రతి సంవత్సరం భాద్రపద బహుల తదియ నాడు అంటే పౌర్ణమి తర్వాతి తదియ తిథి రోజున వస్తుంది. ఈ పండుగ జరుపుకునే విధానాన్ని పరిశీలిస్తే ఆధ్యాత్మిక భావంతో పాటుగా ఊరిలోని వారందరి మధ్య ఒక ఐక్యతాభావం, అలాగే ఈ పండుగకు తీసుకోవాల్సిన ఆహారం విషయం చూస్తే వర్షరుతువులో వచ్చే భాద్రపద మాసానికి తగిన విధంగా ఆరోగ్యపరిరక్షణ మొదలైనవి మనకు కనిపిస్తాయి. తరతరాలుగా ప్రతి గ్రామంలోను తెలుగింటి ఆడపడుచులు ఈ ఉండ్రాళ్ల తద్దె పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవటం మనం చూస్తుంటాం. ఉండ్రాళ్ల తద్దెకు కేవలం తదియ రోజు మాత్రమే కాకుండా ఆ ముందు రోజైన విదియకు కూడా ఎంతో పాత్ర ఉంది. పూర్వకాలంలో ముందు రోజు ఐదుగురు ముత్త యిదువులకు మహిళలు గోరింటాకు ముద్దను, పసుపు, కుంకుమ, కుంకుడుకాయలు, నువ్వులనూనె ఇచ్చి వారిని తమ ఇంటికి తాంబూలం తీసుకోవటానికి రమ్మని ఆహ్వానించేవారు. అదేవిధంగా వివాహం కాని యువతులు కూడా ఈ ఉండ్రాళ్ల తద్దె నోము నోచుకుంటే త్వరగా వివాహం అయి మంచి భర్త లభిస్తాడని, వివాహితలు నోము నోచుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. దీంతో వివాహం కాని యువతులు సైతం ముందురోజు తెల్లవారుజామున కుంకుడుకాయలతో తలస్నానం చేసి, జుట్టుకు సాంబ్రాణి పొగ వేయటం కనిపిస్తుంది. కుంకుడుకాయలు జుట్టులోకి చుండ్రును చేరనీయకుండా చేస్తాయి, ఇక సాంబ్రాణి వల్ల వెంట్రుకల మూలాల దగ్గర ఉన్న తడిసైతం ఆవిరవుతుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఉదయం 6 గంటలలోపే గోంగూరపచ్చడితో పెరుగన్నం పిల్లలందరికి వారి తల్లి తినిపిస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోంగూర శరీరంలో ఉష్ణోగ్రత కలిగిస్తే, పెరుగన్నం చలువ పదార్థం కనుక ఈ కాలంలో ఎటువంటి వ్యాధులకు శరీరం గురికాకుండా ఉష్టోగ్రత సమతుల్యంగా ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో నువ్వులపొడిని కూడా కలుపుని తింటారు. దీంతో ఈ వర్షాకాలంలో సహజంగా వచ్చే జలుబు, రొంప, కళ్ల మంటలు వంటి అనేక వ్యాధులకు దగ్గరికి కూడా రావు. ఇక రెండో రోజైన తదియ నాడు అసలైన సందడి మనకు కనిపిస్తుంది. ఆ రోజు తెల్లవారుజామునే గోంగూర, ఆవకాయ నంచుకుని పెరుగన్నం తినడం గ్రామాల్లోని ప్రతి ఇంటిలో జరుగుతుంది. ఆ తర్వాత ఊరిలోని మహిళలు, ఆడపిల్లలు ఒకచోట చేరి ఉయ్యాలలూగటం, దాగుడుమూతలు, దూదుంపుల్ల, కోతికొమ్మచ్చి వంటి అనేక ఆటలు ఆడతారు. ఈ ఆటలు పూర్తయ్యేసరికి మహిళలు తాము చేసిన ఉండ్రాళ్లను తోటి మహిళలకు పంచుతారు. ఈ విధంగా ఈ పండుగల సామాజిక సమైక్యత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం ఎవరింటిలో వారు గౌరీదేవిని పూజించి, ఐదు దారపు పోగులు, ఐదుముడులతో ఏడు తోరాలను అమ్మవారి దగ్గర ఉంచి పూజిస్తారు. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోమునోచుకునే మహిళకు, మిగతా ఐదు ముత్తయిదువులకు కడతారు. అదేవిధంగా బియ్యంపిండిలో బెల్లం కలిపి చేసిన పచ్చి చలిమిడిని, ఐదు ఉండ్రాళ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఉండ్రాళ్ల తద్దె వ్రత కథను చెప్పుకోవాలి. ఆ కథ చెప్పుకునేముందు అక్షింతతలను చేతిలో ఉంచుకుని కథ పూర్తయిన తర్వాత వాటిలో కొన్నింటిని అమ్మవారి పాదాల దగ్గర వేసి మిగతావి నోము నోచుకునే మహిళ తన తలపై వేసుకోవాలి. ఆ తర్వాత తాము పిలిచిన ఐదుగురు ముత్తయిదువులకు వాయనం ఇవ్వాలి. పూర్ణంబూరెలు, గారెలు, తోరము ఇలా అన్నింటిని ఒక పళ్లెంలో ఉంచి ‘ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటి వాయనం’ అని చెప్తూ మహిళలు ఈ వాయనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భాద్రపదమాసంలోనే వినాయక చవితి పండుగ వస్తుంది, వినాయకునికి మోదకప్రియుడు అనిపేరు. అలాగే ఈ ఉండ్రాళ్ల తదియకు కూడా ‘మోదక తదియ’ అనే పేరు ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా మహిళల వస్త్రధారణ, శారీరక వ్యాయామం కలిగేలా ఆటలు, ఆరోగ్యపరమైన ఆహారం, గౌరీదేవిని పూజించటం ద్వారా ఆధ్యాత్మిక చింతన మొదలైన వాటి సమ్మేళనంతో మహిళలకు సకల సౌభాగ్యాలను కలుగుజేసే గొప్ప తెలుగు పండుగ ఉండ్రాళ్ల తద్దె అనటంలో ఎటువంటి సందేహం లేదు... 🥀శుభమస్తు🥀🙏 సమస్త లోకా: సుఖినోభవంతు.🙏


మహాలయ పక్షం సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమై అక్టోబర్ 6 తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి , మీ పితృదేవతలను స్మరించి , వారికి నమస్కారము చేస్తూ , *నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి , మీ దీవెనలు అందచేయండి’* అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.

భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో , బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని , మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో , ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.
తండ్రి జీవించి , తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ , శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య (అక్టోబర్ 6 న) నైనా చేసి తీరాలి.
దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి , దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం ! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.
ఆ చెట్టుకున్న పండ్లే కాదు , మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.
స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి , తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా *‘‘కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం , వెండి , డబ్బు రూపేణా చేశావు గానీ , కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’* అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.
కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా , ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి , మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.
ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు , బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.
ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు , పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది , ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి , తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

పితృ పక్షం.. అంటే 15 రోజుల పాటు పూర్వీకులను ఆరాధించే పండుగ ఇది. ఇది సెప్టెంబరు 21 మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ 15 రోజుల పాటు పూర్వీకులకు పిండ ప్రధానం చేస్తారు. హిందుమతాన్ని అనుసరించే ప్రతి ఇంట్లోనూ పితృదేవతలకు శ్రద్ధా కర్మలను చేయడం, పిండాలను అర్పించడం తప్పనిసరి అని శాస్త్రాల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఈ విధంగా చేయనట్లయితే కొన్ని అనుకోని ఆందోళనలు, అశుభ సంకేతాలతో ప్రజలు కలవరపడతారు. అంటే వారి పితృ దోషాలు అంటుకుంటాయని అర్థం చేసుకోవాలి. ఈ దోషాలు అంటుకున్నప్పుడు ఇంట్లో కొన్ని అపశకునాలు, లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం . సాధారణంగా బోజనం చేసేటప్పుడు ఆహారంలో వెంట్రుకల కనిపిస్తూ ఉంటాయి. కానీ విరివిగా కనిపిస్తున్నాయంటే ఆ అంశాన్ని అంత సులభంగా విస్మరించవద్దు. కుటుంబ సభ్యుల్లో బోజనం చేసేటప్పుడు చాలాసార్లు జుట్టు వస్తుంటుంది. అది ఎక్కడ నుంచి వచ్చిందో ఎవరికి అంతుపట్టదు. ఇంట్లోనే కాదు వారు బయటకు వెళ్లి రెస్టారెంట్లు, హోటెళ్లో తినాల్సివచ్చినా ఆహారంలో వెంట్రకుల వస్తాయి. కొన్ని సార్లు ఎదుటివారు ఎగతాళి చేస్తారు. ఈ విధంగా తరచూ జరుగుతూ ఉంటే మీ జాతకాన్ని ఓ సారి జ్యోతిష్కుడికి చూపించుకుంటే మంచిది. ​ఇంట్లో దుర్వాసన.. ఇల్లు ఎంత శుభ్రంగా, అందంగా ఉన్నప్పటికీ దుర్వాసన వస్తుందంటే ఆ విషయాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. అసలు చెడువాసన ఎక్కడ నుంచి వస్తుందో అర్థం కాదు. అసలు అక్కడ ఏమి లేకపోయినప్పటికీ చెడు వాసన వస్తుందని బయట నుంచి వచ్చిన వాళ్లు అంటుంటారు. ఈ విధంగా దుర్వాసన వస్తుందంటే పూర్వీకులకు కోపం వచ్చిందని అర్థం చేసుకోవాలి. పితృ దోషాలు వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని అస్సుల మర్చిపోకూడదు. ​పూర్వీకులు కలలోకి వస్తారు.. చనిపోయిన బంధువులు, పూర్వీకులు తరచూ కలలోకి వస్తున్నారని కొంతమంది చెబుతుంటారు. ఈ అంశాన్ని యాదృచ్ఛికమని మచెప్పలేం. పూర్వీకుల గురించి పదేపదే కలలు కనడమంటే వారి కోరికలు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయని కొంతమంది నమ్ముతుంటారు. ఒకవేళ మీకు కూడా ఈ విధంగా జరుగుతున్నట్లయితే చనిపోయిన మీ పూర్వీకులు, బంధువులకు ఇష్టమైన వస్తువులను అవసరమైన వారికి దానం చేస్తే మంచిది. ​ శుభకార్యాల్లో అవంతరాలు .. మీరు కొన్ని శుభకార్యాలు చేయాలని తలపెట్టినప్పుడు వాటికి పదే పదే అవంతరాలు ఎదురవుతున్నాయంటే కొద్దిగా దృష్టిపెట్టాలి. లేదా మీరు పని మధ్యలో ఉన్నప్పడు ఏవైనా సంఘటనలు జరిగితే పూర్వీకులు కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. దీపావళి, హోళీ లాంటి పండుగులప్పుడు కొన్ని అపశకునాలు లేదా దుర్ఘటనలు జరిగుతున్నాయంటే అవి పితృ పక్షం వారి అసంతృప్తిని తెలియజేస్తుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా జరిగితే బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి గౌరవంగా ఆరాధించి భిక్ష ఇవ్వాలి. ​ వివాహం ఆలస్యమైతే.. ఈ రోజుల్లో వివాహం ఆలస్యంగా చేసుకోవడమనేది తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఏమి కాకుండానే పెళ్లిళ్లు ఆలస్యమవుతాయి. ఇలా సంబంధం విచ్ఛిన్నమయ్యే ప్రతిసారి పూర్వీకుల అసంతృప్తిని తెలియజేస్తుంది. కొన్నిసార్లు పూర్వీకుల కోపం వల్ల విడాకులు తీసుకోవాల్సిన స్థితి రావచ్చు . ఇంకా పరిస్థితుల ఎంత దూరమైన వెళ్లవచ్చు. కాబట్టి ఇంట్లో పూర్వీకులను ఆరాధించడం తప్పనిసరి. ​ సంతానం లేకపోవడం .. కొన్ని కారణాల వల్ల పూర్వీకులు మీపై కోపంగా ఉండే అవకాశముంది. మీరు వారితో మంచిగా ప్రవర్తించకపోయినా, వారి గురించి పట్టించుకోకపోయినా.. పితృ దోషం జరుగుతుంది . ఫలితంగా సంతానం లేకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పూర్వీకులకు సేవ చేయడం ఎంతో ముఖ్యం . వారిని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సమయంలో 15 రోజుల్లో ఏదోక సమయంలో వారికి పిండప్రధానం చేసి వారిని సంతృప్తి పరచడాలి. వీలైతే వారి పేరు మీద విరాళాలు ఇస్తే మంచిది 🙏


Saturday, September 18, 2021

DRAWING COMPEITION - LAST DATE 10-9-2021

 












SRI SATHYA SAI PRANAM - PRABHATAM PRABHAVAM 19-9-2021

 





ఓం శ్రీ సాయిరాం 

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి  వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు,  ఓంకారం సుప్రభాతం, దానిలో ఉన్న అంతర్గత అర్థాన్ని,   ఎంతో వివరణాత్మకంగా, స్వామి పూర్వ విద్యార్థి, శ్రీ కోట శివ కుమార్, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి సభ్యులకు, మరియు సత్య సంస్థలు ఖైరతాబాద్ సమితి సభ్యులకు వివరించారు 

 ప్రణవం ప్రభాత ప్రభావం

ఈరోజు అనగా, 19  9 20 21న, ఆదివారం శివమ్  మందిర ప్రాంగణంలో, ఈ కార్యక్రమం జరిగింది, సమితి సభ్యులంతా ఐదు గంటల కల్లా చేరుకున్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, మహిళ విజయ లక్ష్మి గారు, ఎడ్యుకేషనల్ ఇంచార్జ్, శ్రీమతి సీతా మహాలక్ష్మి, బాలవికాస్ గురువులు, శ్రీమతి ఈశ్వరి, కల్పన, భువనేశ్వరి, రేణుక, సాయి వాణి, స్వాతి ప్రియాంక, మాస్టర్ హేమాంగ్ ,, మాస్టర్ లీలాధర్  చిరంజీవి జయ గాయత్రి నగర్, శ్రీ సత్య సాయి  భద్రాదేవి  శ్రీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. సమితి సభ్యులు, ఎంతో, భక్తిశ్రద్ధలతో, శివ కుమార్ గారు, చెప్పిన విధంగా, సుప్రభాతం అందరూ కలిసి పాడారు. ఓంకారాన్ని, 21 సార్లు, ఎందుకు ఎందుకు ఉచ్చరించాలి, దాని వల్ల ప్రయోజనాలు, సుప్రభాతం లో దాగి ఉన్న, అనేక విషయాలను సోదాహరణంగా వివరించారు. సుమారు జరిగిన కార్యక్రమం, స్వామివారికి శ్రీ శ్రీ వి.వి. ఆర్ఎస్  శర్మగారు మంగళ హారతి సమర్పణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. 





శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...