ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 13 102019 న సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యంలో, ఉదయం 9.30. అబిడ్స్ లో గల , హరే రామ హరే కృష్ణ, గుడి నుండి, వ్రతములో పాల్గొనే వారందరూ, పట్టు వస్త్రములు ధరించి, ఊరేగింపుగా, సాయి గాయత్రి మంత్రం నామస్మరణతో, పది గంటలకి, పుల్లారెడ్డి భవనము నందు ఉన్న, స్టడీ సర్కిల్ ప్రాంగణం మనకు చేరుట, తరువాత, అందరూ వారికి కేటాయించిన స్థానములలో, వారు కూర్చుండుట. తర్వాత కార్యక్రమం ప్రారంభం. సామూహిక శ్రీ సత్యసాయి నిర్వహణ, శ్రీమతి ఆలూరి కళ్యాణి గారిచే, ఈ కార్యక్రమంలో పాల్గొను వారు, కోటి సమితి సభ్యులు, మరియు, గ్రామ సేవ మహాయజ్ఞం లో భాగంగా, మనము భజనలు నిర్వహించిన, వారు, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, మన సంకల్పం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టకు, ఇప్పటివరకు, పేర్లు నమోదు చేసుకున్న వారు, శ్రీమతి శ్రీ పెనుగొండ ప్రకాష్, మహంకాళి నరసింహారావు, శ్రీ చక్రధర్, శ్రీమతి పద్మావతి అండ్ ఫ్యామిలీ, శ్రీమతి అనిత అండ్ ఫ్యామిలీ,, శ్రీ పాండు అండ్ ఫ్యామిలీ, శ్రీ నాగేశ్వర రావు విశ్వకర్మ అండ్ ఫ్యామిలీ, శ్రీమతి రచన గుప్తా అండ్ ఫ్యామిలీ, శ్రీ శ్రీనివాస రావు అండ్ ఫ్యామిలీ, శ్రీ లక్ష్మీ నారాయణ అండ్ ఫ్యామిలీ, ఇంతవరకు మొత్తం 11 మంది, జంటలు, పేర్లు నమోదు చేసుకోవడం అయినది. జై సాయి రామ్
Friday, October 11, 2019
Thursday, October 10, 2019
Saturday, October 5, 2019
IST SUNDAY 6-10-2019 NAGARA SANKEERTHANA
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి
దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, నెలలో మొదటి ఆదివారం, ఈరోజు అనగా 6 10 2019 న, హనుమాన్ టెక్డి లో గల, హనుమాన్ మందిరంలో, ఈరోజు ఉదయం
నగర సంకీర్తన కార్యక్రమం, దిగ్విజయంగా
జరిపించిన, స్వామికి హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈనాటి కార్యక్రమంలో శ్రీ రామ్ చందర్, సాయి కుమార్, వెంకట చక్రధర్, మహంకాళి లక్ష్మీనరసింహారావు, విశ్వకర్మ నాగేశ్వరరావు, శ్రీ సురేంద్ర పటేల్, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, శ్రీమతి రేణుక, శ్రీ శరణ్, తదితరులు పాల్గొన్నారు, ఈ నాటి కార్యక్రమంలో శ్రీ సురేంద్ర పటేల్ గారు స్వామివారికి
మంగళహారతి సమర్పణతో, కార్యక్రమం
దిగ్విజయంగా ముగిసింది. ఓం శ్రీ సాయి రామ్

Thursday, September 19, 2019
Monday, September 16, 2019
Hospital Visit 14/9/2019
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 14 9 2019 న శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో, సుల్తాన్ బజార్ లో గల మహిళ ప్రసూతి ఆస్పత్రి నందు, కొత్తగా పుట్టిన పిల్లలకు, బేబీ కిట్, మరియు బాలింతలకు, ఆపిల్ పండ్లను, వితరణ గావిస్తూ, సెల్ ఫోన్ పుట్టిన పిల్లలకు, దూరముగా నుంచాలని , ఎంతో శుభ్రముగా వారి పరిసర ప్రాంతమును, ఉంచుకోవాలని, సూచనలు ఇచ్చారు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఒకేషనల్ ట్రైనింగ్ టైలరింగ్ లో శిక్షణ పొందుతున్న మహిళలు, మహిళా ఇంచార్జి, శ్రీమతి విజయలక్ష్మి, కుమారి షా గుప్త, శ్రీమతి , సీతా మహాలక్ష్మి, కుమారి టం కింగ్, శ్రీమతి చిత్రూపిణి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
హాస్పిటల్ సూపర్డెంట్ శ్రీమతి రాజ్యలక్ష్మి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి వారు చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను కొనియాడారు. మేమంతా వారిని కలిసి స్వామివారి ప్రసాదాన్ని వారికి కూడా అందజేసాము.
ఈ కార్యక్రమంలో మొత్తం 65 , బేబీ కిట్, 85 ఆపిల్స్ వితరణ గావించడం
అయినది. జై సాయిరాం, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించిన స్వామికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరియు సహకరించిన సేవాదళ్ సభ్యులందరికీ స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని మరీ మరీ కోరుకుంటూ , జై సాయిరాం.. సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి...
EYE CAMP 15 9 2019 & PRESS CLIPPINGS
EYE CAMP 15 9 2019 & PRESS CLIPPINGS
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 15 9 2019 న ఉదయం 9 గంటల 15 నిమిషములకు మంగళ సన్నాయి వాద్యములు, వేద మంత్రముల మధ్య శ్రీ రాందాస్ తేజ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, అసెంబ్లీ విభాగము, మరియు మహంకాళి లక్ష్మీ నరసింహారావు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రముఖ కంటి వైద్యులు లిబర్టీ ఆప్షన్స్ ప్రొప్రైటర్ శ్రీ డాక్టర్ ఆదిత్య గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి, జ్యోతి ప్రకాశనం గావించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాందాస్ తేజ, ACP ASSEMBLY మాట్లాడుతూ, నన్ను ఈనాటి ఈ కార్యక్రమంలో, భాగస్వామిని చేసినందుకు, కోటి సమితి చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, కోటి సమితి సభ్యులకు, సమితి కన్వీనర్ కు, అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, "సర్వేంద్రియానాం నయనం ప్రధానం" కన్ను శరీరములోని అన్ని అంగముల కన్నా, ఎంతో ప్రధానమైంది, అని దాన్ని మనము చాలా అశ్రద్ధ చేస్తున్నామని, దానిని నిరంతరం పనికి వచ్చే విషయాలు పైనే, మనం మన కంటిని జాగ్రత్తగా చూసుకోవాలని , ప్రస్తుతం ఉన్న ఈ మొబైల్ ఫోన్స్ వల్ల, టీవీ, కార్టూన్ చిత్రాల వల్ల పిల్లలు చిన్నప్పటినుంచే, వారికి కళ్ళద్దాల అవసరం ఏర్పడుతుందని, తెలియజేస్తూ, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, వంటి కంటి వైద్య శిబిరాలు ఎంతో అవసరమని, అవసరాన్ని గుర్తించి, కోటి సమితి ఈ సేవను ఎంచుకొని, లబ్ధిదారులను ముందుగానే గుర్తించి వారికి ఐడీ కార్డులను ఇష్యూ చేసి ఎంతో ప్రణాళికతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతోమందికి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నానని అన్నారు, ఈ కార్యక్రమాన్ని భగవాన్ సత్యసాయి బాబా వారి, రానున్న 94వ జన్మ దినోత్సవ సందర్భంగా, నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మొత్తం 91 మంది పేర్లు నమోదు చేసుకొని, పరీక్షలు నిర్వహించుకున్న తరువాత, 66 మందికి, కళ్ళజోళ్ళు ఇచ్చే విధంగా డాక్టర్ గారు వారు నిర్ధారణ చేసినారు, ఇద్దరికీ ఆపరేషన్ అవసరం అని తెలియజేశారు 12 మందికి మందులు రాసి తగిన సూచనలు ఇచ్చారు.
పవిత్ర కార్యక్రమంలో, శ్రీ సత్య సాయి గ్రామ సేవ మహాయజ్ఞం లో భాగంగా, కోటి సమితి దత్తత తీసుకున్న, కట్టెల మండి కి సంబంధించిన గురుమూర్తి దంపతులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు, అదేవిధంగా, కోటి సమితి బాలవికాస్ పిల్లలు కూడా కంటి వైద్య చికిత్స లో పాల్గొన్నారు. ఒకేషనల్ ట్రైనింగ్ టైలరింగ్, శిక్షణ పొందిన వారు శిక్షణ పొందుతున్న వారు వారి బంధువులు అధిక సంఖ్యలో (నిరుపేద వారు) ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. డాక్టర్ కు చూపించుకోవటానికి వేచి వున్నా లబ్దిదాలులకు ఒక అవగాహన కల్పించుటకు, పూర్తి వెలుతురు లో నే చదవ వలెనని, ట్రైన్లో ప్రయాణం చేయు నపుడు, లేక కదులుతున్న వాహనాలలో వున్నపుడు, చదవ కూడదని, కళ్లజోళ్లు తప్పని సరిగా ఉపయోగించాలని, A విటమిన్స్ వున్న పదార్ధములను అంటే అందరికి వీలుఅయ్యే ఆకుకూరలతో ముఖ్యముగా పాలకూర ను ఎక్కువ తీసుకోవాలని,కోటి సమితి, మహిళా యూత్ సభ్యులు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో, కుమారి షాప్ గుప్తా సిద్ధికి, tabassum బేగం, శ్రీమతి చిత్ రూపిని, శ్రీమతి పద్మావతి, సుమతి రాధిక బాల్ కి, శ్రీమతి జ్యోతి తివారి, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీ రాము, శ్రీ చక్రధర్, కుమారి ఎం ఆశ్రిత, ప్రమోద్ కుమార్ మహేశ్వరి తదితరులు, ఈ కార్యక్రమంలో తమ అమూల్యమైన సేవలను అందించారు పాల్గొన్నారు.
సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ,
12వ బ్యాచ్ కవొకేషన్ మరియు 66 మందికి కళ్లజోళ్లు పంపిణి తేదీ 21-9-2019, వేదిక: అబిడ్స్,జి. పుల్లా రెడ్డి భవనం, 6 వ అంతస్తు, శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాగణంలో. ముఖ్య అతిధిగా MS KRUTHIKA VASIREDDY, LLM BERKELEY SCHOOL OF LAW ( UNIVERSITY OF CALIFORNIA )MEDIA SPEAKER, ACADEMIC WRITER విచ్చేయనున్నారు.
జ్యోతి ప్రకాశనం గావించిన ప్రముఖులు, SRI MAHAKANLI NARASIMHA RAO, SRI RAMDAS TEJA, ASSISTANT COMMISSIONER OF POLICE. DR ADITYA, NARASIMHA RAO.(PREM SAI CALENDERS PROPRITOR. )
ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్న DR. ADITYA
Wednesday, September 11, 2019
IMPORTANT ANNOUNCEMENT. 12-9-2019
ఓం శ్రీ సాయి రామ్
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో, ఈ రోజు మనము మన గురువారం భజనను మన ఇండ్లలోనే జరుపుకోవలసిందిగా సూచన. ఈ రోజు వినాయక నిమజ్జనం సందర్భముగా ఎక్కడి కక్కడ బారికేడ్స కట్టి ఉంటవి, కాన మన మంతా మన మన ఇండ్లలో భజనలు మన కుటుంబ సభ్యులతో సర్రిగా 6 గంటలకు ప్రారంభించి, 7 గంటల వరకు భజనలు పాడు కొని స్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాము.
సాయిరాం. 12-9-2019
Subscribe to:
Posts (Atom)
శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025
శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025 GOOGLE FORM: LINK: TOTAL NO OF CANDIDATES LINK: ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...

-
The Sri Sathya Sai Aaraadhana Mahostavam was celebrated with the Divine blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu. Water Camp ...
-
Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam As you know, a free drinki...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...