Friday, February 10, 2023

GOVERNMENT KUNTAROAD SCHOOL, OSMAN GUNJ, TOPKHANANA, HYDERABAD.

 



ఈ రోజు 10-2-2023 న  ఉస్మాన్ గంజ్ తోప్ ఖానా లోగల, కుంటారోడ్డు , గవర్నమెంట్ హై స్కూల్, పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం, మరియు, 10వ తరగతి విద్యార్థులకు వేడ్కోలు కార్యక్రమము, ఎంతో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా, సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి కన్వీనర్, జ్యోతి ప్రకాశనం  గావించి, వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈనాటి ముఖ్య అతిథిలూగా విచ్చేసిన జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్, Ward No. 77 - Jambagh Division. రాకేష్ జైస్వాల్ గారిని, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, కన్వీనర్ ను, మరియు బిజెపి సీనియర్ లీడర్ శ్రీ మయూర్ గారిని, వేదిక అలంకరించవలసిందిగా శ్రీమతి శశికళ గారు ఆహ్వానించారు. 

హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్, శ్రీమతి శశికళ గారు, ప్రారంభ ఉపన్యాసంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, కుంటారోడ్డు స్కూల్లో, నిర్వహిస్తున్న శ్రీ సత్య సాయి స్కూల్ బాలవికాస్ కార్యక్రమాన్ని, శ్రీ సత్య సాయి బాబా వారి  జన్మదిన సందర్భంగా, నిర్వహించిన నారాయణ సేవ కార్యక్రమాన్ని, స్కూలుకు బహుకరించిన బెంచీలు, డస్కులు, గురించి, మరియు, 10వ తరగతి లో చదువుతున్న 22 మందికి, మధ్యాహ్నం భోజనానంతరం, ప్రతిరోజు సాయంత్రం స్కూల్ తర్వాత నిర్వహించే, ప్రత్యేక తరగతుల ప్రారంభంలో , స్నాక్స్, అందజేస్తున్న విషయాన్ని,  ప్రస్తావిస్తూ, కోటి సమితి, నిర్వహిస్తున్న సేవలను ఎంతగానో కొనియాడారు.  

సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, మాట్లాడుతూ, జ్యోతి ప్రకాశం, గావించుటకు, ఆహ్వానించినందుకు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జ్యోతి గూర్చి తెలుపుతూ, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృతోర్మ అమృతంగమయ మంత్రానికి అర్ధాన్ని వివరిస్తూ, జ్యోతి మనలో నున్న చీకటిని పోగొట్టునని,ఒక జ్యోతితో మనము అనేక జ్యోతిలు వెలిగించవచ్చని, గురువులు మనలో నున్న చీకటిని, తొలిగించి, వెలుతురూ నింపుతారని, వారిని ఎల్లప్పుడూ గౌరవించాలని, టెన్త్ క్లాస్ లో పిల్లలందరూ, ఉత్తమ శ్రేణిలో, పాస్ కావాలని, కోరారు.

డివిజన్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్, మాట్లాడుతూ ముందుగా,  ఆహ్వానించినందుకు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీమతి శశికళ గారు   ఈ పాఠశాలను ఎంతగానో అభివృద్ధి చేసారని,  విద్యార్థులంతా ఎంతో క్రమశిక్షణతో, ఉన్నారని, దానికి కారకులు, స్కూల్ యాజమాన్యం అని, తెలుపుతూ, మీరంతా, సన్మార్గంలో, ఉంటూ, పరీక్షలలో, ఎంతో, మంచి మార్కులు తెచ్చుకొని, ఇటు పాఠశాలకు, మీ తల్లిదండ్రులకు, అందరికీ మంచి పేరు తేవాలని కోరారు.

తర్వాత, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా, ప్రైమరీ స్కూల్ విభాగం విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు, రికార్డింగ్ ప్లే చేసి  రికార్డు డ్యాన్సులు, నిర్వహించి, అందరి మనలను పొందారు. ముఖ్యఅతిథి రాకేష్ జైస్వాల్ మరియు శ్రీ  సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి, పాఠశాల యాజమాన్య సిబ్బంది. విద్యార్థులు అందరూ కలిసి, ఒక గ్రూప్ ఫోటో తీయించుకున్నారు.


పి విశ్వేశ్వర శాస్త్రి 


Wednesday, February 8, 2023

SRI SATHYA SAI BHAJAN AT SRI SATHYA SAI BHAJANA HALL, GOWLIGUDA, HYD. 9-2-2023

              16-02-2022 BHAJAN - AT SRI SATHYA SAI BHAJANA HALL GOWLIGUDA CHAMAN. HYDERABAD 






ఈ  నాటి 9-2-2023 భజన కార్యక్రమములో వేదం అనంతరం, గణేష్ భజన తో భజనలు ప్రారంభమైనవి. శ్రీమతి రేణుక, శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీమతి జ్యోతి, శ్రీ సాయి దాస్, శ్రీ విశ్వకర్మ నాగేశ్వర రావు,  శ్రీ ప్రభాకర్, మరియు వారి సతీమణి ,  శ్రీ ఆంజనేయులు, . కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి భజనలను ఆలపించారు. శ్రీమతి సునీత,  గుబ్బ సాగర్ గారి కుటుంబ సభ్యులు 8 మంది పాల్గొన్నారు. 

సాయి దాస్ మంగళ హారతి సమర్పణ తో భజన దిగ్విజయముగా ముగిసినది.. సాయిరాం 
 

Monday, February 6, 2023

BHAJANA SAPTHAHAM 5-2-2023 8 AM TO 12-2-2023 8 AM
















Balvikas children offered their love filled tiny sweet bhajans

 and gathered for a group pic.

ON 6-2-2023 BALVIKAS CHILDREN OFFERED BHAJANS AT SIVAM 




BEFORE BHAJAN 


AFTER BHAJAN 




BALVIKAS GURUS 


BALVIKAS GURUS RENDING BHAJANS. 




TODAY I.E. ON 7-2-2023 MAHILA POOJA AND MAHILA SEVADAL SERVICE AT SIVAM 




TODAY I.E. ON 11-2-2023 MAHILA POOJA AND MAHILA SEVADAL SERVICE AT SIVAM
 




KOTI SAMITHI SLOT 7-2-2023 8 AM TO 9 AM 
ALL ARE REQUESTED TO REPORT 
AT 7-15 AM AT SIVAM










on 8th night at 1-30 am Momentos handed over to Medak District 
 Koti Samithi Convenor P Visweswara Sastry... 

Concluding Day Program dt 12-2-2023 photos 






  1. SMT KALPANA
  2. SMT SHAILESWARI
  3. SMT RENUKA 
  4. SMT VIJAYA LAKSHMI 
  5. SMT SITHA MAHA LAKSHMI 
  6. KUM SWATHI 
  7. KUM SAI LAKSHMI 
  8. BHAGYA LAKSHMI 
  9. MRS SRINATH - ABSENT 
  10. SMT BALA - ABSENT
  11. PATIL  
  12. PRABHAKAR 
  13. P V SASTRY 
  14. RAMCHANDER 
  15. SURENDAR PATEL
  16. VENKATESWARA NAIDU
  17. SAI KUMAR  - YOUTH 
  18. ANJANEYULU 
  19. PRAKASH 
  20. ANOOP KUMAR - ABSENT 
  21. SHANTHA RAM - 
  22. SRINATH 
  23. SURESH - ABSENT 
  24. A. K MISRA 
  25. MRS AK MISHRA 
  26. SMT SAYAVATHI -ABSENT 
  27. SMT SHASHIKALA  - ABSENT 
  28. SMT PADMAVATHY - ABSENT 
  29. SMT VAANI  - 
  30. BHAVANA - ABSENT 
  31. SHIREESHA - ABSENT 
  32. DR DURGAPRASAD RAO - ABSENT 
  33. DR ADITYA  ABSENT 
  34. GUBBA SAGAR  
  35. NARESH KUMAR AGARWAL 
  36. NAVEEN ABSENT 
  37. VEKAT RAJANNA -  ABSENT 
  38. MR VENU PHOTOGRAPHER 
  39. MR JANNY 
  40. SHARAN 
  41. R ASHOK KUMAR TAILOR - ABSENT 
  42. VENU GOPAL JAMMI KUNTA 
  43. DURGA KUMAR 
  44. VANI HUSBAND ABSENT 
  45. SUNITHA - ABSENT 
  46. MANIK PRABHU 
  47. RAMANUJAYYA 
  48. KAMESH 
  49. SUVARNA LAKSHMI 
  50. HUSBAND SUVARANA LAKSHMI 
  51. MRS VENU - PHOTOGRAPHER ABSENT 
  52. PRAMOD KUMAR MAHESWARI - ABSENT 
  53. DURGA KUMAR - MRUDAGAMAM 
  54. KARTHIK S/O DURGA KUMAR.ABSENT 
  55. BALAJI  
  56. HARI PRASAD AGARWAL 
  57. BHAGYALAKSHMI BROTHER 



SERVICE SCHEDULE ON 6TH,8TH AND 12TH  

SIVAM NAA HRUDAYAM – BABA

GOLDEN JUBILEE CELEBRATIONS OF SIVAM
7 DAYS 24/7 BHAJANA SAPTHAHAM
 5-2-2023 TO 12-2-2023

 KOTI SEVADAL MEMERS HAVE ATTEND FOR SERVICE IN SIVAM ON

6-02-2023 AND 8-02-2023 AND 12-02-2023

 

 

 

DATE: 6-2-2023

 MONDAY

DATE 8-2-2023

WEDNESDAY

12-02-2023

SUNDAY

5 AM TO 9 AM

SHIFT - A

6 AM TO 12 NOON

M L NARASIMHA RAO

RAMDAS

KAMESH GANDHI (SPARE)

 

KAMESH GANDHI

M CHAKRADHAR

SRI VEERESHAM

SRI RAMDAS  

SHIFT- B

12 NOON TO 6 PM

M. LAKSHMINARAYANA

RAMDAS

 

SRI RAMDAS

 

 

SHIFT C&D

6 PM TO 6 AM  

 

 

SRI VEERESHAM

CH LAKSHMA REDDY

 

 

 

RAMU

VENUGOPAL

PATIL

 





భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో శ్రీ సత్య సాయి సేవ సంస్థలు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు,శ్రీ మల్లేశ్వరరావు గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటరావు గారు కలసి తలపెట్టిన శివం మందిరం  స్వర్ణోత్సవ, వేడుకలలో భాగంగా, ఫిబ్రవరి 5, 2023, మాఘపౌర్ణమి, ఆదివారం ఉదయం 8.00 గం||ల||నుండి,ఫిబ్రవరి 12,2023,ఆదివారం ఉదయం 8.00 గం||లకు కోన సాగిన ఈ చక్కటి మహత్తర భజన సప్తాహా కార్యక్రమం తెలంగాణా రాష్ట్రంలో అన్ని జిల్లాల  కుటుంబ సభ్యులు, సాయి సోదర సోదరీమణులు కలసి, స్వామి నడయాడిన,స్వామికి ప్రీతికరమైన మరియు స్వామి  హృదయంగా ప్రకటించబడిన *శివంలో హైదరాబాద్ జిల్లాలోని అన్ని సమితిలు, బాలవికాస్ గురువులు, బాలవికాస్ విద్యార్థులు, మహిళలు, స్వామి పూర్వవిద్యార్థులు, అందరు  కలిసి ఎంతో ఆసక్తిగా,ఆనందంగా,ఉత్సాహంగా ఏడు రోజుల పాటు విరామము లేకుండా అఖండముగా  24 గంటలు ప్రణాళిక ను రూపందించి,  శ్రావ్య మైన భజనలు ఆలపించి, స్వామి సంతోష పడురీతిలో పాల్గొన్నారంటే ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. ఈ సందర్భముగా స్వామి దివ్య అనుగ్రహము మన అందరిపై ప్రసరించి, భజన పాడేవారిని, అనుసరించే వారిని,వినేవారిని, చూసేవారిని,చుట్టూ ఉన్న వాతావరణాన్ని, ముఖ్యంగా సేవలందించిన వారిని, సమాజాన్ని - మొత్తంగా ఎంతో ధన్యతగావించినది. రానున్న శత జయంతి వేడుకలలో పాల్గొనే విధముగా శక్తి నిచ్చారు మన బంగారు స్వామి. ఈ కార్యక్రమం ముఖ్యంగా భజన బినా సుఖ శాంతి నహీ అంటూ పదేపదే మనలను తమ దివ్యగాన మాధుర్యంతో తన్మయుల జేసిన మనస్వామికి ఎంతో ప్రీతికరమైనది. అట్టి బృహత్సేవా భాగ్యం మన భాగ్యనగరంలో స్వామి జరిపించుకోవడం,  అందునా మనము ఈ కార్యక్రమానికి, హైదరాబాద్ జిల్లా  ఆతిథ్యం ఇచ్చే అవకాశం స్వామి కల్పించడం  మన అదృష్టం మరియు స్వామికి మనపైన గల అపార కరుణకు నిదర్శనం.ఇంతటి కార్యక్రమాన్ని దిగ్విజయం గావించిన స్వామికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, స్వామి వారి గళంలో “భజన బినా సుఖ శాంతి నహీ” అనే భజనను విందాం. 


Friday, February 3, 2023

శ్రీ సత్య సాయి నిలయం, గృహప్రవేశo

                                                                     ఓం శ్రీ సాయిరాం, 





గత రెండున్నర దశాబ్దములుగా, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్యాత్మిక, సేవా, బాలవికాస్, కార్యక్రమాలను, అబిడ్స్ లో గల జి పుల్లారెడ్డి భవనం లో, ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహించింది. కొన్ని కారణాలవల్ల, గత సంవత్సరం, జనవరి మాసంలో, పుల్లారెడ్డి భవనం ఖాళీ చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిలలో, గుబ్బ ఈశ్వరయ్య మరియు ,గుబ్బాసాగర్ సోదరులు, స్వామి వారి మీద, ఉన్న అపార ప్రేమ భక్తి, విశ్వాసములతో, స్వామి వారి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, హైదరాబాద్ లో గల   గౌలిగూడ చమన్, పాత బస్ డిపో కామన్, సమీపంలో,( రామ్ మందిర్ సమీపములో)  వారు నూతనంగా నిర్మించిన, నాలుగు అంతస్తుల భవనంలో, 4వ అంతస్తుని, స్వామి భజనలకు, సత్సంగములకు, బాలవికాస్ కార్యక్రమానికి, రికార్డింగ్స్ సెంటర్కు, ఉపయోగపడే విధంగా, ఒక హాలును కేటాయించారు. ఈ సందర్భంగా, ఈ మాఘ పౌర్ణిమ, ఫిబ్రవరి 5వ తేదీన, ఆదివారం, బ్రహ్మ ముహూర్తంలో, నాలుగు 4.38 నిమిషాలకు శ్రీ సత్య సాయి నిలయం, గృహప్రవేశ కార్యక్రమాన్ని, ఉదయం 6 గంటలకు వాస్తు పూజ 7 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ వాస్తు కల్యాణం 8:30 వాస్తు నవగ్రహ మరియు శ్రీ సాయి గాయత్రి హోమం 11:30 భగవాన్ సత్యసాయి బాబా వారి వ్రతం ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ భవనంలో, 10-30 గంటలకు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు,  కోటి సమితి ఆధ్వర్యంలో, తండులార్చన పేరిట, 108 సార్లు సాయి గాయత్రి మంత్రాన్ని తండులార్చన  కార్యక్రమము, అందరు కలసి  " ఓం సాయీశ్వరాయ విద్మహే, సత్య దేవాయ ధీమహి తన్న: స్సర్వ ప్రచోదయాత్ " మంత్రమును జపిస్తూ, తండులార్చనతో బాలవికాస్ విద్యార్థులు, మహిళలు, గురువులు, అందరూ పాల్గొని,పూజలు నిర్వహించి, స్వామి వారికీ మంగళ హారతి సమర్పించి, స్వామి  దివ్య అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. 


పి విశ్వేశ్వర శాస్త్రి





ఓం శ్రీ సాయిరాం
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, హైద్రాబాద్ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీ సత్య సాయి నిలయం గృహప్రవేశం అనంతరం, గుబ్బాసాగర్ మరియు గుబ్బ ఈశ్వరయ్య గారు , స్వామి వారి మీద, ఉన్న అపార ప్రేమ భక్తి, విశ్వాసములతో, స్వామి వారి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, హైదరాబాద్ లో గల గౌలిగూడ చమన్, పాత బస్ డిపో కమాన్, సమీపంలో,( రామ్ మందిర్ సమీపములో) వారు నూతనంగా నిర్మించిన, నాలుగవ వ అంతస్తులో 10-30 గంటలకు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యంలో, నూతన భవనంలో తండులార్చన పేరిట, 108 సార్లు సాయి గాయత్రి మంత్రాన్ని అందరు కలసి 108 సార్లు "ఓం సాయీశ్వరాయ విద్మహే, సత్య దేవాయ ధీమహి తన్న: స్సర్వ ప్రచోదయాత్ " మంత్రమును జపిస్తూ, తండులార్చన ఏంతొ భక్తి శ్రద్దలతో బాలవికాస్ విద్యార్థులు, మహిళలు, గురువులు, అందరూ పాల్గొని,పూజలు నిర్వహించారు.

తొలుతగా, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి రేణుక బాలవికాస్ గురువులు జ్యోతి ప్రకాశం గావించి, పూజ విధానమును విపులముగా వివరించారు. కన్వీనర్ పి. విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, సాధన వలన మాత్రమే మానవుడు భావంతుని చేరగలడని, భావంతుని పూజించడము కూడా ఓక సాధనే అని, పూజ చేయడము అంటే అర్చించడము అని, నవ విధ భక్తి మార్గాలలో అర్చన 5 వది అని, పోతన చెప్పిన విషమును, వివరించారు. - పొతన గారు చెప్పారు “ చేతులారంగా శివుని పూజింపఁడేని, నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువఁడేని “ అని. స్వామి కూడా మన బాలవికాస్ పిల్లలకు చెప్పారు కదా, చేతులు నిచ్చినదేందుకో తెలుసా? మూతికి ముద్దదండించుటకా, కాదు కాదు పతిత పావడునైన శివుని పూజ చేసేందుకు. అని స్వామి చెప్పిన విషయములు చెప్తూ, తండులము అనగా బియ్యము. తణ్డులార్చన అనగా బియ్యముతో అర్చన, అంటే పూజ చేయడం. బియ్యమే ఎందుకు? అంటే బియ్యాన్ని ధవళ అక్షితలు అంటారు అని, అక్షితలు అంటే క్షయము కానిది దని, అంటే దేని నుండి క్షయము ( కట్ ) చేయలేనటువంటిది అని వివరించారు. బియ్యాన్ని వడ్లలోనుంచి తీస్తారు. . వడ్లగింజ భూమిలో పెడితే మొలకెత్తుతుంది. కానీ బియ్యం గింజలు మొలకెత్తవు. అవి ఎప్పటికి మార్పు చెందవు. “ అన్నం బహు కుర్వీత” అనగా ఓ భగవంతుడా ఈ అన్నాన్ని నీవే సృస్టించావు. సృటించే వాటిని పెంపొందించావు. అందువలన అన్నం పరబ్రహ్మ స్వరూపం అయినది. ఈ అన్నం బియ్యం నుంచి వస్తుంది కాబట్టి బియ్యాన్ని మాత్రమే ఈ అర్చనలో వాడుతాము. అని స్వామి వారు తెలియజేసిన విషయమును అందరికి తెలియజేసారు. ఈ తండులార్చన కార్యక్రమములో బాలవికాస్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, బాలవికాస్ పిల్లల, తల్లి తండ్రులు, గురువులు, మహిళలు, పాల్గొన్నారు. శ్రీ నరసింహారావు గారు, కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి స్వామి వారికి మంగళ హారతి సమర్పణతో, కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
పి విశ్వేశ్వర శాస్త్రి. కన్వీనర్


Sairam, Koti samithi Tandularchana program Girls -15, Boys-12, Ledies -10, Gent's -10. Total members 47.




FOR THURSDAY BHAJANS: INVITE 9-2-2023

1) BALAJI
2) VARSHINI
3) VAISHNVI
4) AKHILA
5) CHENNA KESAVA
6) ANIL
7) SURENDER PATEL
8) PRABHAKAR
9) KESHAV
10) VIJAYALAKSHMI
11) SHAILESWARI
12) KALPANA
13) RENUKA
14) SHIREESHA
15) PADMAVATHY
16) VANI
17) GUBBA SAGAR
18) 6) BALVIKAS STUDENTS (10)
19) Saidass
20) Venugopal Jammikunta
21) Zia Guda Nageswara Rao
22) Zia Guda.Jyothi
23) Suresh Family
24) Vinay Kumar & Family.

===============================================

Wednesday, January 25, 2023

 ఓం శ్రీ సాయి రామ్ 


శివమ్ లో 176వ శ్రీ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం 



భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహాముతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు సీతాఫల్ మంది సమితి ఆధ్వర్యములో 26-1-2023 న సాయంత్రము 5-30 గంటలకు, భగవానుడు నడయాడిన విద్యానగర్ లో  గల శివమ్ ప్రాంగణంలో సద్గురు శ్రీ త్యాగరాజ  స్వామి వారి 176వ ఆరాధనోత్సవాన్ని జరుపుకొనే, ఒక సువర్ణ అవకాశాన్ని, సీతాఫలమండి సమితి పొందినది.


         శ్రీ త్యాగరాజ స్వామి రచించిన, “ ఘన రాగ పంచరత్న కీర్తనలను, వర్ధమాన, కళాకారులు, సుప్రసిద్ధ కళాకారులతో, కలసి,మొత్తము 5 గురు శ్రీ శ్రీనివాస్ నిహాల్ కొండూరి బృందం శ్రీ త్యాగరాజ స్వామి వారి దివ్య ఆత్మకు నాదంజలి సమర్పించనున్నారు. 


సుప్రసిద్ద కళాకారులు, శ్రీ శ్రీనివాస్ నిహాల్, శ్రీ వేణు, స్వామి చిరకాల భక్తులు శ్రీ రామ్మూర్తి గారు, శ్రీ వాసా గోపినాథ్ గారు, శ్రీ వైద్యనాథన్ గారు, జ్యోతి వైద్యనాథన్, జయంతి వైద్యనాథన్ గార్లు పాల్గొంటున్నారు.

శ్రీ రఘు గారు, తదితరులు శ్రీ త్యాగరాజ వేష ధారణ లో ఉంచ్చ వృత్తిని, భక్త రామదాసు కీర్తనలు ఆలపిస్తూ, శివమ్ మందిర ప్రాగణంలో నిర్వహించెదరు


ఈ కార్యక్రమానికి, జ్యోతి ప్రకాశనం,గావించుటకు హైదరాబాద్ జిల్లా ఆద్యక్షులు శ్రీ ఎ మల్లేశ్వర రావు గారు, శ్రీ సత్య సాయి స్టేట్ ట్రస్ట్ మెంబెర్ శ్రీ ఎం వి ఆర్ శేషసాయి గారు తదితరులు పాల్గొనుచున్నారు భక్తులు, సంగీత ప్రియులు ఈ సదావకాశమును వినిగోగించుకొని స్వామి వారి దివ్య ఆశీస్సులను, ప్రసాదమును  తీసుకొన గలరు. 


అందరికి ప్రేమ పూర్వక ఆహ్వానము పలుకుచున్నది సీతాఫలమండి సమితి కన్వీనర్.

 

ఫోటోలు జత చేయడమైనది. 


Wednesday, January 18, 2023

19TH MAHILA DAY AND 22ND JAN ANNUAL SPECIAL BHAJAN AT BEGAM BAZAR, HYD. & PRESS CLIPPINGS

 SPECIAL 33RD ANNUAL BHAJAN AT BEGAM BAZAR, 

HYDERABAD AT SRI SATHYA SAI BHAVAN 






ఈ రోజు 22-1-2023 న శ్రీ సత్య సాయి భావన్ లో ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు వేదంలో భాగంగా 3 సార్లు శ్రీ రుద్రం ను, స్వామి అష్టోత్తరం పూజ కార్యక్రమాన్ని రతిరావు పాటిల్ దంపతులు అనంతరం,  భజన కార్యక్రమము శ్రీ శేఖర్, పాడిన గణేశ భజన తో ప్రారంభముతో అందరు భక్తి పారవశ్యంలో నున్నారు. శ్రీమతి శైలేశ్వరి సాయి సాయి స్మరణ కారో అనే భజన సాయంత్రము 5 గంటల వరకు కొనసాగిన అనంతరం, పరిగి వాస్త్యులు స్వామి చిరకాల భక్తులు ఆధ్యాత్మిక సత్సంగం అనంతరం స్వామికి హారతి తో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 




రిపోర్ట్ ఆన్ మహిళా డే ప్రోగ్రాం. DT  19-1-2023 


స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యములో, ఉస్మాన్ గంజ్, తోప్  ఖానా లో గల,  శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్   ట్రైనింగ్ సెంటర్, (టైలోరింగ్)    ఈ నాటి మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్దలతో, నిర్వహించడమైనది.


 శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి వాణి తదితరులు జ్యోతి ప్రకాశం గావించగా , శ్రీమతి  శిరీష స్వాగత వచనాల  అనంతరం, వేదం లో భాగంగా గణపతి ప్రార్ధన,  రుద్రం, మొదటి అనువాకం, శాంతి మంత్రాల తరువాత సుస్వరమైన భజనలు ఆలపించడమైనది. 


ముందుగా శ్రీమతి వాణి  మాట్లాడుతూ, ఝాన్సీ లక్ష్మి బాయి,  గారి దేశ భక్తి, పరాక్రమమును,   జీవత విశేషాలను, వారు తెలిపిన విలువలు తెలియసేశారు. 


జ్యోతి మాట్లాడుతూ వారి తల్లి తనకు చేసిన సేవలను  స్మరించుకుంటూ,  వారికి దక్కిన అవకాశమును వినిగోగించుకొని, స్వామి వారికి  కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, తన తోటి వారికీ మహిళా  దినోత్సవ  శుభాకంక్షలతో వారి  స్పీచ్ ను ముగించారు. 


శ్రీమతి దాస   పద్మావతి మదర్ థెరిస్సా, గారి సేవలను వివరిస్తూ, స్వామి వారికి  కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, తన తోటి వారికీ మహిళా  దినోత్సవ  శుభాకంక్షలతో వారి  స్పీచ్ ను ముగించారు

శ్రీమతి శైలేశ్వరి ఈ మధ్య తాను ప్రశాంతి నిలయంలో సేవలందించి తాను  పొందిన అనుభూతులను, ఆనందాన్ని వివరించి, మీరు కూడా ఆ రకమైన సేవలందించి, ఆనందము పొందగలరన్నారు. 

శ్రీమతి శిరీన్ తాను ఏంతో అదృష్టవంతురాలని, తాను ఏంతో సంతోషముగా తన 16 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్  లో శిక్షణ పొంది సర్టిఫికెట్ తీసుకున్నానని, 17 వ బ్యాచ్ లో కూడా ట్రైనర్ గా నాకు అవకాశము ఇచ్చిన స్వామికి, కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, తన తోటి వారికీ మహిళా  దినోత్సవ  శుభాకంక్షలతో వారి  స్పీచ్ ను ముగించారు. 

ఈ నాటి అతి ముఖమైన ఘట్టము:  మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహణ : శ్రీమతి సాక శిరీష శ్రీ కైలాష్ డియాగోనోటిక్ సెంటర్లో  టెక్నినిషన్ గా ఉద్యోగ భాద్యతలు నిర్వహిస్తూ, వారు స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్ ట్రైనీ గా వుంటూ తన తోటి వారికీ  సేవలు అందించాలని, అనుకోని,  వారికీ బి.పీ షుగర్, ఆక్సిజన్ లెవెల్స్ పరీక్షలు నిర్వహించి తన సేవలు స్వామి మెచ్చే రీతిలో నిర్వహించి, స్వామి అనుగ్రహానికి పాత్రులైనారు. 
 
చివరగా శ్రీమతి శిరీష స్వామి వారికీ మంగళ హారతి  సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 

ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్, పి విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, స్వామికి కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, సహకరించిన వారి కందరికి స్వామి దివ్య ఆశీస్సులు  ఉండాలని ప్రార్ధించి, అందరిని 22 వ తేదీ ఆదివారం బేగం బజార్ లో గల శ్రీ  సత్య సాయి భవన్ లో  జరిగే భజన కార్యక్రమమునకు అందరిని ఆహ్వానించారు.





















20-1-2023 


ద్వితీయ విఘ్నము లేకుండా ఈ రోజు నుండి ప్రతి రోజూ రుద్రం మొదటి అనువాకాన్ని ట్రైనింగ్ సెంటర్ లో అందరు వింటారు. 







శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...