Tuesday, December 31, 2019

2020 NEW YEAR GREETINGS WITH SWAMY'S MESSAGE

BLANKET DISTRIBUTION 31-12-2019 - MALAKUNTA SLUM...


12 Members of Sri Sathya Sai Grama Seva Maha Yagnam Malakunta Medara Basti.









on 31-12-2019 Seven Tutition Candidates.

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో, ఈ రోజు, శ్రీ సత్య సాయి గ్రామా సేవ మహాయజ్ఞం పధకంలో భాగంగా దత్తత తీసుకున్న మాలకుంట, స్లం లో వారికి, ఫ్రీ టుఇటైన్స్ లో శిక్షణ పొందుతున్న వారికీ  దుప్పట్లను అందజేయడమైనది. విద్యాజ్యోతి పధంకం లోని ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు, ఒకేషనల్ ట్రైనింగ్ లో శిక్షణ పొందుతున్న వారికీ, ఓల్డ్ సిటీ గౌలిపురా లో వారికి రెండు, మూడు రోజులలో, మొత్తము 160 దుప్పట్లు ఇవ్వవలసి వున్నది. జై సాయి రామ్.

1-1-2020 VOCATIONAL TRAINING CENTRE:OSMAN GUNJ. HYDERABAD 




Saturday, December 28, 2019

GOWLIPURA BHAJAN MANDALI - 2ND BHAJAN AT SRI NARESH KUMAR AGARWAL'S RESIDENCE.











ఈ రోజు అనగా 29-12-2019 న భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో,శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి,  గౌలిపురా భజన మండలి ఆధ్వర్యంలో శాలిబండా లో గల శ్రీ నరేష్ కుమార్ అగర్వాల్ గారి నివాసములో సరిగ్గా 5-30 గంటలకు వేదముతో ప్రారంభించబడి, సుస్వర భజనలు అందరిని ఆకట్టు విధముగా ఏంతో భక్తి శ్రద్దలతో, భజనలు ఆలపించారు. భజనలు పాడిన వారు, కోటి సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి గణేశ భజనతో ప్రారంభించగా, శ్రీమతి మాదవి గారు గురు భజనను, శ్రీమతి విజయ లక్ష్మి గారు మాత భజనను, ఆలపించారు, తరువాత సాయి దాసు, కల్పనా, మాధవి గారు, రాజేష్ గారు, సాయి లక్ష్మి, మరియు స్వామి వారి సుమధుర గళంలో, హరి హరి స్మారణ కారో అనే భజనకు అందరూ గొంతు కలిపి ఉచ్చ స్థాయిలో పాడారు. చివరగా, శ్రీ నరేష్ కుమార్ అగర్వాల్ హారతి సమర్పించగా, ఈ రోజు భజన కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. నూతన సంవత్సరములో అనగా 2020 లో 25వ తారీఖున జనవరి లో హరిబౌలి లో గల కృష్ణా రావు గారింట్లో ఉంటుందన్న భజన మండలి ఇంచార్జి సాయిదాస్ ప్రకటించగా, శ్రీ కృష్ణారావు గారు కూడా అడ్రస్ వివరములు తెలిపి అందరిని ఆహ్యానించారు.... ఈ భజన కార్యక్రమములో  30 నుండి 35 మంది భక్తులు పాల్గొన్నారు. జై సాయి రామ్.  విశ్వేశ్వర శాస్త్రి కోటి సమితి కన్వీనర్.

BHAJAN LINK.PART I

PLEASE CLICK THE LINK TO VIEW SHA-ALI-BANDA BHAJAN PART I- ORGANISED BY GOWLIPURA BHAJAN MANDALI. PART I 

Thursday, December 19, 2019

19-12-2019 mahila day program

ఓం శ్రీ సాయిరాం 

ప్రతీ  నెల, 19 వ తారీకు న జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా, ఈరోజు, శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో, మహిళా దినోత్సవ వేడుకలను, ఘనంగా  జరుపుకున్నాం. ఈరోజు, ఈ శిక్షణా శిబిరం, లో శిక్షణ పొందిన వారు, పొందుతున్న వారు, మొత్తం తొమ్మిది మంది, మరియు సమితి సభ్యలు శ్రీమతి విజయ లక్ష్మి గారు, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి కల్పన, సమితి కన్వీనర్  ఈ కార్యక్రమంలో, వారి వారి, అభిప్రాయాలను తెలియజేశారు,ముందుగా, శ్రీమతి విజయ లక్ష్మి గారు మాట్లాడుతూ, స్వామి 19వ తేదీన మహిళా దినోత్సవం ను ఎందుకు పెట్టారో, వివరములను తెలియ జెసి శ్రీమతి శైలేశ్వరి గారిని మహిళా దినోత్సవం సందర్భముగా మాట్లాడవలసినదిగా కోరారు. వారు వారి అనుభములను, వారి ఆధ్యాతిక ప్రస్థానంలో వారి తండ్రి ని స్మరించుకుంటూ, తండ్రి వల్లనే సంసృతి సంప్రదాయాలను, పాటించే దిశగా, వారిని పెంచారని, కృతజ్ఞ్యతలు తెలియజేసికుంటూ, వివాహానంతరం తానూ, ఎన్నో సమస్యలను ఎందుకొన్నానని, సంతానము విషయములో స్వామి చూపిన కరుణను, మరవలెనని, తానూ తన వంతు కృషి గా సేవ మార్గములో విద్యాదానమును చేయవలె నన్న తరుణములో తనకు బాలవికాస్ గురువుగా సేవలందించే భాద్యతను స్వామి చూపించారని, తెలిపారు.  ఈ శిక్షణా కేంద్రం, టీచర్, గారైన, శ్రీమతి దాస పద్మావతి గారు , పంచ మాత గురించి, సవివరంగా తెలియ జేసారు. పంచమాతలు భారతీయులకు ఆరాధనీయులు  వేదమాత - గోమాత భూమాత - దేశమాత - దేహమాత. ఈ పంచ మాతల  గురించి, స్వామి వారు తెలియజేసిన, అనేక విషయాలను, తెలియజేసారు.
శ్రీమతి సమీనా సుల్తానా మాట్లాడుతూ, తాను, వారి అమ్మగారికి, చిన్నతనంలో జరిగిన ఒక ప్రమాద సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటూ, ఆ ప్రమాదం వల్ల, తన తల్లికి, కుడి చేతికి పెద్ద గాయం అయిందని, తర్వాత ఆ చేతిని కూడా తీసి వేశారని చెపుతూ, తనకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలతో, ఇప్పుడు కూడా, తన తల్లి దగ్గరే ఉంటూ, తన తల్లికి, సేవలు చేస్తూ, తన జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లుగా, తెలియజేస్తూ, ఒంటిచేత్తో, తన కూతురైన సమీనా సుల్తాన్ కు, మరి వారి ఇద్దరు పిల్లలు కూడా, ఎంతో రుచి కరంగా, పదార్థాలను వండి పెట్టి, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నా, తన తల్లికి, హృదయ పూర్వకమైన, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తన తల్లికి, తను సదా, కృతజ్ఞతలు, తెలియజేసుకుంటూ, నా తల్లికి, నా జీవితాంతము తోడుగా ఉండి, సేవలు చేసుకునే భాగ్యం ప్రసాదించమని కోరుకుంటూ, తన ప్రసంగాన్ని ముగించింది.


కుమారి అనూష, కుమారి హేమ పుస్తకంలోని, మాట భువనేశ్వరి, గూర్చి, మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి గూర్చి, పలు విషయములను మనంచేసికున్నారు. 



శ్రీమతి కల్పన, శ్రీమతి శైలేశ్వరి శ్రీమతి విజయ లక్ష్మి  సుస్వరమైన శ్రీ సత్య సాయి భజనలను ఆలపించారు. అందరు విభూతి ప్రసాదమును తీసుకొని వెళ్ళినారు. 

శ్రీమతి కల్పన, శ్రీమతి శైలేశ్వరి శ్రీమతి విజయ లక్ష్మి   సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. 

సాయిరాం 

విశ్వేశ్వర శాస్త్రి పి 







Monday, December 16, 2019

PRASHANTI NILAYAM SERVICE 2020

PRASHANT NILAYAM SERVICE 2020 

Sairam, 

Starting on 6th January 2020 and returning on 15-1-2020

  1. Ch Lakshma Reddy   Confirmed 
  2. Sri Lakshminarayna  Confirmed 
  3. Sri Sathyanarayana 
  4. Sri Ramdas                 Confirmed 
  5. Sri RamReddy 
  6. Sr Anil. 
  7. Sri Pandu 
  8. Sri Ramu 
  9. Sri Ch Ravinder Reddy 
  10. Sri Hari Mutyam Naidu
  11. Sri N Sree Ram Murthy
  12. Sri Patil 
  13. C/o Narasimha Reddy 



  శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి సమితి, 
శ్రీ సత్య సాయి భజన మండలి గౌలిపురా, హైదరాబాద్ 

సభ్యులు 

  1. శ్రీ సాయి దాస్ ఎస్.  గౌలిపురా 903030399735
  2. శ్రీ సాయి చైతన్య  గౌలిపురా 
  3. శ్రీ ఆదర్శ్  గౌలిపురా 
  4. శ్రీ రంగా రావు  గౌలిపురా 
  5. శ్రీ చరణ్ దాస్  9381927246 
  6. శ్రీమతి మాధవి గౌలిపురా - బౌయిన్పల్లి  Madhavi.7207639875. 
  7. శ్రీమతి భాగ్య లక్ష్మి  గౌలిపురా 
  8. శ్రీ లక్ష్మీనారాయణ  ఉప్పుగూడ 8500867318 
  9. శ్రీ రాములు 9441282158 
  10. శ్రీ సత్యనారాయణ 8074496232 
  11. శ్రీ ప్రకాష్ కందికల్గటే 
  12. శ్రీ అశోక్  ఉప్పుగూడ 9032311292 -- వాతాపి నో. 9966182544 
  13. శ్రీ కృష్ణ రావు  హరిబౌలి. 9177298189 
  14. శ్రీ నరేష్ కుమార్ అగర్వాల్  శాలిబండ 7013648490 
  15. శ్రీమతి పద్మా W/0 శ్రీ అవధూత ఈశ్వర్ శాలిబండ 9182413009
  16. శ్రీ విజయ్ కోవా చందూలాల్ బేలా 
  17. శ్రీ కృష్ణ మూర్తి 9989976470 గౌలిపురా 
  18. శ్రీ పుల్లయ్య Retd Police  గౌలిపురా  9951252860 
  19. శ్రీ శైలం --  గౌలిపురా 
  20. శ్రీ ప్రవీణ్ సాక్షి గౌలిపురా - 9399999334 
  21. శ్రీ వినోద్ -  గౌలిపురా  9849075984 
  22. శ్రీ జి రవీందర్ - బాలాపూర్ -- మీదని.  9912313014




Thursday, December 12, 2019

Inauguration of Bhajan Mandali dt 14-12-2019



Pl click the link to view the  Video Invitation of" Bhajan Mandali Gowlipura"












శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, హైదరాబాద్ - జిల్లాలో 16 సమితిలు వున్నవి.  అందులో శ్రీ సత్య సాయి సేవ సంస్థ కోటి సమితి ఒకటి. కోటి సమితి సమితి పలు సేవా, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను, అబిడ్స్, కోటి, బేగం బజార్, ఉస్మాన్ గంజ్ ప్రాతాలలో, వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమాలు కోటి సమితి కే పరిమితము కాకుండా, పాత బస్తీలో కూడా విస్తరింప జేయవలేనన్న హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారి ఆదేశము ప్రాకారం ఒక ప్రణాలిక ప్రకారం, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను, గౌలిపురా, శాలిబండ, ఉప్పుగూడ, హరిబౌలి, అలియాబాద్, ప్రాంతాలకు విస్తరింప జేసే నిమిత్తముగా , ఈ భజన మండలిని ఈ రోజు ప్రారంభిచడానికి శ్రీకారం చుట్టడమైనది.

ఈ నాటి కార్యక్రమము హైదరాబాద్ జిల్లా ఆద్యఖులు కోటి సమితి సమితి కన్వీనర్, శ్రీ సాయి దాస్, లక్ష్మీనారాయణ, సాయి చైత్యన్య మహిళలు, పిల్లలు అందరు కలసి, సాయి గాయత్రీ మంత్ర పఠనతో, సన్నాయి వాయిద్యములతో,  గౌలిపురా గాంధీ విగ్రహము దగ్గరనుండి ఒక ఊరేగింపుగా, బయలుదేరి భజన హాలుకు చేరుకున్నారు.   

హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఏ మల్లేశ్వర రావు గారు జ్యోతి ప్రకాశనం గావించి శ్రీ సత్య సాయి భజన మండలి గౌలిపురా ను ప్రారంభించారు.  శ్రీ మల్లేశ్వర రావు గారు మాట్లాడుతూ, భజన మండలి, ఇటు భజన కార్యక్రమలను  కొనసాగిస్తూ అందరిలో ఐక్యత ను సంఘటిత పరచి,  సామాజిక, ఆధ్యాతిక, సేవా కార్యక్రమాలను గౌలిపురా, శాలిబండ, ఉప్పుగూడ, హరిబౌలి, అలియాబాద్,  లాల్ దర్వాజా, బాలాగంజ్, ప్రాంతాలలో  చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ భజన మండలి కి శ్రీ ఎస్ సాయి దాసు కు    శ్రీ సత్య సాయి స్క్రాఫ్ బహూకరించి, భజన మండలి గౌలిపురా ఇంచార్జి   నియమించారు.  శ్రీ సాయి దాసు, కోటి సమితి సమితి కన్వీనర్, శ్రీ విశ్వేశ్వర శాస్త్రి, మరియు DISTRICT ORGANISATION సహాయ సహకారాలతో,  భజన కార్యక్రమాలను,  సేవాకార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు.  

                 HYDERABAD DISTRICT ORGANISATION వెబ్ డేషింగ్న్గ్ కోర్స్కు రేపు అనగా         15-12-2019 ప్రవేశ పరీక్షను నిర్వస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు, ఈ అవకాశమును వినియోగిమ్చుగలరన్నారు. కోటి సమితి సభ్యులు, అందురు కలసి సుమధురమైన భజనల తరువాత స్వామి వారికీ, శ్రీ ఎస్ సాయి దాసు మంగళ హారతి సమర్పతో కార్యక్రమము సుసంపన్నమైనది. 

                  ఈ కార్యక్రమములో, శ్రీ లక్ష్మీనారాయణ, ఏ శ్రీరాములు, ఛైర్మెన్ హనుమాన్ టెంపుల్, శ్రీ అశోక్, సేవాదళ్ సభ్యులు  సత్యనారాయణ,, శ్రీ నర్సింగ్ రావు శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీమతి కల్పనా, శ్రీమతి ఇందిరా, శ్రీమతి సునీత,  శ్రీమతి శైలేశ్వరి,  నీలిమ,  శ్రీ మహాంకాలి లక్ష్మీనరసింహారావు, శ్రీ నరేష్ కుమార్ అగర్వాల్, శ్రీ కృష్ణ రావు,  శ్రీ చల్లమల్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

                  శ్రీ సత్య సాయి సేవ సంస్థల కోటి సమితి కన్వీనర్, శ్రీ విశ్వేశ్వర శాస్త్రి, స్వాగత వచనాలను, వందన సమర్పణ గావించారు.

PLEASE CLICK THE LINK TO VIEW THE VIDEO PART I 
PLEASE CLICK THE LINK TO VIEW THE VIDEO PART II
PLEASE CLICK THE LINK TO VIEW THE VIDEO PART III
PLEASE CLICK THE LINK TO VIEW THE VIDEO PART IV

Saidass S. comments in Whatsapp

Appreciate your efforts at this age sir for, the patience swami gave you to record the videos and edit , render and then upload it to YouTube so that people can relive and experience the BHAJANS..is really commendable sir ...👌🏻👏🏻👍🏻🙏🏻..Jai Sairam..🙏🏻

Monday, November 25, 2019

DR NARENDRANATH REDDY - CHAIRMAN FOR PRASHANTI COUNCIL AN INTERNATIONAL FORUM OF SRI SATHYA SAI SEVA ORGANISATION.







Pl click the link to listen: Dr Narendranath Reddy Garu's Speech.

DR NARENDRANATH REDDY - CHAIRMAN FOR PRASHANTI COUNCIL AN INTERNATIONAL FORUM OF SRI SATHYA SAI SEVA ORGANISATION

AN ARDENT DEVOTEE OF BHAGAWAN OVER 5 DECADES, IS AN AUTHOR OF SEVERAL BOOKS ON SWAMI'S PHILOSOPHY AND MISSION. hE IS ENDOCROMINOLIGST BY PROFESSION. hE IS A WITNESS FOR INNUMERABLE MIRACLES OF BHAGAWAN AND EXPERIENCED PERSONALLY TOO. DR NARENDRANATH REDDY, TOURED WIDELY IN INDIA AND ABROAD, SPREADING HIS MISSION ACROSS THE GLOBE.




Sunday, November 24, 2019

శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కి 4 సంవత్సరములు.పూర్తి చేసుకున్న సందర్భములో


మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చేఎందుకు ఏర్పడిన శ్రీ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ( టైలరింగ్ ) 4 సంవత్సరములు పూర్తిచేసుకున్నది. గృహిణులు, సాధికారతఃను, సాధించేందుకు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్, ఆద్యర్యంములో, 4 సంవత్సరముల క్రింద ఉస్మాన్ గూంజ్ లో గల తోప్ ఖనా లో ప్రారంభమై, 12 బ్యాచేలలో కుట్టు శిక్షణ, మరియు ఒక బ్యాట్ వారికీ మెహందీ, బ్యూటిషన్, కోర్సులలో శిక్షణ నిచ్చారు.
ఈ శిక్షణా తరగతులు, డిసెంబర్, 5, 2015 ప్రారంభమై, ఇంతవరకు 12 బ్యాచ్లు పూర్తి చేసుకున్నది. ప్రస్తుతము 13 వ బ్యాచ్ కొనసాగుతున్నది.

ఇంతవరకు కుట్టు శిక్షణ పొందిన వారు, దాదాపు 220 మంది, వారిలో 50 శాతం మంది, వారి వారి కాళ్లపై వారు నిలబడే విధంగా, నెలకు, ఐదు వేల నుండి, ఆరు వేల రూపాయల వరకు, సంపాదించుకుంటున్న ట్లుగా, తెలియజేశారు, మరి కొందరు వారి వారి ఇండ్లలో నున్న వారి గుడ్డలు కుట్టి ఆనందామును వ్యక్త పరిచారు. వీరిలో పురానాపూల్ కు చెందిన అశ్విని మన దగ్గర పదో బ్యాచ్లో, టైలరింగ్ లో, శిక్షణ పొంది, ఈ మధ్యనే, ఒక అడ్వాన్స్డ్ ఎలక్ట్రికల్ కుట్టు యంత్ర ము కొని తాను నెలకు 12 వేల నుండి 13 వేల రూపాయల వరకు కూడా సంపాదించుకుంటున్న ట్లు, తెలియజేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

సత్య సాయి వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో, 2015లో , మూడు కుట్టు యంత్రం లతో, ప్రారంభమైన ఈ కేంద్రం ఇప్పుడు, 10 మిషన్ లతో, మరియు ఒక పికో మిషన్ తో నున్నది, 

ఈ పికో మిషన్, ఈ కుట్టు కేంద్రంలో , గతంలో నేర్చుకున్నవారు, ప్రస్తుతం నేర్చుకుంటున్న వారు, అందరూ ఉపయోగించుకునే విధంగా నెలకొల్పడం అయినది,

ఈ కేంద్రంలో మూడో వ బ్యాచ్లో, ట్రైనింగ్ అయిన శ్రీమతి పద్మావతి గారు, ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు,

ఈ ట్రైనింగ్ సెంటర్లో, ప్రతి 19వ తేదీన మహిళా దినోత్సవ వేడుకలను కూడా , జరుపుకొనుట విశేషం. 

ఈ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న వారితో, ప్రత్యేకంగా , బొంతలు, లంగోటాలు, చిన్నపిల్లలకు కుల్లాలు  కుట్టించి, వారితోనే, సుల్తాన్ బజార్  ప్రసూతి గృహమునందు , వారిచే ఇప్పించబడి వారిలో సేవా భావమును పెంపెందింప జేయడమైనది.  ఈ కార్యక్రమం ప్రతి మూడు నెలలకు ఒక సారి జరుగుతున్నది. 


ఈ ట్రైనింగ్ సెంటర్లో, ప్రతి 19వ తేదీన మహిళా దినోత్సవ వేడుకలను కూడా , జరుపుకొనుట విశేషం. 

వీటితో బాటుగా, ప్రతి గురువారం, భజన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. 

మరియు ఈ నెల 18 వ తేదీన స్వామి వారి 94 వ జన్మ దినోత్సవ వేడుకలలో కూడా ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ నుండి అధిక సంఖ్య లో పాల్గొన్నారు. 


ఇంతవరకు 12 బ్యాచులు పూర్తి అయినవి. ఒక్క  బ్యాచ్లో 20 మందిని తీసుకుంటున్నాము. ప్రతిరోజు తరగతి 11  గంటలకు ప్రారంభమై 2 గంటల వరకు కొనసాగును. రోజూ 3  గంటలు, మొత్తము 100 రోజులు. 

దీనితోపాటు, శిక్షణ పొందుతున్న వారికి, కుట్టు యంత్రం మెకానిజం తరగతులను,  కూడా నిర్వహింపబడుతుంది. ఈ తరగతిలో శిక్షణ ఇచ్చేవారు శ్రీశైలం మాస్టర్.

ఈ శిక్షణలో క్రొత్తగా, ప్రతి ఒక్కరూ, నేర్చుకోవటానికి వీలుగా, స్కూల్ యూనిఫామ్ లో, ప్రావీణ్యత, పొందే విధంగా శ్రీ పెంటయ్య మాస్టర్  గారు, వచ్చి , నిక్కరు, చొక్కా, అంటే షర్టు నేర్పుతున్నారు.



ఈ సెంటర్లో, మగ్గం తరగతులను కూడా, ప్రవేశపెట్టాలని అనుకొని చున్నాము.


ఇంతవరకు జరిగిన సర్టిఫికెట్స్ బహుకరణ కార్యక్రమాలలో, శ్రీ సత్య సాయి సేవ సంస్థల , హైదరాబాద్ జిల్లా అద్ధ్యఖులు,, శ్రీ ఏ మల్లేశ్వర రావు గారు, మహిళా కో-ఆర్డినేటర్, శ్రీమతి సుధా గారు, అల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ నిమేష్ పాండ్యా, రాష్ట్ర అధ్యఖులు శ్రీ పి వెంకట్ రావు, స్వామి వారి అనువాదకులు, proff. కామరాజు అనిల్ కుమార్, రాష్ట్ర ఉపాధ్ఖులు, డాక్టర్ కృష్ణ కుమార్, పూర్వ అధ్యఖులు, శ్రీ ఎం వి. ఆర్ శేష సాయి, అన్నమాచార్య భావన వాహిని ఫౌండర్ ప్రెసిడెంట్ పద్మశ్రీ డాక్టర్ శోభా రాజు గారు, బర్కలీ స్కూల్ అఫ్ లా యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియా లోపట్టాభూద్రులై, మీడియా స్పీకర్, గా అకాడమిక్ రైటర్ గా నున్న శ్రీమతి కృత్తిక వాసిరెడ్డి గార్లు పాల్గొన్నారు.

10th Batch Convocation - held on 17-2-2019 






11th batch Convocation 


12 th batch 










DASARA CELEBRATIONS AT SIVAM. FROM 3-10-2024 TO 12-10-2024 - KOTI SAMITHI SAMITHI DATES. 6TH, 7TH, 12TH,

  ఓం శ్రీ సాయిరాం  ఆదివారము 6-10-2024 న రోజున మహాలక్ష్మి అలంకరణ.  ఉదయం 7 గంటల నుండి, 1 గంట వరకు శివమ్ మందిరంలో సేవ మన కోటి సమితికి కేటాయించబ...