Wednesday, July 27, 2022

VARALAKSHMI VRATARAM dt 29-7-2022 at SIVAM

 






శివమ్ లో శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం వరలక్ష్మి వ్రతం 

ఓం శ్రీ సాయిరాం 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,  భగవానుడు నడయాడిన శివం మందిర ప్రాంగణంలో  హైదరాబాద్ లో గల, సత్య సాయి సేవా సంస్థలు, 16 సమితిలో, మొదటి శుక్రవారం, అనగా ఈ రోజు    కోటి సమితి సమితి, హిమాయత్నగర్ గాంధీ నగర్ సమితి, సీతాఫలమండి సమితి వరలక్ష్మి వ్రతం లో పాల్గొన్నారు. ఈ ఉదయం 9-30 గంటలకు  శివమ్ గర్భగుడి నుండి వూరేగింగా  ఈ కార్యక్రమం కన్నా  ముందుగా అందరూ శివం లో గల  వినాయకుడు విగ్రహం దగ్గర నుంచి ప్రారంభించి శివమ్  మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి   సాయి గాయత్రి మంత్రాలు వేదమంత్రాలు ఉచ్చరించుచు స్వామివారికి పూర్ణకుంభ తో స్వా గతం పలికి అందురు కలసి జ్యోతి ప్రకాశనం గావించి,  కార్యక్రమానికి ఆసీనులై నారు. 

ఈ నాలుగు సమితులు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి, శివం భజన మందిర  ప్రాంగణంలో ఎంతో శ్రద్ధాభక్తులతో మొదటి శుక్రవారం  శ్రావణ మంగళ గౌరీ వ్రతం, స్వామి వారి చిరకాల భక్తులు, శ్రీ  మంగళపల్లి రామకృష్ణ శర్మ గారు వారి డైన శైలిలో  వినాయక పూజా తో, మొదలుపెట్టి  స్త్రీలకు సర్వసుఖాలు, సౌభాగ్యాన్నిచ్చే వరలక్ష్మీ వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడని శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి చెప్పిన కథను  వరలక్ష్మి వ్రతం - పూజ, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఆష్టోత్తరం,వరలక్ష్మి ఆష్టోత్తరం,  శ్రీ లక్ష్మి కుంకుమార్చన, సామూహికంగా  లలితా సహస్రనామ పారాయణం  అందరిని   అత్యద్భుతంగా ఆకట్టుకుంది. 


ఈ రోజు ముఖ్యలుగా స్వామి చిర కాల భక్తురాలు శ్రీమతి రేవతి గారు, శివమ్ భజన  సింగర్   శ్రీమతి శర్మదా గారు, హైదరాబాడ్ డిస్ట్రిక్ట్ ఆధాత్మిక విభాగ సమన్వయ కర్త      శ్రీమతి కామేశ్వరి గారు శ్రీమతి శేషవల్లి  గారు, హైదరాబాడ్ డిస్ట్రిక్ట్ మహిళా సేవాదళ్ సమానవ్యకర్త   శ్రీమతి శశి గారు,  హిమాయత్నగర్, గాంధీ నగర్, సీతాఫలమండి మరియు, కోటిసమితి మహిళా సభ్యులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు. 

ఏంతో సంతోషముతో వారి వారి ఇండ్లలో తయారు చేసిన ప్రసాదాలను స్వామి వారికీ అందరు కలసి, నైవేద్యముగా సమార్పణ గావించి,  స్వామి వారికీ అందరు కలసి మంగళ హారతి సమర్పణతో  సమర్పతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 
ఫోటోలు పంపద మైనది. 





Thursday, July 7, 2022

Thursday, July 7, 2022 ఒక సమితి పిల్లలు, వేరొక సమితి పిల్లలకు గ్రూపు 3 విద్యార్ధులు గాయత్రి మంత్రం – విశిష్టతను 5 బోధనా పద్దతలలో, ఆన్లైన్ లో చెప్పటమే ప్యూపిల్ - టీచర్ ట్రాన్స్పోసిషన్ ప్రోగ్రాం. Pupil-Teacher Transposition Program 10-7-2022 @ 11-00 AM TO 12-30 NOON

 

గురుపూర్ణిమ వేడుకలలో భాగంగా ఈ రోజు ఆషాడ ఏకాదశి తోలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, Pupil-Teacher Transposition Program ఒక సమితి పిల్లలు, వేరొక సమితి పిల్లలకు గ్రూపు 3 విద్యార్ధులు గాయత్రి మంత్రం – విశిష్టతను 5 బోధనా పద్దతలలో, ఆన్లైన్ లో చెప్పటమే ప్యూపిల్ - టీచర్ ట్రాన్స్పోసిషన్ ప్రోగ్రాం. Pupil-Teacher Transposition Program 

10-00 TO 11-30  అంబర్పేట్ విద్యార్థులు(గురు సమితి )   - కోటి సమితి, విద్యార్థులకు  మరియు దిల్ సుఖ్ నగర్ విద్యార్థులకు భోధించెదరు.
 
11-00  - 12-30 తరువాత కోటి సమితి విద్యార్థులు(గురు సమితి స్థానంలో  - అంబర్పేట్, మరియు మారేడ్పల్లి విద్యార్థులకు బోధించెదరు. 

ఈ నాటి  కార్యక్రమము ఓంకారం,  గణపతి ప్రార్థన,  గణపతి అధర్వణ శీర్షం, భజనలు-4 తో ప్రారంభమై ఈ విధముగా కొనసాగినది. 

మాస్టర్ లీలాధర్ - గాయత్రీ అమ్మవారి రూపమును, మంత్రమును,  మనస్సులోనే చిత్రీకరించి మనో నేత్రాలతో చూసుకొనుటనే విజువలైజషన్ - అతి సుందరముగా చిత్రీకరించినట్లుగా న్యాయ నిర్ణేతగా విచ్చేసిన శ్రీమతి భాగ్యలక్ష్మిగారు తెలిపారు.   

మాస్టర్ ప్రణవ్ గాయత్రీ మంత్ర విశిష్టత - పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా, అద్భుతంగా విపులముగా, వివరించినట్లు భాగ్యలక్ష్మిగారు తెలిపారు.   


చిరంజీవి జయ గాయత్రీ నాగ - జయ శారదే - జయ శారదే అనే భజనను చక్కగా వివరించగా, దిల్ సుఖఃనగర్ బాలవికాస్ విద్యార్థులు, మరియు మారేడ్పల్లి విద్యార్థులు చప్పట్లతో, అనందం వ్యక్తం చేశారు. 

మాస్టర్ సాయి గుప్త, స్వామి వారి దివ్యసందేశముల ఆధారముగా ఒక అద్భుతమైన లీల చెప్పి అందరి మన్నలను పొందినాడు. 

సాయిరూప గాయత్రీ మంత్రం జపించడంవల్ల తనకు కలిగిన అనుభవమును తెలిపి అందరు గాయత్రీ మంత్రం రోజు జపించే విధంగా తెలియజేసారు.  

మాస్టర్ హేమంత్ - తొలుతగా నిర్వహించిన వారి సంభాషణముల నాధారంగా - ఆక్టివిటీ నిర్వహించి ప్రశ్నలు వేసి, వారిని మరింత ఉత్సహము తో ఉండే విధముగా వారి ఆక్టివిటీ కొనసాగినది. 

శ్రీ సత్య సాయి భద్ర దేవి  పద్య సూక్తిని మరియు పద్యార్ధమును వివరాయించారు. 

అన్ని బోధనాంశముల భోధన అనంతరం మా న్యాయ నిర్ణేతలు శ్రీమతి భాగ్యలక్ష్మిగారు మాట్లాడుతూ, పిల్లలందరూ చాల బాగా మాట్లాడినారని, యెంత గానో మెచ్చుకున్నారు. 

కోటి సమితి సమితి కన్వీనర్ చివరగా మాట్లాడుతూ, విద్యార్థులంతా బాగా వున్నకొద్దీ సమయంలో, ఏంతో చక్కగా కార్యక్రమమును, ఏంతో క్రమశిక్షణతో, డిడికేషన్ తో, నిర్వహించారని, ఈ కార్యక్రమాన్ని అంతా దిగ్విజముగా కొనసాగించిన స్వామికి అందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసికుంటూ, గురుపూర్ణిమ కార్యక్రమ వివరములు తెలిపిన అనంతరము స్వామి వారి విద్యాధార్థులంతా కలసి స్వామివారికి మంగళహారతి సమర్పణతో ముగిసినది. 

జడ్జి గారి ప్రసంగం


























Tuesday, July 5, 2022

GURUPOORNIMA CELEBRATIONS 13-7-2022

 




A Guru is one who, through his grace enters your heart, broadens it and enables you to comprehend the aspects of Divinity. - Baba

Guru Poornima is observed today. Guru means Big. Guru also has another meaning: “Gu” means darkness and “Ru” means dispelling. “Guru” means “One who dispels darkness” (the preceptor who dispels the darkness of ignorance). Guru Poornima is the day on which one celebrates the dispersal of the darkness of ignorance from the mind. Hence, people should fill their minds with the all-embracing Love Principle. To experience the fullness of Love, you have to fill your hearts completely with Love. That will be the result of total devotion. But today, devotion is not total. Hence, the benefit also is partial. Part-time devotees cannot expect total reward! The Lord confers full grace on those whose hearts are totally filled with devotion. Spiritual aspirants may follow any one of the nine paths of devotion and realize the Divine. Among these, the attitude of friendship towards God is the one to be cherished because God is the only true and enduring friend for everyone! - Divine Discourse, Jul 22, 1994.

Sathya Sai Baba 

PL CLICK HERE TO VIEW THE VIDEO SRI VSR MOORTHY- SPIRITUAL SCIENTIST'S GURUPOORNIMA MESSAGE 
















  1. P V SASTRY
  2. RENUKA 
  3. SAI VAANI
  4. PRANAV 
  5. SHAILESWARI
  6. LEELADHAR 
  7. KALPANA
  8. HEMANG 
  9. GAYATRI
  10. BHAGYA LAKSHMI 
  11. SON
  12. DAUGHTER
  13. SUNITHA 
  14. SAI LAKSHMI
  15. SAI ROOPA
  16. SAI KUMAR 
  17. M L NARASIMHA RAO 
  18. BHUVANESWARI
  19. SRINIVAS 
  20. BHADRA DEVI
  21. KUSUMA 
  22. GANDHI
  23. NAGA 
  24. SAI 
  25. BASAVA RAJU
  26. MRS BASAVARAJU 
  27. PATIL
  28. CHAKRADHAR 
  29. NEELIMA
  30. SAI GUPTA 
  31. SHARANYA 
  32. VIJAYA LAKSHMI 
  33. ZIA GUDA NAGESWARA RAO
  34. JYOTHI 
  35. VSR MOORTHY 
  36. VAMSH
  37. MRS SANDYA 
  38. RATNESH 
  39. MEGHARANI 
  40. NAIDU 
  41. NIRANJAN 
  42. LAKSHMAN C/O CHAKRADHAR 
  43. MANIKANTHA 

ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, గురు పూర్ణిమ సందర్భంగా, హనుమాన్ టెక్డి ఆలయంలో, తెల్లవారుజామున 5:30 గంటలకు,21, మార్లు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన కార్యక్రమం, బాల్ వికాస్ పిల్లలతో పాటు, కోటి సమితి సభ్యులు, భక్తులు, కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో, ఎంతో వైభవంగా జరిగినది. ప్రకృతి మాత , అనుగ్రహ ఆశీస్సులు కూడా దండిగా లభించి, కార్యక్రమం మొత్తం నిర్విఘ్నంగా, ఎంతో ఆనందంగా, స్వామి అనుగ్రహ ఆశీస్సులు పుష్కలంగా, లభించాయి. Xx  తదనంతరం ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారి గౌరవ అధ్యక్ష, అనుగ్రహ భాషణం గావించారు. శ్రీ వేదవ్యాస మహర్షి గురించి, వేదం గురించి, కృష్ణ ద్వైపాయనుడను ఆయన పేరు గురించి, భగవద్గీత పాడిన , జగద్గురుడైన కృష్ణుడు గురించి, ద్రౌపది దేవి కూడా, మొట్టమొదటైన ఆమె నామం కృష్ణ, అని, ముగ్గురు కృష్ణ నామాలు గురించి చెప్పారు, మాతృదేవోభవ, మొట్టమొదటి గురువు తల్లి అని, ఈ తల్లిదండ్రులే గురువును చూపిస్తారని, ఈ గురు పూర్ణిమ రోజు, బాల్ వికాస్ పిల్లలందరూ మాతృ వందనం చేయాలని, ఆమె యొక్క ఆశీస్సులు తీసుకోవాలని బోధించారు. భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుడు, అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం, పుట్టపర్తి లోనే ఉండి, అక్కడే దేహాన్ని వదిలిపెట్టారని, అందరి గురువులలో , ఆచరించి, ప్రబోధ చేసే ఆచార్యుడని, ఆచార్యదేవోభవ గురించి చెప్పారు. అందరం కలిసి గురువులకు గురువు లేని గురువు అయిన, శ్రీ సత్య సాయి నాధుడికి గురు వందనం గురుపూజ చేద్దామని, సత్య యుగం లోని సత్యమును, త్రేతాయుగములోని ధర్మమును, ద్వాపర యుగములోని శాంతి, ప్రేమలను, కలియుగములోని అహింసను, వెరసి సత్య, ధర్మ, శాంతి ప్రేమ, అహింసలే, శ్రీ స్వామి యొక్క అవతార లక్ష్యమని, శ్రీ స్వామి మనకి ఈ మార్గంలో నడవమని ప్రబోధించారని, అనుగ్రహ భాషణం జరిపినారు. బాల్ వికాస్ పిల్లల గ్రూప్ 2 ఎగ్జామ్స్, ఈనెల 24న ఉన్న సందర్భంగా, అందరి పిల్లలకి గాయత్రి మాత ఫోటో, మరియు పెన్నులను, ఎంతో ప్రేమతో ప్రసాదించారు, శ్రీ కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి గారు, కన్వీనర్లు మీటింగులో, బాల్ వికాస్ ఉద్యమం ఎంతో ఉదృతంగా జరగాలని శ్రీ స్వామి ప్రబోధించారని, ఈ శుభ, ప్రభాత సమయంలో శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారు, మన కోటి సమితికి విచ్చేసి, అనుగ్రహ భాషణం చేయడం, ఇది అంతా స్వామి సంకల్పం అని, ప్రకృతి మాత కూడా సహకరించిందని, శ్రీ స్వామి వద్ద కోటి సమితి మహిళా మణులు, చీరలు ప్రసాదం గా స్వీకరించి, ఎంతో బుద్ధి శక్తులతో, శ్రీ స్వామి యొక్క, సమితి యొక్క సేవ చేయాలని, శ్రీ స్వామి యొక్క అనుగ్రహం అందరి పై వర్షించాలని, కోరుకున్నారు. తదనంతరం శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారి, కి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకొని, శ్రీ స్వామికి దివ్య మంగళ నీరాజనం ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించుకుని, విభూది ప్రసాదాలను, పొంగల్ మరియు వడలను, అందర భక్తులు, ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించి, శ్రీ స్వామికి, కోటి సమితి కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారికి, గౌరవనీయులైన శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారికి, అతిధిదేవోభవ, అనే పదానికి పర్యాయపదంగా, ఈ ఆలయాన్ని ఎంతో శుభ్రంగా మనకి, ఈ దివ్యమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, ఇచ్చారని శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారు ఎంతో ఆనందించి చెప్పారు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుని శ్రీ స్వామిని పదేపదే, తలుచుకుని కృతజ్ఞతాభివందనాలు తెలుపుకున్నారు జై సాయిరాం బాలవికాస్ పిల్లలు, గురువులు, పెద్దలు, అందరు కలసి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికీ మంగళ సమర్పణ తో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.

 Convenor


P Visweswara Sastry. 

DASARA CELEBRATIONS AT SIVAM. FROM 3-10-2024 TO 12-10-2024 - KOTI SAMITHI SAMITHI DATES. 6TH, 7TH, 12TH,

  ఓం శ్రీ సాయిరాం  ఆదివారము 6-10-2024 న రోజున మహాలక్ష్మి అలంకరణ.  ఉదయం 7 గంటల నుండి, 1 గంట వరకు శివమ్ మందిరంలో సేవ మన కోటి సమితికి కేటాయించబ...