Wednesday, August 17, 2022

SRI KRISHNA JANMASTHAMI & MAHILA DAY CELEBRATIONS: 19-8-2022 AT SKILL DEVELIOPMENT TRAINING CENTRE: HYD




5249 వ  శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను, ఉస్మాన్ గంజ్ లో గల  శ్రీ సత్య సాయి స్కిల్ DEVLOPMENT ట్రైనింగ్ సెంటర్, (టైలోరింగ్ ) లో ఘనంగా జరిగాయి.  శ్రీమతి దాస  పద్మావతీ గారు, శ్రీమతి దాస వాణి  శ్రీమతి శైలేశ్వరి గారు  జ్యోతి ప్రకాశనం గావించగా, వేదం పఠనం  తో ప్రారంభమై  గణపతి ప్రార్ధన, శాంతి మంత్రాలూ, అనంతరం   గణేష్ భజన , గురు భజన , జగన్మాతే జగత్జనని అనే మాత  భజన  సాయి భజనలతో పాటు,  కృష్ణ భజనలతో, ఆనంద పరవశులైనారు. 

డాక్టర్  పి సుశీల ప్లే బ్యాక్ సింగర్ స్వామి చిరకాల భక్తురాలు స్వామి సమక్షంలో అనేక సార్లు పాడిన పాట "   కోటి సమితి సిస్టర్స్  "మధుర మోహన ఘన శ్యామ సుందర సాయీ" అనే మంచి మధురమైన   పాటను   యెంతో భక్తి పరవశంతో పాడారు.  

కోటి సమితి  బాలవికాస్ విద్యార్థులు, మహిళలు అందరు గోవింద కృష్ణ జై - గోపాల కృష్ణ జై అను భజన స్వామి గళంతో వస్తున్నప్పుడు  కోలాటంలో ఉత్సహంగా పాల్గొన్నారు.

ఈ రోజు  శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను, మహిళా దినోత్సవం సందర్భముగా   శ్రీమతి పద్మావతి,  శ్రీమతి కల్పనా, శ్రీమతి మల్లేశ్వరి, శ్రీమతి వాసవి  తదితరులు, మాట్లాడినారు. చివరగా శ్రీమతి శైలేశ్వరి మాట్లాడుతూ, గోపికల అనన్య భక్తి చాటి చెప్పే విశేషాలను,  కృష్ణ తత్వం లోని  అనేక కొత్త విశేషాలను, తెలిపారు. 

ఈ రోజు  శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భముగా, ఆశ్రిత కల్ప లో విశేష సేవలు అందిస్తున్న శ్రీమతి మల్లేశ్వరి గారిని, శ్రీమతి భాగ్యలక్ష్మి శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి పక్షాన శ్రీ కృష్ణ చిత్ర పటంతో సత్కరించారు. 

కోటి సమితి సిస్టర్స్ స్వామికి మంగళ హారతి సమర్పణ తో కార్యక్రమం దిగ్విజయముగా ముగిసినది. 




 
SPEAKERS OF THE DAY





                                                    





ఈ నాటి కార్యక్రమం లో సహకరించిన వారు, బంతిపూలు, తోరణం, మరియు ముగ్గులు వేసిన వారు ప్రస్తుతం 16 వ బ్యాచ్ లో ట్రైనింగ్ అవుతున్నవారు. 

శ్రీమతి దాస వాణి గారు ఒక రోజు ముందు అందరికి ఫోన్స్ చేసినారు. పద్మావతి గారు సెల్ ఫోన్ లో బాలన్స్ లేక కొన్ని ఫోన్స్ మాత్రమే బిజీ వున్నా కారణంగా చేయ గలిగారు. 

16 వ బ్యాచ్ లో ట్రైయిన్ అవుతున్న సిరీన్ నాకు లైవ్ (వాట్సాప్ ) ఇవ్వటం కారణంగా నేను ప్రత్యక్షముగా కార్యక్రమాన్ని చూడగలిగాను. 

15 వ బ్యాచ్ గౌలిగూడ శ్రావణి ఫొటోస్ తీయడంలో, మరియు మన యూత్ సాయి కుమార్ కూడా ఫొటోస్ తీయడంలో, మరియు స్వామి వారి గళంలో పాట వినిపించడంలో సహకరించారు. 

భాగ్యలక్ష్మి గారు పిల్లలను తీసుకొని వచ్చి, తాను వారి ఇంటినుండి కంజీర తెప్పించి కంజీర వాయించి కార్యక్రమానికి కొత్త శోభను తెచ్చారు. 

అందరికి స్వామి ఆశీస్సులు 








Tuesday, August 16, 2022

FLAG HOISTING BY CONVENOR KOTI SAMITHI - P V SASTRY AT ANNAMACHARYA BHAVANA VAHINI ANNMAYYA PURAM HYTEC CITY, HYDERABAD. 15-8-2022 AT 9-30 AM





 








భగవాన్ శ్రీ సత్య సాయి బాబా దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, అన్నమయ్య పురంలోని, అన్నమాచార్య భావనా వాహిని ప్రాగణంలో ఏంతో  భక్తి శ్రద్దలతో, ఎంతో వైభవముగా, జరిగాయి. వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారి జాతీయ పతాక ఆవిష్కరణలో భాగంగా పూజలు నిర్వహించారు. తరువాత అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు, పద్మశ్రీ డాక్టర్ శోభా రాజు ఆదేశము ప్రకారం శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి కన్వీనర్, 75వ స్వాతంత్ర దినోత్సవాలలో భాగంగా జాతీయ పతాకమును ఎగురవేశారు. అందరు కలసి ఎంతో భక్తితో, జాతీయ గీతమును పాడారు. 


అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు, పద్మశ్రీ డాక్టర్ శోభా రాజు, మాట్లాడుతూ, భారత దేశంలో పుట్టుటే ఒక పెద్ద వరమని, మన కున్న స్వేచ్ఛ, ఏ దేశంలో వారికీ లేదని, మనమంతా మానవతా విలువలను దృష్టిలో ఉంచుకొని,  కార్యక్రమాలలో పాల్గొనాలని, మన కున్న దానిలో పరులకు సహాయ పడాలని సూచన కావిస్తూ, శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు, అన్నమాచార్య స్టాంప్ విడుదల  సందర్భముగా, ఏంతో ఆక్టివ్ రోల్ తీసుకొని, స్టాంప్ విడుదల కార్యక్రమములో, సేవలను కొనియాడారు. మనమంతా ఏ కార్యక్రమాన్ని చేసిన మన ఆత్మా సంతృప్తి కోసం చేస్తున్నామని  గ్రహించాలన్నారు. 


 ఇంతపెద్ద సంస్థలో నాకు జాతీయపతాకమును ఎగురవేసే అవకాశమును ప్రసాదించిన, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికీ, మరియు పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారికి, హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేసుకుంటూ, ఈ 75 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసికుంటూ అందరికి సాయిరాం. 


 







GANAPATI HOMAM. FLAG HOISTING, SAI VRATARAM, - PRASADAM - JIYA GUDA 15th August 2022

75TH INDEPENDENCE DAY CELEBRATIONS: AT JIYA GUDA, HYDERABAD
  1. 05:00 AM - 08:00 AM - GANAPATIHOMAM 
  2. 08:00 AM - 08:15 AM - Flag hoisting 
  3. 08:15 AM - 08:30 AM - Breakfast
  4. 08:30 AM - 11:00 AM - SRI SATHYA SAI  VRATAM
  5. 11:00 AM - 12:00 PM - Bhajan
  6. 12:00 PM - PRASADAM

  1. Mobile:
  2. 9246525903, 7780101912
  3. 8790673721, 8074855828



















Wednesday, August 3, 2022

97 DAYS BHAJAN PROGRAM:

 ప్రేమపూరాక సాయిరామ్ 

ప్రతి సంవత్సరం స్వామి వారి జన్మ  దినోత్సవానికి ముందు  నిత్య భజనలు, నిత్య

నగర సంకీర్తనలతో  కూడిన సాధన ఒక దీక్షగా అన్ని  సమితి, భజన మిండలులలో

నిరాహించుకోవడిం అందరికి తెలిసినదే.   అదేవిధముగా ఈ సంవత్సరము ఆగస్ట్ 4 వ తేదీ నుండి  నవంబర్  8 వ తేదీ వరకు నిరాహించదలచిన 97 రోజుల నిత్య దీక్షా సాధన అంశములు 

1. 21 సార్లు ఓం కారం  సుప్రభాతం , నగర సంకీర్తన, జ్యోతి ధ్యానం, లిఖిత నామ జమం 

6. సాయంకాల భజనలు, 7. స్వామి వారు అందించిన  నవసూత్రములను నిత్యము ఆచరణలో పెట్టుట 

8. ప్రతి రోజూ గాయత్రీ మంత్రము, , సాయి గాయత్రీ మంతము  కనీసిం 27 సార్లా పఠించుట 

9. ప్రతిరోజు రాత్రి కుదిరించే సమయ మందు అంతః పరిశీలన  చేసుకొని, గతం కంటే వున్నత ఆధ్యాత్మిక విలువలతో  ఆచరణాత్మక జీవితం  గడుపునాట్లు  అనుగ్రహించమని స్వామి వారిని  ప్రార్ధించుట,  

అన్ని  సమితి మరియు భజన మిండలులలోని భక్తులు , సాధకులు ఈ నిత్యసాధన

నిరాహించేల  జిల్లా / కారయనిర్వాహక అధయక్షులు, జిల్లా ఆధ్యయతిమక సమనాయకరతలు

ప్రోత్సహించాలని మనవి. గమనిక :





 21 సార్లు ఓం కారం  సుప్రభాతం , నగర సంకీర్తన, గాయత్రీ మంత్రము, , సాయి గాయత్రీ మంతము, వేదము, భజన, 8 మంది భక్తులతో, స్రావ్యముగా జరిగినది. 

మంగళ హారతి సమర్పణ తో 97 రోజుల కార్యక్రమములో మొదటి రోజు కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 

సాయిరాం. 

  1. నిత్య నారాయణ సేవ ను 13-7-2022 నుండి అనగా గురుపూర్ణిమ నుండి ప్రారంభించాము. 
  2. స్టేట్ మరియు  జిల్లా ప్రెసిడెంట్ గార్ల ఆదేశానుప్రకారం ఆగష్టు 4 వ తేదీ నుండి ప్రారంభించాము. 
  3. ఆగష్టు 13 వ తేదినుండి, నిత్యా నారాయణ సేవ మరియు భజన అదే ఇంట్లో ఉండేవిధంగా ప్రణాళిక  తయారు చేసి ప్రణాళిక ప్రకారం స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో కొనసాగుచున్నది. 







Wednesday, July 27, 2022

VARALAKSHMI VRATARAM dt 29-7-2022 at SIVAM

 






శివమ్ లో శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం వరలక్ష్మి వ్రతం 

ఓం శ్రీ సాయిరాం 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,  భగవానుడు నడయాడిన శివం మందిర ప్రాంగణంలో  హైదరాబాద్ లో గల, సత్య సాయి సేవా సంస్థలు, 16 సమితిలో, మొదటి శుక్రవారం, అనగా ఈ రోజు    కోటి సమితి సమితి, హిమాయత్నగర్ గాంధీ నగర్ సమితి, సీతాఫలమండి సమితి వరలక్ష్మి వ్రతం లో పాల్గొన్నారు. ఈ ఉదయం 9-30 గంటలకు  శివమ్ గర్భగుడి నుండి వూరేగింగా  ఈ కార్యక్రమం కన్నా  ముందుగా అందరూ శివం లో గల  వినాయకుడు విగ్రహం దగ్గర నుంచి ప్రారంభించి శివమ్  మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి   సాయి గాయత్రి మంత్రాలు వేదమంత్రాలు ఉచ్చరించుచు స్వామివారికి పూర్ణకుంభ తో స్వా గతం పలికి అందురు కలసి జ్యోతి ప్రకాశనం గావించి,  కార్యక్రమానికి ఆసీనులై నారు. 

ఈ నాలుగు సమితులు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి, శివం భజన మందిర  ప్రాంగణంలో ఎంతో శ్రద్ధాభక్తులతో మొదటి శుక్రవారం  శ్రావణ మంగళ గౌరీ వ్రతం, స్వామి వారి చిరకాల భక్తులు, శ్రీ  మంగళపల్లి రామకృష్ణ శర్మ గారు వారి డైన శైలిలో  వినాయక పూజా తో, మొదలుపెట్టి  స్త్రీలకు సర్వసుఖాలు, సౌభాగ్యాన్నిచ్చే వరలక్ష్మీ వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడని శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి చెప్పిన కథను  వరలక్ష్మి వ్రతం - పూజ, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఆష్టోత్తరం,వరలక్ష్మి ఆష్టోత్తరం,  శ్రీ లక్ష్మి కుంకుమార్చన, సామూహికంగా  లలితా సహస్రనామ పారాయణం  అందరిని   అత్యద్భుతంగా ఆకట్టుకుంది. 


ఈ రోజు ముఖ్యలుగా స్వామి చిర కాల భక్తురాలు శ్రీమతి రేవతి గారు, శివమ్ భజన  సింగర్   శ్రీమతి శర్మదా గారు, హైదరాబాడ్ డిస్ట్రిక్ట్ ఆధాత్మిక విభాగ సమన్వయ కర్త      శ్రీమతి కామేశ్వరి గారు శ్రీమతి శేషవల్లి  గారు, హైదరాబాడ్ డిస్ట్రిక్ట్ మహిళా సేవాదళ్ సమానవ్యకర్త   శ్రీమతి శశి గారు,  హిమాయత్నగర్, గాంధీ నగర్, సీతాఫలమండి మరియు, కోటిసమితి మహిళా సభ్యులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు. 

ఏంతో సంతోషముతో వారి వారి ఇండ్లలో తయారు చేసిన ప్రసాదాలను స్వామి వారికీ అందరు కలసి, నైవేద్యముగా సమార్పణ గావించి,  స్వామి వారికీ అందరు కలసి మంగళ హారతి సమర్పణతో  సమర్పతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 
ఫోటోలు పంపద మైనది. 





Thursday, July 7, 2022

Thursday, July 7, 2022 ఒక సమితి పిల్లలు, వేరొక సమితి పిల్లలకు గ్రూపు 3 విద్యార్ధులు గాయత్రి మంత్రం – విశిష్టతను 5 బోధనా పద్దతలలో, ఆన్లైన్ లో చెప్పటమే ప్యూపిల్ - టీచర్ ట్రాన్స్పోసిషన్ ప్రోగ్రాం. Pupil-Teacher Transposition Program 10-7-2022 @ 11-00 AM TO 12-30 NOON

 

గురుపూర్ణిమ వేడుకలలో భాగంగా ఈ రోజు ఆషాడ ఏకాదశి తోలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, Pupil-Teacher Transposition Program ఒక సమితి పిల్లలు, వేరొక సమితి పిల్లలకు గ్రూపు 3 విద్యార్ధులు గాయత్రి మంత్రం – విశిష్టతను 5 బోధనా పద్దతలలో, ఆన్లైన్ లో చెప్పటమే ప్యూపిల్ - టీచర్ ట్రాన్స్పోసిషన్ ప్రోగ్రాం. Pupil-Teacher Transposition Program 

10-00 TO 11-30  అంబర్పేట్ విద్యార్థులు(గురు సమితి )   - కోటి సమితి, విద్యార్థులకు  మరియు దిల్ సుఖ్ నగర్ విద్యార్థులకు భోధించెదరు.
 
11-00  - 12-30 తరువాత కోటి సమితి విద్యార్థులు(గురు సమితి స్థానంలో  - అంబర్పేట్, మరియు మారేడ్పల్లి విద్యార్థులకు బోధించెదరు. 

ఈ నాటి  కార్యక్రమము ఓంకారం,  గణపతి ప్రార్థన,  గణపతి అధర్వణ శీర్షం, భజనలు-4 తో ప్రారంభమై ఈ విధముగా కొనసాగినది. 

మాస్టర్ లీలాధర్ - గాయత్రీ అమ్మవారి రూపమును, మంత్రమును,  మనస్సులోనే చిత్రీకరించి మనో నేత్రాలతో చూసుకొనుటనే విజువలైజషన్ - అతి సుందరముగా చిత్రీకరించినట్లుగా న్యాయ నిర్ణేతగా విచ్చేసిన శ్రీమతి భాగ్యలక్ష్మిగారు తెలిపారు.   

మాస్టర్ ప్రణవ్ గాయత్రీ మంత్ర విశిష్టత - పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా, అద్భుతంగా విపులముగా, వివరించినట్లు భాగ్యలక్ష్మిగారు తెలిపారు.   


చిరంజీవి జయ గాయత్రీ నాగ - జయ శారదే - జయ శారదే అనే భజనను చక్కగా వివరించగా, దిల్ సుఖఃనగర్ బాలవికాస్ విద్యార్థులు, మరియు మారేడ్పల్లి విద్యార్థులు చప్పట్లతో, అనందం వ్యక్తం చేశారు. 

మాస్టర్ సాయి గుప్త, స్వామి వారి దివ్యసందేశముల ఆధారముగా ఒక అద్భుతమైన లీల చెప్పి అందరి మన్నలను పొందినాడు. 

సాయిరూప గాయత్రీ మంత్రం జపించడంవల్ల తనకు కలిగిన అనుభవమును తెలిపి అందరు గాయత్రీ మంత్రం రోజు జపించే విధంగా తెలియజేసారు.  

మాస్టర్ హేమంత్ - తొలుతగా నిర్వహించిన వారి సంభాషణముల నాధారంగా - ఆక్టివిటీ నిర్వహించి ప్రశ్నలు వేసి, వారిని మరింత ఉత్సహము తో ఉండే విధముగా వారి ఆక్టివిటీ కొనసాగినది. 

శ్రీ సత్య సాయి భద్ర దేవి  పద్య సూక్తిని మరియు పద్యార్ధమును వివరాయించారు. 

అన్ని బోధనాంశముల భోధన అనంతరం మా న్యాయ నిర్ణేతలు శ్రీమతి భాగ్యలక్ష్మిగారు మాట్లాడుతూ, పిల్లలందరూ చాల బాగా మాట్లాడినారని, యెంత గానో మెచ్చుకున్నారు. 

కోటి సమితి సమితి కన్వీనర్ చివరగా మాట్లాడుతూ, విద్యార్థులంతా బాగా వున్నకొద్దీ సమయంలో, ఏంతో చక్కగా కార్యక్రమమును, ఏంతో క్రమశిక్షణతో, డిడికేషన్ తో, నిర్వహించారని, ఈ కార్యక్రమాన్ని అంతా దిగ్విజముగా కొనసాగించిన స్వామికి అందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసికుంటూ, గురుపూర్ణిమ కార్యక్రమ వివరములు తెలిపిన అనంతరము స్వామి వారి విద్యాధార్థులంతా కలసి స్వామివారికి మంగళహారతి సమర్పణతో ముగిసినది. 

జడ్జి గారి ప్రసంగం


























శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...