Thursday, February 25, 2021

BHAGAWATHA VAAHINI PARAYANAM FROM 25-2-2021 ONWARDS.

 

భాగవత వాహిని 

స్వామి దివ్య ఆశీస్సులతో  నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 

11 మంది గ్రూప్ లీడర్స్ 



VIDEO LINK:

25-1-2021 : PAGE 1 TO 13 PAGES: అవతార తత్వం 




Monday, February 22, 2021

SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM PREMA ISTI -DT 24-2-2020 3-30 PM TO 5 PM.

SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM PREMA ISTI 


SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM

PREMA ISTI -

DT 24-2-2020  3-30 PM TO 5 PM. 

PL CIRCULATE ALL THE PARTICIPANTS OF THE PROGRAM. 

Smt  Nagamani - Ayodhya Kanda  Smt Syamala - Mandodari  Smt Bhuvaneswari - Vibheeshana Saranagati  Smt Nirmala - Sundarakanda  Smt Saraswati Prasad - Sri Rama Jananam Sri Ram    Sukshma Deham Smt Rajeswari - Sugreevudu Smt Bhavani - Bharatudu SRI RAMANUJAYYA - SMT PRASHANTI - USA Smt Annapoorna - Overall general view, Sri T V Subrahmanayam,  Sri VVSN Reddy, Sri Kota Siva Kumar, & Finally Sri VSR Moorthy Garu. 

Sai Ram. 

 All are requested to join online and listen to the participant's view and seek the blessings of Bhagwan Baba

Participants  are also invited to share/ express their feelings by recording them and place it in the group(not exceeding more than 2 minutes) so as to enable to play it on Wednesday ON 24-2-2021

Once again All are requested to make a note of this and respond accordingly.

MAIN SPEAKER OF THE DAY

SRI VSR MOORTHY GARU 


24-2-2021 program link 

MAHILA PUJA 22-2-2021 AND 7-3-2021 AT SIVAM.

        7-3-2021  MAHILA POOJA AT THE RESIDENCESES & AT SIVAM. 








సాయిరాం, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ ఆశీర్వాదంతో ఈరోజు అనగా 7-3-2021 న  కోటి సమితి తరపున స్వామివారి  షోడశోపచార పూజ చేసుకునే చేసుకున్న వారు  ( శైలేశ్వరం కల్పన వేణి గార్లు.   ఎంతో ప్రేమతో స్వామివారికి  శ్రీ పురుషసూక్త సమేత అభిషేకము, స్వామి వారి అష్టోత్తరం, కుంకుమార్చన చేసాము. మహానైవేద్యము స్వామి వారికీ మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 
సాయిరాం.


==========================================================



  22-2-2021 MAHILA POOJA AT THE RESIDENCESES & AT SIVAM. 


శ్రీమతి భువనేశ్వరి గారు, విజయ లక్ష్మి గారు , సీతా మహాలక్ష్మి గారు, వాణి గారు శివం లో స్వామికి భక్తిశ్రద్ధలతో షోడశోపచార పూజ చేసుకున్నారు మహా నైవేద్యం, హారతి విభూతి ప్రసాదం స్వీకరించారు. 

 శ్రీమతి భువనేశ్వరి గారు హారతి స్వామికి సమర్పించారు

ఈ ఫై కార్యక్రమంలో భాగంగా మన కోటి సేవాసమితి కన్వీనర్  విశ్వేశ్వర శాస్త్రి  సేవాదళ్ సభ్యులు శ్రీ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. 

25 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని  స్వీకరించారు  స్వామివారి దయతో మాఘమాసం శుక్లపక్షం దశమి సోమవారం మృగశిరా నక్షత్రం తదనంతరం, సోమవారం ప్రదోషం లో ఆరుద్ర నక్షత్రం రోజున మరియు శారదా నవరాత్రుల్లో దశమి రోజున స్వామివారి కృపాకటాక్షణాలతో దిగ్విజయంగా జరిగినది, స్వామివారికి కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటూ జై సాయిరాం. 

ఓం శ్రీ సాయిరాం 22 ఫిబ్రవరి 2021 మన కోటి సేవా సమితి కి స్వామి శివం లో మహిళలకు ప్రసాదించిన షోడశోపచార పూజలు శ్రీమతి పి సీత గారు, శ్రీమతి  శ్యామల గారు ఇంట్లోనే ఉండి స్వామికి భక్తి ప్రేమలతో షోడశోపచార పూజ చేసుకున్నారు ఆ పూజ ఫోటోలు పైన చూడగలరు. 

----000---

Friday, February 19, 2021

Balvikas Gurus Training at Sivam. 21-2-2021

21-2-2021.  

Balvikas Gurus Training at Sivam. 

The following Mahilas have nominated for Balvikas Gurus Training Program. to be held on 21-2-2021 

Hearty Congratulations to one all... All the best. to all. 

1.Sailakshmi  2. Suneetha  3.Neelima  4 .Indira  5. Kusuma  6.Bhuvaneswari  7. Shalini 

Smt Kusuma and Smt Shalini have not attended the program. 

Kum Swathi Priyanka has also participated in the program. 

Smt Sri Sithamahalakshmi, Smt Renuka have also attended as Sevadal Members. 



Sairam Sir,  with Divine Blessings of Swami, the Bala Vikas new guru's training was conducted on 21st Feb,2020 by the district team from 10 am to 1pm. The class was taken by Lakshmi Gollapudi, the activity session was conducted by Swati Priyanka. Malliswari Garu from mehdipatnam samithi and Sri Sai Gollapudi from khairatabad Samithi shared their experiences and thoughts. We had Smt. Indira, Smt.Neelima, Smt. Sunitha, Smt. Bhuvaneshwari, Kum. Sai lakshmi from koti Samithi  who took part in the training. Smt. Renuka and Smt. ASSM Lakshmi attended for service on the occasion. All the participants were given a diary, a pen and prasadam(lunch) was also provided by them. Thank you for the great opportunity given by Swami. Sairam

ఓం శ్రీ సాయిరాం శివం లో బాల్ వికాస్ క్లాసులో21/2/2021 లో కొత్తగా బాలవికాస్ గురువులుగా వెళ్తున్న గురువులకు ఇప్పటికే గురువులుగా స్వామి సంస్థలలో సేవా భాగ్యం పొందిన శ్రీ మతి గొల్లపూడి లక్ష్మి, శ్రీ గొల్లపూడి సాయి గార్లు మా అందరి కాబోయే గురువులకు ప్రబోధించిన బోధనలు జై సాయిరాం
 హైదరాబాదులోని 17 శ్రీ సత్యసాయి సేవా సమితి లలో 260 బాలవికాస్ సెంటర్ లు కలవు
: శ్రీమతి గొల్లపూడి లక్ష్మీ గారు ఖైరతాబాద్ సమితిలో 10 సంవత్సరాల అనుభవం ఉంది
బాల్ వికాస్ లో గ్రూప్ 1,2,3, విభాగములు కలవు
: శ్రీ సత్య సాయి బాల్ వికాస్ ఉద్దేశ్యాలు
1 పిల్లలలో నైతిక ప్రవర్తన
2 మన సాంప్రదాయం
3 తెలుగు పద్యాలు సూక్తులు నేర్చుకోవడం
4 క్రమశిక్షణ, శారీరిక శుభ్రత , సహాయం చేయడం, మొదలైన మంచి అలవాట్లు పెంపొందించడం. 
 5, మంచి విషయాలు ప్రబోధించడం
 
6. పిల్లలు skip  అవ్వకుండా చూసుకోవాలి సుకోవాలి
7. మనకి attract అయ్యేటట్టు చూసుకోవాలి
8. బాలవికాస్ ఎట్లా చెప్తే వింటారు పిల్లలు
9. ఆధ్యాత్మికంగా ఎలా తీసుకెళ్లాలి
10.గొప్ప పిల్లలు వద్దు మంచి పిల్లలు కావాలి ఉపకారం చేయాలి
11.సినిమాలు, క్రికెట్, కంప్యూటరు, సెల్లు వలన పాడవకుండా వాళ్లకి గైడెన్స్ ఇవ్వాలి
12, స్లో బాలవికాస్ ఉండాలి
13. నామస్మరణ అలవాటు చేయాలి
14. గుడ్ సిటిజెన్స్ గా ఉండాలని చెప్పాలి
15.ప్రేమగా ఉండాలి వాళ్ళ మనసులో మాట తల్లిదండ్రులకు,  బాల్ వికాస్ గురువుకి చెప్పే ఈ విధంగా ట్రైన్ చేయాలి
16,.తల్లిదండ్రులను గౌరవించాలి
17.ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి
 18. పెద్ద వాళ్లకి హెల్ప్ చేయాలి
19.భగవంతుడి పైన విశ్వాసం ప్రేమ ఉండాలి
20. బాల్ వికాస్ క్లాసు గంటన్నర తీసుకోవాలి
21.మొత్తం ఫ్యామిలీ సహాయం చేయాలి
22. కథలు చెప్పాలి
23. భజనలు భగవంతుని పాటలు, దేశభక్తి గీతాలు నేర్పాలి
24.చిన్న చిన్న నాటికలో పాత్రలు ఇచ్చి వేషధారణ చేయించాలి మరియు పప్పెట్స్ ఉపయోగించాలి. 

గురువు ఏ విధంగా ఉండాలి పిల్లలతో అనే మార్గదర్శకాలు గురువులకి
1. ఫీల్డ్ ట్రిప్ లకి తీసుకువెళ్లాలి
2 .ఫీల్డ్ ట్రిప్ లో ఒక మెసేజ్ వాళ్లకి నేర్పాలి మరియు స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు చు
3. ఫుడ్ పేద వాళ్లకి పంచడం దానిద్వారా ఆనందం ఎట్లా వస్తుంది అన్నది వాళ్ళు ఫీల్ అయ్యేటట్లు చూడాలి
4. పిల్లలు అన్ని వస్తువులు కావాలని అడుగుతారు మనకన్నా తక్కువ సంపాదన వాళ్ళు ఎంత హ్యాపీ గా ఉంటున్నారు అన్నది వాళ్లకి తెలియచెప్పాలి ఫీల్డ్ ట్రిప్ ద్వారా
5. పిల్లల దగ్గర ఉన్న స్కూలుకు సంబంధించిన పాత పుస్తకాలు , బ్యాగులు, స్కూల్ డ్రెస్సులు లు, పుస్తకాలు అవి పంచడం నేర్పాలి
 6. సత్యమంటే ధర్మమంటే వాళ్లకి తెలియజేయాలి
7. ఒక క్లాసు మనం చెప్తున్నానంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు ప్రిపేర్ అవ్వాలి. 

Saturday, February 6, 2021

TANDULARCHANA 7-2-2021


 


ARRANGEMENT MADE FOR 4 0 MEMBERS KEEPING IN MIND ALL THE CARONA INSTRUCTIONS. 









ఓం శ్రీ సాయిరాం 🙏
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ప్రేమాశీస్సులతో ఈ రోజు అనగా తేదీ.07.02.2021.అదివారం నాడు ఉ.10.00 గం. కు, శ్రీ సత్యసాయి సేవా కోటి సమితి లో తండులార్చన కార్యక్రమము అత్యంత భక్తి శ్రద్దలతో  జరిగినది.  బాలవికాస్ విద్యార్థులు,వారి తల్లిదండ్రులు, గురువులు,సేవాదల్ సభ్యులు చాలా ఉత్సాహంగా ,ఆనందంగా, పాల్గొన్నారు. అందరికి ఒక ప్లేట్, బియ్యము, పంచముఖి స్వరూపాణి వేదమాత అయినా గాయత్రి మాట హృదయ మాధ్యమందు భాగగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు వున్నా రూపమును ధ్యానించుటకు వీలుగా స్వామి వారి చిత్ర పటము లామినేట్ చేసినది అందరికి ఇచ్చిన దానిని పూజ గావించారు.  తొలుతగా, జ్యోతిప్రకాశం గావించిన తదుపరి, గాయత్రీ మంత్రం విశిష్టత, సాయి గాయత్రీ మంత్రం విశిష్టత వివరించిన తరువాత కార్యక్రమములో పాల్గొన్నారు. 


ఈనాటి తణ్డులార్చన కార్యక్రమములో, పూర్వ బాలవికాస్, విద్యార్థిని, చిరంజీవి గ్రీష్మ, చిరంజీవి, లలిత్ దివ్యాన్గ్, కార్యక్రములో పాల్గొని, ప్రస్తుతం వారు ఇంజనీరింగ్ చదువుతున్నట్లు, బాలవికాస్, తరగతులు వారికీ, ఎంతగానో, ప్రయోజనాన్ని చేకూర్చినవని, ఇది అంతా స్వామి వారి దివ్య అనుగ్రహమని, అన్నారు. వారి తల్లి తండ్రులు, వినయ్ మరియు శ్రీమతి వేణి గార్లు, మాట్లాడుతూ, పిల్లలు ఏంతో వినయ విధేయలతో ఉంటారని, తండ్రి మాటకు జయ దాటరని, తెలిపారు. 

స్వామి వారు బాలవికాస్ విద్యార్థులను, గురువులను, తల్లిదండ్రులను ఉద్దేశించి, ప్రసంగంలోని కొన్ని, ముఖ్యమైన విషయాలను (clippings) వినిపించాను. 




ప్రస్తుతమున్న బాలవికాస్ విద్యార్థిని, చిరంజీవి సత్యసాయి భద్రా దేవి గురువు ఈ కరోనోలో ఆన్లైన్లో చెప్పిన అంశాలన్నిటినీ విశదీకరించి తెలిపారు. శ్లోకాలు, పద్యాలు, అన్ని పాడి వినిపించారు. 

బాలవికాస్ గురువు పేరెంట్స్ ను ఉద్దేశించి, మాట్లాడుతూ, పిల్లలను సమయపాలన గావించుటలో తోడ్పడాలన్నారు. అదేవిధముగా బాలవికాస్, తరగతి లో నేర్చుకున్న విషయాలను, క్లాస్ నుండి రాగానే, అడిగి తెలుసుకోమ్మన్నారు. 

శ్రీ వినయ్ కుమార్ మరియు, శ్రీ శ్రీనివాస్ గార్లు స్వామి వారికీ మంగళ హారతి సమర్పణ గావించారు. 

శ్రీ సాయి గాయత్రి, తణ్డులార్చన గావించిన బియ్యమును అప్పటికప్పుడు, ఎలక్ట్రిక్ రైస్ కూక్కుర్లో, ఉడికించి, తరువాత, తగిన మోతాదులో బెల్లం వేసి, , నైవేద్యముగా నివేదించి, బ్రహ్మార్పణం గావించి, అందరికి ప్రసాదంతో పాటు, పరీక్షలు బాగా వ్రాయాలని, స్వామివారిని ప్రార్ధించి, ఉంచిన కలములను (pens) ను, ఇవ్వడమైనది. 

కార్యక్రమములో పాల్గొనలేకపోయిన వారు, క్రింద నున్న లంకె ను నొక్కండి, చూడండి. సాయిరాం. 
 



భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి పాద పద్మములకు శత  కోటి ప్రణామములు. సాధన వలన మాత్రమే మానవుడు  భావంతుని చేరగలడు.  భావంతుని పూజించడము కూడా ఓక సాధనే. పూజ చేయడము అంటే అర్చించడము. నవ విధ భక్తి మార్గాలలో అర్చన 5 వది. పొతన గారు చెప్పారు “ చేతులారంగా శివుని పూజింపఁడేని, నోరు  నొవ్వంగ హరి కీర్తి నుడువఁడేని “ అని. 


స్వామి కూడా మన బాలవికాస్ పిల్లలకు చెప్పారు కదా, చేతులు నిచ్చినదేందుకో తెలుసా? మూతికి ముద్దదండించుటకా, కాదు కాదు పతిత పావడునైన శివుని పూజ చేసేందుకు. 


 తండులము అనగా బియ్యము. తణ్డులార్చన అనగా బియ్యముతో అర్చన, అంటే పూజ చేయడం. బియ్యమే ఎందుకు? బియ్యాన్ని ధవళ అక్షితలు అంటారు. అక్షితలు అంటే క్షయము కానిది. అంటే దేని నుండి  క్షయము ( కట్ ) చేయలేనటువంటిది. 


బియ్యాన్ని వడ్లలోనుంచి తీస్తారు. . వడ్లగింజ భూమిలో పెడితే మొలకెత్తుతుంది. కానీ బియ్యం గింజలు మొలకెత్తవు. అవి ఎప్పటికి మార్పు చెందవు. “ అన్నం బహు కుర్వీత” అనగా ఓ భగవంతుడా ఈ అన్నాన్ని నీవే సృస్టించావు. సృటించే వాటిని పెంపొందించావు. అందువలన అన్నం పరబ్రహ్మ స్వరూపం అయినది. ఈ అన్నం బియ్యం నుంచి వస్తుంది కాబట్టి బియ్యాన్ని మాత్రమే ఈ అర్చనలో వాడుతాము. స్వామి వారు మనకు తెలియజేసారు. ఏంతో విశేషమైన బియ్యన్ని మనము భావంతునికి సమర్పించుచున్నాము. ఇలా సమర్పిస్తున్న సమయంలో బియ్యంలోనికి ఏంతో పవిత్రమైన, దివ్యమైన, తరంగాలు, చేరుతాయి. అంతటి దివ్యమైన బియ్యని వండి ప్రసాదంగా మనము భుజించుట వలన మంచి ఆలోచనలు, మంది సంస్కారాలు, వస్తాయి. భగవంతుని అనుగ్రహం కలుగుతుంది మరియు వారికీ ఆహారము అక్షయమై ఎప్పుడు, లోటు ఉండదు. దీని వలన మనము గ్రేట్ మ్యాన్ గా కాదు, స్వామి కి కావలసినట్లుగా, గుడ్ మయంగా తయారుఅవుతాము.


సాధారణంగా, అందరం రకరకాల పువ్వులతో, భగవంతుని పూజిస్తాము. ఈ రంగురంగుల అందమైన పూలు, భగవంతుని పాదాలు చేరగానే, ఆ పూలకు పుణ్యం ప్రాపిస్తుంది. దాని వలన ఆ పూవుకు, మరియొక్క ఉత్కృష్టమైన జన్మ లభిస్తుంది. పూజ చేసిన పూలు, తరువాత రోజుకి పాడైపోతాయి. కానీ విబియ్యం ఎప్పటి మార్పు చెందవు.


మన స్వామి దగ్గర కూడా కొందరు మహానుభావులు ఈ తణ్డులార్చన సాధన చేసినవారు వున్నారు. అందులో తెనాలి దగ్గర ఒక పల్లెటూరికి చెందిన కుందుర్తి వెంకట నరసయ్య పాకేజీ అనే భక్తుడు, బియ్యంతో, శ్రీ రామ నామమును చెప్పి, ఆ బియ్యండి తానూ స్వయంగా స్వయంపాకం చేసుకునేవారట. ఆయన్ని మం స్వామి శ్రీ రామ్ శరణ్ అనే పిలిచేవారట. ఆయనకీ, స్వామి శ్రీ రామచంద్రమూర్తి దర్శన భాగం కూడా ప్రసాదించారు. ఆయన్ని చూడగానే, స్వామి ఓ నీవు, రామనామాన్ని చిప్పిన బియ్యాన్ని మాత్రమే ఆహారంగా చేకుంటావు కాదా అనేవారట. అలాగే డాక్టర్ పూర్ణశ్రీ గారు కృష్ణ నామస్మరణతో, బియ్యము గింజలు, ఏరి వాటిని వండి భుజించేవారు.


ఈ రంగుళార్చన మనము, పిల్లలకి, చెప్పి చాలా శ్రద్దగా బియ్యాన్ని, క్రింద పడకుండా, స్వామికి సమర్పించాలి. అందువలన ఏకాగ్రతతో, పవిత్రంగా, అర్చన చేయాలి.


మనము కూడా ప్రతిరోజూ ఇంట్లో తణ్డులార్చన చేని ఆ బియ్యంతో వంట చేస్తే, తిన్న వారికి సాత్విక గుణాలు అభివృద్ధి అవుతాయి.






DASARA CELEBRATIONS AT SIVAM. FROM 3-10-2024 TO 12-10-2024 - KOTI SAMITHI SAMITHI DATES. 6TH, 7TH, 12TH,

  ఓం శ్రీ సాయిరాం  ఆదివారము 6-10-2024 న రోజున మహాలక్ష్మి అలంకరణ.  ఉదయం 7 గంటల నుండి, 1 గంట వరకు శివమ్ మందిరంలో సేవ మన కోటి సమితికి కేటాయించబ...