Saturday, February 6, 2021

TANDULARCHANA 7-2-2021


 


ARRANGEMENT MADE FOR 4 0 MEMBERS KEEPING IN MIND ALL THE CARONA INSTRUCTIONS. 









ఓం శ్రీ సాయిరాం 🙏
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ప్రేమాశీస్సులతో ఈ రోజు అనగా తేదీ.07.02.2021.అదివారం నాడు ఉ.10.00 గం. కు, శ్రీ సత్యసాయి సేవా కోటి సమితి లో తండులార్చన కార్యక్రమము అత్యంత భక్తి శ్రద్దలతో  జరిగినది.  బాలవికాస్ విద్యార్థులు,వారి తల్లిదండ్రులు, గురువులు,సేవాదల్ సభ్యులు చాలా ఉత్సాహంగా ,ఆనందంగా, పాల్గొన్నారు. అందరికి ఒక ప్లేట్, బియ్యము, పంచముఖి స్వరూపాణి వేదమాత అయినా గాయత్రి మాట హృదయ మాధ్యమందు భాగగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు వున్నా రూపమును ధ్యానించుటకు వీలుగా స్వామి వారి చిత్ర పటము లామినేట్ చేసినది అందరికి ఇచ్చిన దానిని పూజ గావించారు.  తొలుతగా, జ్యోతిప్రకాశం గావించిన తదుపరి, గాయత్రీ మంత్రం విశిష్టత, సాయి గాయత్రీ మంత్రం విశిష్టత వివరించిన తరువాత కార్యక్రమములో పాల్గొన్నారు. 


ఈనాటి తణ్డులార్చన కార్యక్రమములో, పూర్వ బాలవికాస్, విద్యార్థిని, చిరంజీవి గ్రీష్మ, చిరంజీవి, లలిత్ దివ్యాన్గ్, కార్యక్రములో పాల్గొని, ప్రస్తుతం వారు ఇంజనీరింగ్ చదువుతున్నట్లు, బాలవికాస్, తరగతులు వారికీ, ఎంతగానో, ప్రయోజనాన్ని చేకూర్చినవని, ఇది అంతా స్వామి వారి దివ్య అనుగ్రహమని, అన్నారు. వారి తల్లి తండ్రులు, వినయ్ మరియు శ్రీమతి వేణి గార్లు, మాట్లాడుతూ, పిల్లలు ఏంతో వినయ విధేయలతో ఉంటారని, తండ్రి మాటకు జయ దాటరని, తెలిపారు. 

స్వామి వారు బాలవికాస్ విద్యార్థులను, గురువులను, తల్లిదండ్రులను ఉద్దేశించి, ప్రసంగంలోని కొన్ని, ముఖ్యమైన విషయాలను (clippings) వినిపించాను. 




ప్రస్తుతమున్న బాలవికాస్ విద్యార్థిని, చిరంజీవి సత్యసాయి భద్రా దేవి గురువు ఈ కరోనోలో ఆన్లైన్లో చెప్పిన అంశాలన్నిటినీ విశదీకరించి తెలిపారు. శ్లోకాలు, పద్యాలు, అన్ని పాడి వినిపించారు. 

బాలవికాస్ గురువు పేరెంట్స్ ను ఉద్దేశించి, మాట్లాడుతూ, పిల్లలను సమయపాలన గావించుటలో తోడ్పడాలన్నారు. అదేవిధముగా బాలవికాస్, తరగతి లో నేర్చుకున్న విషయాలను, క్లాస్ నుండి రాగానే, అడిగి తెలుసుకోమ్మన్నారు. 

శ్రీ వినయ్ కుమార్ మరియు, శ్రీ శ్రీనివాస్ గార్లు స్వామి వారికీ మంగళ హారతి సమర్పణ గావించారు. 

శ్రీ సాయి గాయత్రి, తణ్డులార్చన గావించిన బియ్యమును అప్పటికప్పుడు, ఎలక్ట్రిక్ రైస్ కూక్కుర్లో, ఉడికించి, తరువాత, తగిన మోతాదులో బెల్లం వేసి, , నైవేద్యముగా నివేదించి, బ్రహ్మార్పణం గావించి, అందరికి ప్రసాదంతో పాటు, పరీక్షలు బాగా వ్రాయాలని, స్వామివారిని ప్రార్ధించి, ఉంచిన కలములను (pens) ను, ఇవ్వడమైనది. 

కార్యక్రమములో పాల్గొనలేకపోయిన వారు, క్రింద నున్న లంకె ను నొక్కండి, చూడండి. సాయిరాం. 
 



భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి పాద పద్మములకు శత  కోటి ప్రణామములు. సాధన వలన మాత్రమే మానవుడు  భావంతుని చేరగలడు.  భావంతుని పూజించడము కూడా ఓక సాధనే. పూజ చేయడము అంటే అర్చించడము. నవ విధ భక్తి మార్గాలలో అర్చన 5 వది. పొతన గారు చెప్పారు “ చేతులారంగా శివుని పూజింపఁడేని, నోరు  నొవ్వంగ హరి కీర్తి నుడువఁడేని “ అని. 


స్వామి కూడా మన బాలవికాస్ పిల్లలకు చెప్పారు కదా, చేతులు నిచ్చినదేందుకో తెలుసా? మూతికి ముద్దదండించుటకా, కాదు కాదు పతిత పావడునైన శివుని పూజ చేసేందుకు. 


 తండులము అనగా బియ్యము. తణ్డులార్చన అనగా బియ్యముతో అర్చన, అంటే పూజ చేయడం. బియ్యమే ఎందుకు? బియ్యాన్ని ధవళ అక్షితలు అంటారు. అక్షితలు అంటే క్షయము కానిది. అంటే దేని నుండి  క్షయము ( కట్ ) చేయలేనటువంటిది. 


బియ్యాన్ని వడ్లలోనుంచి తీస్తారు. . వడ్లగింజ భూమిలో పెడితే మొలకెత్తుతుంది. కానీ బియ్యం గింజలు మొలకెత్తవు. అవి ఎప్పటికి మార్పు చెందవు. “ అన్నం బహు కుర్వీత” అనగా ఓ భగవంతుడా ఈ అన్నాన్ని నీవే సృస్టించావు. సృటించే వాటిని పెంపొందించావు. అందువలన అన్నం పరబ్రహ్మ స్వరూపం అయినది. ఈ అన్నం బియ్యం నుంచి వస్తుంది కాబట్టి బియ్యాన్ని మాత్రమే ఈ అర్చనలో వాడుతాము. స్వామి వారు మనకు తెలియజేసారు. ఏంతో విశేషమైన బియ్యన్ని మనము భావంతునికి సమర్పించుచున్నాము. ఇలా సమర్పిస్తున్న సమయంలో బియ్యంలోనికి ఏంతో పవిత్రమైన, దివ్యమైన, తరంగాలు, చేరుతాయి. అంతటి దివ్యమైన బియ్యని వండి ప్రసాదంగా మనము భుజించుట వలన మంచి ఆలోచనలు, మంది సంస్కారాలు, వస్తాయి. భగవంతుని అనుగ్రహం కలుగుతుంది మరియు వారికీ ఆహారము అక్షయమై ఎప్పుడు, లోటు ఉండదు. దీని వలన మనము గ్రేట్ మ్యాన్ గా కాదు, స్వామి కి కావలసినట్లుగా, గుడ్ మయంగా తయారుఅవుతాము.


సాధారణంగా, అందరం రకరకాల పువ్వులతో, భగవంతుని పూజిస్తాము. ఈ రంగురంగుల అందమైన పూలు, భగవంతుని పాదాలు చేరగానే, ఆ పూలకు పుణ్యం ప్రాపిస్తుంది. దాని వలన ఆ పూవుకు, మరియొక్క ఉత్కృష్టమైన జన్మ లభిస్తుంది. పూజ చేసిన పూలు, తరువాత రోజుకి పాడైపోతాయి. కానీ విబియ్యం ఎప్పటి మార్పు చెందవు.


మన స్వామి దగ్గర కూడా కొందరు మహానుభావులు ఈ తణ్డులార్చన సాధన చేసినవారు వున్నారు. అందులో తెనాలి దగ్గర ఒక పల్లెటూరికి చెందిన కుందుర్తి వెంకట నరసయ్య పాకేజీ అనే భక్తుడు, బియ్యంతో, శ్రీ రామ నామమును చెప్పి, ఆ బియ్యండి తానూ స్వయంగా స్వయంపాకం చేసుకునేవారట. ఆయన్ని మం స్వామి శ్రీ రామ్ శరణ్ అనే పిలిచేవారట. ఆయనకీ, స్వామి శ్రీ రామచంద్రమూర్తి దర్శన భాగం కూడా ప్రసాదించారు. ఆయన్ని చూడగానే, స్వామి ఓ నీవు, రామనామాన్ని చిప్పిన బియ్యాన్ని మాత్రమే ఆహారంగా చేకుంటావు కాదా అనేవారట. అలాగే డాక్టర్ పూర్ణశ్రీ గారు కృష్ణ నామస్మరణతో, బియ్యము గింజలు, ఏరి వాటిని వండి భుజించేవారు.


ఈ రంగుళార్చన మనము, పిల్లలకి, చెప్పి చాలా శ్రద్దగా బియ్యాన్ని, క్రింద పడకుండా, స్వామికి సమర్పించాలి. అందువలన ఏకాగ్రతతో, పవిత్రంగా, అర్చన చేయాలి.


మనము కూడా ప్రతిరోజూ ఇంట్లో తణ్డులార్చన చేని ఆ బియ్యంతో వంట చేస్తే, తిన్న వారికి సాత్విక గుణాలు అభివృద్ధి అవుతాయి.






3 comments:

  1. Dear Greeshma,n Lalitdivyan::
    Your, obedience,humility are the valuable certificates,,place you in unique n take to heights.DearSatyasaibhadradevi::
    You are really special child ideal to the budding generations.Please continue healthy n spiritual habits, Following the*Master*. success is yours in all endeavours.
    Dear Saigayatri:: సార్థక నామధేయురాలవు. నీలోని దివ్యత్వము నిన్ను ఆదర్శం అయినటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. Congratulations and best wishes to the Koti organisation for wonderful way of training and upbringing.🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయిరాం నమస్కారం సరస్వతి ప్రసాద్ ఆంటీ మీ దీవెనలు స్వామి దీవెనలు గా భావిస్తున్నాను జై సాయిరాం

    ReplyDelete
  3. శ్రీ సత్యసాయి భద్రాదేవి

    ReplyDelete

UGADI & SRIRAMA NAVAMI CELEBRATIONS AT SIVAM - BY GANDHI NAGR SAMITHI. 30-3-2025 BY GANDHINAGAR SAMTHI, AND MEHDIPATNAM SAMITHI.

 UGADI INVITATION From Convenor Brother Sri B V Madhusudhan  S/o Late Sri B V L Narasimha Rao Garu  Sairam Sir  We invite  you and all your ...