ఈ నాటి నగర సంకీర్తన నివేదిక. 16 -7 -2026
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు నగర సంకీర్తన ఎంతో భక్తి శ్రద్దలతో, ఉస్మాన్ గంజ్ లో గల వీధులలో జరిగినది. ఈ నాటి కార్యక్రమములో, మొత్తము 8 మంది భక్తులు పాల్గొన్నారు. ఉస్మాన్ గంజ్ లో గల శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ టైలోరింగ్, నుండి 21 సార్లు ఓంకారం, సుప్రభాతం, వేదపఠనం, ప్రారంభ మైనది.
నగర సంకీర్తన అంటే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో, భక్తులు కలిసి, భగవాన్ నామ స్మరణ చేస్తూ,వీధులలో భజనలు పాడటం. ఓంకారం, సుప్రభాతం, వేద పఠనం తరువాత గణేష్, గురు, మాత, భజనలు మరియు అనేక భజనలతో కొనసాగినది. చివరగా నరసింహ రావు స్వామి వారికీ మంగళహారతి సమర్పణతో, పాల్గొన్న ప్రతిఒక్కరు అందరు సంతోషించినారు.
పాల్గొన్న వారు.
1) కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి, 2) శ్రీ ఎం ఎల్ నరసింహ రావు, 3) వాసు, , 4 వెంకట లక్ష్మి గారు, 5) సాయి రూప, శ్రీనివాస రెడ్డి, శ్రీ చక్రధర్ అందరు ఎంతో ఆనందంతో, వచ్చే గురువారం, వారి స్నేహితులతో వస్తామన్నారు.
