Saturday, February 5, 2022
Wednesday, January 12, 2022
GAYATRI MANTRA CHANTING FROM 13-1-2022 ONWARD TILL 21ST FEB 2022.
హైదరాబాద్ జిల్లాలోని 16 సమితులలో ఉన్న శ్రీ సత్యసాయి సేవా సంస్థల భక్తులు,సాయి కుటుంబ సభ్యులు అందరికీ సాయిరాం.ప్రస్తుతము ఉన్నటువంటి విపత్కర పరిస్థితులలో,లోకక్షేమంకోసం, సామూహికంగా గాయత్రి మంత్రము ఒకే సమయములో జపించిన ఆ మంత్ర ప్రభావం వలన,ఉత్పన్నమయ్యే శక్తి తరంగాలవలన ప్రజల జీవితాలకి శాంతి,సంతోషం,మానసిక ప్రశాంతత లభిస్తుంది. మహా మహిమాన్వితమైన గాయత్రి మంత్ర సామూహిక జపము ఒకే సమయంలో చేసిన,ఆసాధకుల భౌతిక, మానసిక,ఆధ్యాత్మిక, మేధాశక్తులను,ఉత్తేజ పరుస్తుంది.ప్రాపంచిక విషయముల నుండి విముక్తడిని చేసి, దైవానికి సన్నిహితుల్ని చేస్తుంది.
భగవాన్ మనకు అందరికీ ఈ విధంగా ఆదేశించారు,తెల్లవారగట్ల ఒకే సమయంలో ఓంకారము,సుప్రభాతము చేయుట,మరియు సాయంత్రం ఒకే సమయంలో భజన చేయుట,ఈ విధంగా ఒకే సమయంలో గాయత్రి మంత్ర జపము చేయడం వలన ప్రతి కుటుంబ సభ్యులలో ఐకమత్యము మరింత బలపడుతుంది.
గత సంవత్సరం సామూహికంగా,ఒకే సమయంలో చేసిన ప్రార్థనా ఫలితం మన సంస్థలో ఇప్పటికే అందరూ రుచి చూసి ఉన్నారు.మరొక్కసారి ఆ ఫలాన్ని అందుకుందాము. ప్రజా క్షేమమునకు,దేశ సౌభగ్యమునకు,లోక కల్యాణం కోసం స్వామివారి ఆశీస్సులతో సంకల్పించుకున్న గాయత్రీ మంత్ర జపము 108 సార్లు,40 రోజులు,ప్రతీ రోజు ఉదయం 7 గం|| లకు చేద్దాము. ఈ బ్రహత్తర కార్యమును జనవరి 13వ తారీకు,గురువారము,వైకుంఠ ఏకాదశి పర్వదినమున మొదలుపెట్టి,ఫిబ్రవరి 21వ తారీకు సోమవారమున పూర్ణాహుతి తో సుసంపూర్ణం చేసుకుందాము.
ఈ పుణ్య కార్యక్రమం రేపటిరోజు ముక్కోటి ఏకాదశి,ఉదయం 7 గం లకు శివం మందిరంలో జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కార్యవర్గ బృంద సభ్యులు 108 సార్లు గాయత్రి మంత్ర జపము చేసి ప్రారంభం చేస్తారు. ఆసక్తి కలిగిన వారు శివంలో జరిగే గాయత్రి మంత్ర జపంలో పాల్గొనడానికి ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను.
(కొవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ.) మరుసటి రోజు నుండి సాయి కుటుంబ సభ్యులు,భక్తులు అందరూ ఎవరి ఇళ్ళల్లో వారు అంత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతీ రోజు ఉదయం 7 గం|| లకు ఈ గాయత్రీ మంత్ర జపము చేద్దాము. ఆ సాయిగాయత్రీమాత అనుగ్రహ ఆశీస్సులతో త్వరితగతిని ప్రపంచవ్యాప్తంగా,ఆరోగ్యకర పరిస్థితులు చక్కబడాలని కోరుతూ... జై సాయిరామ్. మీ సోదరుడు, A MALLESWARA RAO HYDERABAD DISTRICT PRESIDENT
Wednesday, December 29, 2021
SRI SATHYA SAI PUSTAKAALAYAM - PRARAMBHOSTAVAM 1-1-2022 AND INAUGURATION REPORT. & PRESS CLIPPINGS DT 2-1-2022
రిపోర్ట్ డేటెడ్ 1-1-2022
శ్రీ సత్య
సాయి సేవా సంస్థలు కోటి సమితి, హైదరాబాద్ ఆధ్వర్యంలో, ఆంగ్ల నూతన సంవత్సర ప్రారంభ వేళ, రెండు సెంటర్స్ లో “ శ్రీ సత్య సాయి పుస్తకాలయం
ప్రారంభోత్సవం, ఈ రోజు 1-1-2022 ఉదయం 1 గంటకు GUNFOUNDRY
లోని LIC క్వార్టర్స్ లో మరియు ఉస్మాన్
గంజ్ లోని, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, స్కిల్ డెవలప్మెంట్(టైలోరింగ్) సెంటర్ లో
“ శ్రీ సత్య సాయి పుస్తకాలయం ప్రారంభోత్సవం”1-1-2022
గావించబడినవి.
స్వామి వారి దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోఠి సమితి
ఆధ్వర్యంలో హైదరాబాద్ ఊస్మాన్గంజ్ తొప్ఖానాలో
గల స్కిల్ డెవలప్మెంట్(టైలోరింగ్) సెంటర్ లో
ఈ రోజు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను
నిరాడంబరంగా జరిగాయి . ఈ కార్యక్రమంలో టైలోరింగ్లో శిక్షణ పొందుతున్న
మహిళలు మరియు వారి పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి శ్రీమతి
పద్మావతి గారు , శ్రీమతి సుగుణ గారు, శ్రీ నరసింహారావు గారు, జ్యోతి ప్రకాశనం గావించిన అనంతరం
వేదము , భజన తో ప్రారంభం అయ్యి భగవాన్
శ్రీ సత్య సాయి బాబా వారి సందేశమును ను సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి అనేక
ఉదాహారణలతో తెలియజేస్తూ , శిక్షకులకు
నూతన సంవత్సర విశిష్టత, తెలియజేసి అందరికి నూతన
ఉత్తేజాన్ని కలుగజేసారు . స్వామి వారి సందేశము ::
ప్రతి
క్షణము నూతన సంవత్సరమే - కొత్త సంవత్సరములు, కొత్త నెలలు మనకు ఆనందాన్ని, దుఃఖాన్ని, కష్టాన్ని తీసుకొని రావటంలేదు. ప్రతి సెకండ్ కూడను ఒక నూతనమైనటువంటిదే. సెకండ్ లేక నిమిషము రాదు. నిమిషము లేక గంటలు రావు. గంటలు లేక దినములు గడువవు. దినములు లేక నెలలు గడువవు. నెలలు లేక సంవత్సరం కాదు. కాబట్టి ఈ సంవత్సరం అంతయు కూడను క్షణములతోనే ఆధారపడి ఉంటున్నాది. ప్రతి క్షణము కూడను మనము పవిత్రముగా అనుభవించినప్పుడే, ఈ సంవత్సరము నూతన సంవత్సరము అవుతుంది. ఒక్కొక్క క్షణము మనము ఎట్టి కార్యముల చేత, ఎట్టి గుణముల చేత, ఎట్టి ప్రవర్తన చేత కాలము గడుపుతున్నామో. దాని ఫలితమే మన సంవత్సర ఫలితం. స్వామి సందేశానంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు
తెలుపుకుంటూ స్వామి సందేశాన్నివారి దినందిక జీవితంలో అమలు పరిచే విధంగా శక్తిని
ఇవ్వమని స్వామిని వేడుకొన్నారు.
శ్రీ సత్య సాయి పుస్తకాలయం లోని పుస్తకములను అందరు రిజిస్టర్ లో
పేర్లు నమోదు చేసుకొని, శ్రీ సత్య సాయి పుస్తకాలను, ఎవరికి కావాలని, వారి వారి స్థాయిలలో వున్నా
పుస్తకములను తీసుకొని ప్రారంభించారు.
అందరు కలిసి స్వామి వారికీ మంగళ హారతి
ఇవ్వగా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది . ఈ కార్యక్రమంలో దాస పద్మావతి , శ్రీ నరసింహా రావు, శ్రీనివాస్, కల్పన, సరితా, స్వప్న, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు జత చేయడం అయినది .
సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి
Saturday, December 18, 2021
SRI SATHYA SAI SEVA ORGANISATIONS, KOTI SAMITHI, HYD -- ANANDOSTAVAM DT 19-12-2021
భగవాన్ శ్రీ సత్య
సాయి బాబా దివ్య ఆశీస్సులతో, ఈ రోజు, చాల రోజుల తరువాత
ప్రత్యక్ష కార్యక్రమాలలో, పాల్గొనే అవకాశం లభించింది. జి.పుల్లారెడ్డి
బిల్డింగ్, అబిడ్స్ 6వ అంతస్తులో గల శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆన్లైన్
లో నిర్వహించిన అనేక కారక్రమాల వివరాలను, శ్రీ సత్య సాయి
సేవ సంస్థలు కోటి సమితి కన్వీనర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల వారికీ, సవివరముగా వివరించారు.
శ్రీ సత్య సాయి
సేవ సంస్థలు, హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఆన్లైన్ లో డ్రాయింగ్, వ్యాస రచనలో, వేదం, భజన, కోడింగ్ మరియు డీకోడింగ్ మరియు జాతీయ స్థాయిలో
నిర్వహించిన వ్యాస రచన పోటీలో కోటి సమితి బాలవికాస్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, , మరియు జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికీ, జ్ఞ్యాపికలను హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల వారు శ్రీ A. మల్లేశ్వర రావు కోటి సమితి బాలవికాస్ విద్యార్థులు అనేక
బహుమతులు అందజేశారు.
ఈ సందర్భముగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల వారు శ్రీ A. మల్లేశ్వర రావు మాట్లాడుతూ, కోటి సమితి సభ్యులను, మరియు కన్వీనర్ ను అభినందిస్తూ, ముఖ్యంగా ఎంతో నిస్వార్ధంగా తమ పిల్లల వలె చూసుకునే బాల్ వికాస్ గురువులను, ఎంతో మెచ్చుకున్నారు. శ్రీ స్వామి సేవలో, ఉండడమే మన జీవితాలకు విలువైన సమయమని తెలియజేశారు మహాభారతంలోని కర్ణుడు, అర్జునుడు, జీవిత వైవిధ్యము గురించి వివరిస్తూ, ప్రతి మానవుడు, మంచి వైపు ఉండాలని, అప్పుడు భగవంతుడు మనకి అర్జునుడి కి సహాయం చేసినట్లు చేస్తారని తెలియ జేశారు.
ఎప్పుడైతే
భగవంతుడు దగ్గర ఉంటామో మనము జీవితములో మంచి మార్గంలో ఉంటామని, నీవు ఎంత తెలివైన వాడవైనా, క్లాసులో ఫస్ట్ ర్యాంకు వచ్చిన, నీవు చెడుస్నేహాలు, దురలవాట్లు, చెడ్డ సినిమాలు, మొదలైన, వాటికి దూరంగా
ఉన్నప్పుడు మాత్రమే నీవు అర్జునుడిలా విజయం సాధించగలమని, తాత్కాలిక విజయాలకు, తాత్కాలికమైన ఆకర్షణలకు, బానిసలై, మంచితనాన్ని
వదలకూడదు అని, భగవంతుడంటే పూజలు చేయడం, నామాలు శ్లోకాలు పఠించడం, కాదని, మంచితనంతో ఉండమని, చెడుకు దూరంగా ఉండమని అని, సనాతన సారధి మన లకు అండదండగా ఉండి, విజయాన్ని చేకూర్చి పెడతాడని, అప్పుడు మనము భౌతిక ఆధ్యాత్మిక విజయాలను
సాధించవచ్చని ఎంతో విలువైన విషయాన్ని, తెలియజేశారు, ప్రస్తుత సమాజంలో అందరికీ పనికి వచ్చే, ఇంత విలువైన విషయం, అక్షరాల పాటించినప్పుడు, సాయి దేవుడు, కంట ఇంట వెంట జంట, ఉండి, మనలని, సామాజిక పరంగా, ఆధ్యాత్మికపరంగా, మంచితనంతో, మానవ సేవే మాధవ సేవగా, లవ్ వాల్ ,,serve all,help ever, hurt never, ఇంత సేవ చేసిన శ్రీ స్వామి మన నుంచి మంచితనం
తప్ప ఏది ఆశించరు అని ఎంతో విలువైన, జీవితాంతం గుర్తుండిపోయే విధంగా, పిల్లలకి పెద్దలకి, మనసులకు హత్తుకు పోయే విధంగా, తెలియజేశారు
అందరూ జీవితంలో
పైకి రావాలని మంచి మంచి ఉద్యోగాలు చదువులు రావాలని ఆకాంక్షించారు
సమితి కన్వీనర్ స్వాగత వచములు పలికి, వందన సమర్పణ గావించారు.
ఫోటో
హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల వారు శ్రీ A. మల్లేశ్వర రావు గారితో, చిరంజీవి శరణ్య, చిరంజీవి శ్రీ సత్యసాయి భద్రాదేవి, వి చిరంజీవి ఏం సాయి రూప, చిరంజీవి జయ గాయత్రీ నాగ, చిరంజీవి హేమాంగ్, చిరంజీవి లీలాధర్, చిరంజీవి శ్రీ సత్యసాయి భద్రా కృష్ణ, చిరంజీవి పి నాగ, చిరంజీవి ప్రాణవెండర్ రెడ్డి, చిరంజీవి సాయి
గుప్తా,
P VISWESWARA SASTRY,
SAMITHI CONVENOR
WEDNESDAY & THURSDAY NAGARA SANKEERTHA - KOTI SMAITHI. 12-8-2026 AND 13-8-2026
WEDNESDAY NAGARA SANKEERTHA - KOTI SAMITHI 12-8-2026 8th Nagara Sankeerthana at Koti. బుధవారం, 12-8-2026 న కోటి సమితి లో...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అపార దివ్యానుగ్రహంతో, మహాశివరాత్రి అనే పుణ్యపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అఖండ ...
-
16-7-2022 Guru purnima recap done Todays class reg Omkaram Story related to Omkaram Omkaram Bindu Samyuktam Guru Bhajan recap done, Game pl...